Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామిలను వెంటనే నేరవేర్చాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి ఏరియాలోని ఓసీ2, ఓసీ4 గనుల ఏరియాల్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఎంఎస్ ఉపాధ్యక్షులు వీరమనేని రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తరువాత సింగరేణి ఎన్నికల సందర్భాల్లో కారుణ్య నియామకాల్లో అందరికి అవకాశం కల్పిస్తామని, ఆదాయపు పన్ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, ప్రతి కార్మికుని జిల్లా కేంద్రంలో 250 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రైవేటీకరణ, పెర్క్స్పై ఆదాయపు పన్ను కోలిండియా మాదిరిగా చెల్లిస్తామన్నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 24వ తేది నుండి 28వ తేది వరకు స్థానిక అధికారులు మెమోరండం ఇవ్వడం, మార్చి 4వ తేదిన జీఎం కార్యాలయం ఎదుట ధర్నా, మార్చి 13న సీఎంకి మెమోరండం ఇవ్వాలని, స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ ఇచ్చి ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు దాసరి సీత, కేంద్ర కార్యదర్శి సుధాకర్, నాయకులు పైడిపాల మల్లేశం, టిపివి. శివరావు, మల్లికార్జున్, ఎస్ఎల్ఎన్.మూర్తి, సుందరం పాల్గొన్నారు.