Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
తల్లాడ టీవీ9 రిపోర్టర్ దెందుకూరి వాసు(47) మృతికి జర్నలిస్టు నాయకులు, ప్రజా ప్రతినిధులు మంగళవారం నివాళ్లర్పించారు. సత్తుపల్లి నియోజకవర్గ టీవీ9 ప్రతినిధిగా పని చేస్తున్న నారాయణపురం గ్రామానికి చెందిన దెందుకూరి వాసు సోమవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు. సోమవారం రాత్రి మృతదేహాన్ని స్వగృహమైన నారాయణపురంకు తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, తోటి జర్నలిస్టులతో ఆత్మీయంగా ఉండే వాసు మృతితో జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర దిగ్రాంతికి గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. జిల్లాలోని జర్నలిస్టులు మృతదేహాన్ని సందర్శించి నివాల్లర్పించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కల్లూరు : వాసు మృతికి కల్లూరు ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నివాల్లర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షులు ఉబ్బన ప్రభాకర్, కార్యదర్శి రామారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తల్లాడలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాల్లర్పించారు.