Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో మంగళవారం సాయంత్రం కోబ్రా సైనికులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కోబ్రా యువ సైనికుడు ఒకరు మృతి చెందాడు. మరొక సైనికుడు గాయాల పాలయ్యడు. సుక్మా ఎస్పీ సులభ్ సింహ తెలిపిన వివరాల ప్రకారం కిష్టారం పీఎస్ పరిధిలోని సి /208 క్యాంప్నకు చెం దిన కోబ్రా బలగాలు మంగళవారం సాయంత్రం కూంబింగ్ నిమిత్తం అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో మావోయిస్టులు కోబ్రా బల గాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో కోబ్రా బలగాలకు చెందిన యువ సై నికుడు ఇంద్రజిత్ సింగ్ మృతి చెందగా మరో సైనికుడు తీవ్రగాయాలు అవగా అతని వైద్యం నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయపూర్కు తరలించారు కాగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.