Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారానికి తల్లాడకు చెందిన షేక్. ఆయేషా ఎంపికైంది. డెక్కంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లేడీ లెజండ్ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రతిభావంతురాలైన ఆయేషాను ఎంపిక చేశారని విద్యార్థిని తండ్రి అలీ తెలిపారు. జీపీఏ 10/10 సాధించిన ఆయేషాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల విభాగంలో ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేశారని, మార్చి 3న పురస్కారాన్ని ఆమెకు అందిస్తారని తెలిపారు.
శ్మశాన వాటిక ఆక్రమణపై కొరడా..
పెనుబల్లి : మండల పరిధిలోని సూరయ్య బంజర తండాలో డం పింగ్ యార్డు, శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని అదే గ్రామా నికి చెందిన ప్రతాపరెడ్డి ఆక్రమించిన గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి ఆక్రమించాడు. మంగళవారం తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ మ హాలక్ష్మీ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆక్రమణను తొలగించారు. గ్రామ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి ని ఆక్రమించడం పట్ల తహశీల్థార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో ఆర్ఐ జానీమియా, వీఆర్ఓ రమణయ్య పాల్గొన్నారు.