Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఈ నెల 21నుంచి 23వరకు మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చే యాలని ఎస్ఐ సోమా సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని వల్లా పురం మున్నేరు వద్ద గల మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని మంగళ వారం ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్ ఐ మాట్లాడారు. ఆలయ సందర్శనార్థం వచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరి ప్రసాద్, ఎంపీడీఓ డీ.శ్రీనివాసరావు, తహసీల్దార్ టీ. శ్రీనివాస్, ముదిగొండ సొసైటీ అధ్యక్షుడు యలగొండ స్వామి ఉన్నారు.