Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్
- బండారు తులసి తృతీయ వర్ధంతి సభ
నవతెలంగాణ-భద్రాచలం
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ సీపీఐ(ఎం) అభివృద్ధికి కృషి చేయటమే బండారు తులసికి ఇచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవి కుమార్లు అన్నారు. మంగళవారం బండారు తులసి తృతీయ వర్ధంతి సభను సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా తులసీ చిత్రపటానికి బండారు రవికుమార్, వై రవికుమార్లు పూలవ ూలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. బండారు చందర్రావు కుటుంబం నుంచి వచ్చిన తులసి ప్రజల్లో మమేకమై భద్రాచలం నాలుగో వార్డులో పార్టీ అభివృద్ధికి కృషి చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మతఘర్షణలు పెట్టి మతప్రాతిపదికన ప్రజలను చీల్చాలని ప్రయత్నిస్తోందన్నారు. భద్రాచలం ఏజెన్సీలో మొదటి నుండి కమ్యూనిస్టులు బలంగా ఉండటం వల్ల ఈ ప్రాంతం ఎటువంటి అలజడులు, మత ఘర్షణలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాచ లానికి తీవ్ర అన్యాయం చేస్తోంద న్నారు. భద్రా చలం పంచాయతీనా లేక మున్సి పాలిటీనా అని తేల్చి ఎన్నికలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్ర మంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, ఎం రేణుక, కె బ్రహ్మాచారి, ఎంపీటీసీ చేగొండి శ్రీనిy ాస్, పట్టణ నాయకులు బి వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, వై వెంకటరామారావు, నాదెళ్ల లీలావతి, రాజేశ్వరి, బి కుసుమ, సున్నం గంగా, డి సీతాలక్ష్మి, చుక్క మాధవరావు, ఎం నాగ రాజు, ఎస్ డి ఫిరోజ్, ఉస్తేల జ్యోతి, డాక్టర్ సత్యం, లక్ష్మీనారాయణ ,రామ్ గోపాల్ ,ఎన్ వి ఎస్ నారా యణ బండారు సత్యవతి తదితరులుపాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమం పిల్లలకు పండ్లు పంపిణీ
బండారు తులసి తృతీయ వర్ధంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేట కాలనీలోని అనాధాశ్రమంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా తులసి చిత్రపటానికి జిల్లా ఆఫీస్ బేరర్ సభ్యురాలు నాదెళ్ల లీలావతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా టౌన్ అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక మాట్లాడుతూ ఐద్వా నాయకురాలిగా, సెంటర్ మహిళా శాఖ కార్యదర్శి గా, పట్టణ వ్యాప్తంగా అనేక పోరాటాలలో పాల్గొని చురుకైన కార్యకర్తగా ఆప్యాయతానురాగాలు పెట్టింది పేరుగా బండారు తులసి నిలిచారన్నారు. తులసి పేరు మీద ఇప్పటికే నాలుగో వార్డులో ఆటల, పాటల, ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఐద్వా పట్టణ కమిటీ చేపట్టిందని, రాబోయే కాలంలో ఆమె స్పూర్తిని కొనసాగిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతా మన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకురాలు బి కుసుమ, పసుమర్తి రాజేశ్వరి,ఉస్తేల జ్యోతి ,సున్నం గంగా, ఏ సక్కుబాయి, పరిటాల నవోదయ, వెంకటరమణా, జి నాగలక్ష్మి ,బండారు శరత్ బాబు, జి స్వామి , రామక ష్ణ అనాధాశ్రమం పాస్టర్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు .