Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి మరియన్న
నవతెలంగాణ-కొత్తగూడెం
సెరికల్చర్ సాగుతో నికర ఆధాయం లభిస్తుందని ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మంగళవారం గరిమెళ్లపాడులో సాగులో ఉన్న సెరికల్చర్ సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది నికర ఆధాయం ఇచ్చే పంట ఒక కుటీర పరిశ్రమ అన్నారు. దీనిని సన్న, చిన్నకారు, గిరిజన, హరిజన, వెనుకబడిన రైతులు తమ యొక్క వ్యవసాయ భూముల్లో తగిన నీటి వసతి, ఆసక్తి కలిగిన రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సాధించుటకు పట్టు పరిశ్రమ ఒక మంచి అవకాశమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం, అశ్వారావుపేట, అన్నపురెడ్డి పల్లి, దమ్మపేట, పాల్వంచ, ములకలపల్లి, చుంచుపల్లి, పినపాక మండలాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం అధికారి ఎస్. విజరుకుమార్, ఉద్యాన అధికారి కిరణ్కుమార్, సహాయ పట్టుపరిశ్రమ అధికారి సీహెచ్.కామేశ్వరరావు, సాంకేతిక సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.