Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
క్యాట్ లెవెల్ 2 ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో పాల్వంచలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మంగళవారం విద్యార్థుల అభినం దన కార్యక్రమం లో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం రంజిత్బాబు, డీన్ ఎమ్ మధుబాబు, ఒలంపియాడ్ ఇన్చార్జీ టి.అముల్పాలేకర్ మాట్లాడారు. 2019 డిసెంబర్ 8న ఖమ్మంలో జరిగిన క్యాట్ లెవెల్2 పోటీ పరీక్షలో 12 మంది విద్యార్థులు పాలొన్నారన్నారు. ఇందులో 6వ తరగతి చదువుతున్న ఎస్ చరిత్కు ప్రత్యేక బహుమతి, మెడల్, మెరిట్ సర్టిఫికేట్లు సాధిం చగా, డి.సాయికుమార్, ఎ.లౌఖ్య, ఎ.హర్షి ల్ప్రళవ్ విద్యార్థులకు మెడల్స్, మెరిట్ సర్టిఫికేట్లు సాధించగా మిగితా 8మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్లు సాధించినట్టు తెలిపారు.