Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములపై దాడులు ఆపాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని కంపగూడెం గ్రామంలోని పోడు భూములకు ఫారెస్ట్ అధికారులు మంగళవారం ట్రంచ్ కొడుతుండట ంతో సీపీఐ (ఎం) మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, సీఐటీయూ మండల కన్వీనర్ కృష్ణార్జున రావు ఆధ్వర్యంలో గిరిజనులు ఆ పనులను అడ్డుకున్నారు. పనులు నిలిపి వేయాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేయగా వారు పైఅధికారులతో మాట్లాడి భూ హక్కు పత్రాలు తీసుకరావాలని, దీని కోసం గిరిజనులకు రెండు రోజుల గడువు ఇస్తున్నటు అ ధికారులు తెలిపారు. దీంతో ఫారెస్ట్ అధికా రులకు పోడుసాగుదారులకు మద్య ఎటువంటి ఘర్షణలు జరగకుండ పనులను రెండు రోజులు నిలిపి వేశారు. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు నాగరాజు, రాములు, రామారావు, నర్సింహారావు, పోడు సాగుదారులు వీరస్వామి, లక్ష్మి ఉన్నారు.