Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని
నవతెలంగాణ - ఖమ్మంటౌన్
పే రివిజన్ గడువును డిసెంబర్ నెల వరకు పెంచుతూ ప్రభుత్వం జీవో 447ను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని అన్నారు. మంగళవారం ఖమ్మంలోని యూటీఎఫ్ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పీఆర్సీ రిపోర్టును మూడు మాసాల్లోనే పూర్తి చేయడం కోసం ముగ్గురు కమిషనర్లను నియమించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఈ గడువు పెంపుతో రెండున్నరేండ్లు జాప్యం చేస్తున్నారని, ఇది ఉద్యోగులను మోసగించడమేనని విమర్శించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 ఆగస్టునుంచి 27 శాతం తాత్కాలిక భృతిని ఉద్యోగులకు చెల్లిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పీఆర్సీ గడువును పెంచుతూ పోతోందన్నారు. పే రివిజన్ కమిషన్ రిపోర్టును తెప్పించుకుని వెంటనే పీఆర్సీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
యాజమాన్యాల వారీ పదోన్నతులివ్వాలి..
ప్రభుత్వం యాజమాన్యాల వారీగా పదోన్నతులు కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వీరబాబు డిమాండ్ చేశారు. తాత్కాలిక సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఆరు ఏండ్లుగా పదోన్నతుల సమస్య పరిష్కరించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యా రంగానికి నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర భుత్వం సంఘాలతో చర్చించి పదోన్నతులు, ఇతర సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మే 2018 న సీఎం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి హామీలే అమలు కాకపోతే ఉద్యోగులు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపి పీఆర్సీ గడువు పొడిగించడం సరికాదన్నారు. 45 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు విడిపోయినందున జీపీఎఫ్, జీఎల్ఐ ఆఫీసులను కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సుధాకర్, సుభాషిణి, మహబ ూబ్ అలీ, వెంకన్న, ఆంజన ేయులు, పారుపల్లి నాగేశ్వరరావు, రాంబాబు, రంజాన్, గీత, ప్రశా ంతి, షమ్మి, శ్రీకాంత్, మంగీలాల్, రమేష్, రాజేశ్వరరావు, నర్సయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.