Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మా విష్ణువర్దన్
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగర పాలక సంస్థలో పని చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం వేతనర రూ. 24 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్థన్ డిమాండ్ చేశారు. స్థానిక సుందర య్య భవనంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో విష్ణువర్దన్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు జీతాలు వెంటనే పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగింపులు చేస్తునా ్నరని, వారి రోజులు రాకపోతే పేర్లు వెంటనే మార్పులు చేస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రతకై నగర పాలక సంస్థ ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావే శంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జినక శ్రీను, నాయకులు దొడ్డా నరసింహారావు, ప్రసాద్, బి.పద్మ, బుర్రి ఉపేందర్, వెంకట రమణ, సోమే శ్వరి, అనురాధ, పార్వతి, పిచ్చయ్య పాల్గొన్నారు.