Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండలం బాబుక్యాంప్లో శిథిలావస్థలో ఉన్న జెడ్పీ క్వార్టర్స్ను కూల్చేందుకు జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, జిల్లా పరిషత్ సీఈఓ మధుసూదన్ రాజులు అధికారులు, సిబ్బందితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోరం కనకయ్య మాట్లాడారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో 24 క్వార్టర్లు, 8 షాపులు నిర్మించబడి ఉన్నాయని, ఈ భవనాల కాలపరిమితి ముగియడం, శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు. వీటి వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో తక్షణం ఖాళీ చేయాలని క్వార్టర్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు, ఈ క్వార్టర్స్లో నిర్వహించబడుతున్న ప్రభుత్వ కార్యాల యాలకు కూడా నోటిస్లు అందచేసినట్టు తెలిపారు. ఈ భవనాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయం అయిన జిల్లా పంచాయతి కార్యాలయం, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు ప్రత్యా మ్నాయం గా కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాల న్నారు. జెడ్పీ చైర్మెన్ వెంట వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్, పరిపాలన అధికారి పురుషోత్తమ్, పంచాయతీ రాజ్ ఈఈ సుధాకర్, ఎంపీడీవో రమేష్, ఎంపీపీ శాంతి, జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.