Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఈనాడు ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైనవి క్రీడలని, వీటితో ఐక్యమత్యం పెంపొందుతుందని కబడ్డీ అసోషియేషన్ జిల్లా ఛైర్మెన్ హరిసింగ్ నాయక్ అన్నారు. స్థానిక సింగరేణి మైదానంలో రాష్ట్రస్థాయి 67వ కబడ్డి పోటీలు మంగళవారం రెండోరోజుకు చేరుకు న్నాయి. ఈసందర్బంగా పెద్దపల్లి- మహబూబ్ నగర్ జట్లతో కరచాలనం చేశారు. అనంతరం మాట్లాడారు. జిల్లాలు, ప్రాంతాలు ఆచార వ్యవహారాలు వేరైనా అందరం ఒకటే అన్నారు. పట్టుదలతో ఆడుతూ విజేతలయి జిల్లాకు పేరు తేవాల న్నారు. జీవితంలో బాల్యదశ చిరస్మర ణీయమన్నారు. పిల్లలకు, యువతి యువకులకు పెద్దవారికి కూడ క్రీడల పట్ల అనురక్తి సర్వసాధారణమన్నారు. ప్రచార సాధనాలు సైతం క్రీడలకు ప్రత్యేక స్థానం కల్పిస్తు న్నాయన్నారు. మన రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వారెందరో ఉన్నారని వారి బాటలో నడవాల న్నారు. మొత్తం 35 టీముల మధ్య పోటీలు జరిగాయి