Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక హక్కులను కాలరాస్తున్న కేసీఆర్
- సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభలో చాడ
నవతెలంగాణ-ఖమ్మం
దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మత ఘర్షణలకు ఆజ్యం పోస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు ఎఫ్సీఐ గోడౌన్ వద్ద గల మేకల భిక్షమయ్య ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ జిల్లా నిర్మాణ మహాసభ బీజీ క్లెమెంట్, యర్రా బాబు, మందడపు రాణి, కర్నాటి భాను ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు చాడ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పైగా మతాన్ని ప్రజలపై రుద్దుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నేటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్ల ధనాన్ని వెలికి తీసి పేదల సంక్షేమానికి ఆ డబ్బులు ఉపయోగిస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాలన యంత్రాంగం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన మేథావులు, ప్రొఫెసర్లపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. పేదలను విస్మరించి బడాబాబులకు దోచిపెడుతోందన్నారు.
13మంది ముఖ్యమంత్రులు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీర్మా ణించినా వాటిని పట్టించుకోకపోవడం తగద న్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న మోడీ విధానాలపై కమ్యూనిస్టులంతా ఐక్యం కావా ల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో కార్మిక సంఘాలకు చెందిన హక్కులను కాలరాస్తు న్నారన్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వారిపై ఉక్కుపాదం మోపుతూ నేటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారన్నారు. తొలుత సీపీఐ జెండాను సీపీఐ సీనియర్ నాయకులు మహ్మద్ మౌలానా ఆవిష్కరించారు. ఈ సభలో సీపీఐ సీనియర్ నాయకులు, ఖమ్మం మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, మహ్మద్ మౌలానా, ఎస్కె.జాన్మియా, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నరసింహారావు, జమ్ముల జితేందర్రెడ్డి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, మందడపు రాణి, దొండపాటి రమేష్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా కార్యదర్శిగా పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శిగా దండి సురేష్ ఎన్నికయ్యారు.