Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదగిరి శ్రీనివాసరావు సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బీ.వెంకట్
నవతెలంగాణ-వైరా
కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంకితమై పనిచేసే వేదగిరి శ్రీనివాసరావు మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటని, విలువైన కమ్యునిస్టు నాయకున్ని కోల్పొయామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లా వైరా సీపీఐ(ఎం) కార్యాలయంలో జిల్లాకమిటీ సభ్యు డు బొంతురాంబాబు అధ్యక్షతన నిర్వహించిన వేదగిరి శ్రీనివాసరావు సంతాప సభకు తమ్మి నేని హాజరై మాట్లాడారు. తొలుత వేదగిరి మృత దేహాన్ని తమ్మినేని, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వరరరావు సందర్శించి నివాళ్లర్పించారు. అనంతరం సంతాపసభలో తమ్మినేని మాట్లాడుతూ డబ్బుప్రభావం, ప్రలో భాల ప్రభావం మనుషులను లొంగదీసు కుంటున్న వ్యవస్థలో కమ్యూనిస్టుల అవ సరం ఎంతో ఉన్నదన్నారు. ఇలాంటి తరుణంలో అంకితభావం కలిగిన కమ్యూనిస్టు వేదగిరి మరణం తీరని నష్టమన్నారు. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన ఆటుపోట్లలో అత్యంత సన్నిహితులను కూడా ఎదిరించి నిలిచిన శ్రీనివాసరావుకు సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ తరుపున విప్లవ జోహార్లర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొండబాలకోటేశ్వరరావు మాట్లాడుతూ వేదగిరి శ్రీనివాసరావు కపటంలేని మనిషని, నమ్మిన ఆశయం కోసం నిరంతరం పాటుపడుతూనే వైరా మండల రాజకీయాలలో సత్సం ప్రదాయాలు నెలకొల్పాడని అన్నారు. ఎన్ని సిద్ధాంత విభేదాలున్నప్పటికీ సమయానుకూ లంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి అనేక సందర్భాల్లో రాజకీయ ఐక్యతకు కృషి చేశా రన్నారు. శ్రీనివాసరావు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టీ.సాగర్ మాట్లాడుతూ రైతు -వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయ సమావేశాలలో కూడా శ్రీనివాసరావు వ్యక్తిత్వం గమనిం చామన్నారు. ప్రజాఉద్యమాలకు ఆయన లేని లోటు ఉంటుందని అన్నారు. సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లాకార్యదర్శి నున్నానాగేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపుకనకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రి ప్రసాద్, జెవివి రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభ ద్రరావు, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్ రాజు దంపతులు తదితరులు పాల్గొన్నారు.
వ్యకాస ఆలిండియా కౌన్సిల్ సంతాపం
వ్యవసాయకార్మిక సంఘం ఆలిండియా కౌన్సిల్ సభ్యుడు వేదగిరి శ్రీనివాసరావు మృతికి సంఘం ఆలిండియా కౌన్సిల్ తీవ్ర సంతాపం తెలిపింది. సీపీఐ(ఎం) బలంగా ఉన్న కేరళ, బెంగాల్ రాష్ట్రాల ఉద్యమాల తర్వాత అత్యంత బలమైన ఉద్యమం, లక్షలాది సభ్యత్వం కలిగిన ఖమ్మం జిల్లా వ్యవసాయ కార్మికోద్యమానికి జిల్లాకార్యదర్శిగా నాయకత్వం వహిస్తూ క్యాన్సర్ వ్యాధితో మరణించిన వేదగిరి శ్రీనివాసరావుకు ఆలిండియా కౌన్సిల్ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈమేరకు కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు విజయరాఘవన్ ,బివెంకట్ సంతాపం తెలిపారు.
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు సంతాపం
వేదగిరి శ్రీనివాసరావు మృతికి సిపియం పోలిట్బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ప్రగాఢ సంతాపం తెలిపారు. హైద్రాబాదులో తాను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడానని ,త్వరలో కోలుకుంటానన్న ఆత్మ విస్వాసం ప్రకటించాడని ఇంత త్వరగా మృత్యువుకు చేరువ అవుతాడని ఊహాంచలేదని ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు. శ్రీనివాసరావు కుటుంబాని కి తన సాను భూతి తెలిపారు.
ఎర్రుపాలెం : వ్యకాస జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు మృతికి సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, వ్యకాస మండల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎర్రుపాలెంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, వ్యకాస మండల అధ్యక్షులు గామాసు జోగయ్య, సీఐటీ యూ మండల కార్యదర్శి బేతి శ్రీనివాసరావులు మాట్లాడారు. వైరాలో బుధవారం 9 గంటలకు నిర్వహించనున్న సంస్మరణ సభ, అంతిమ యాత్రలో పాల్గొనాల్సిందిగా పార్టీ సభ్యులు, మండల నాయకులకు సూచించారు. సమావేశంలో కోటి సుబ్బారెడ్డి, బాలరాజు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
వ్యకాస జిల్లా కమిటీ సంతాపం
ఖమ్మం : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు మృతికి ఆ సంఘం జిల్లా కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల లెనిన్, జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు సత్య నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి పొన్నెకంటి సంగయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల్లో తనదైన ముద్రను వేసుకొని పోరాడిన గొప్ప యోధుడన్నారు. పేద ప్రజలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన అనేక ఉద్యమాలకు నియకత్వం వహించి పోరాడిన నాయకుడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పార్టీ శ్రేణులను కోరారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంతాపం....
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు ఒక ప్రక టనలో సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.
మధిర : వేదగిరి శ్రీనివాసరావు మృతికి సీపీఐ(ఎం) మధిర మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. స్థానిక సీపీఐ (ఎం) కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో నివాళ్లర్పించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, 22 వార్డు కౌన్సిపల్ కట్టా గాంధీ, పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, మండల కార్యదర్శి మందా సైదులు, పాపినేని రామ నర్సయ్య, మండవ కృష్ణారావు, ఊట్ల శంకర్ రావు, ప్రభాకర్, మురళి, నాయకులు ఘన నివాల్లర్పించారు.
కొణిజర్ల : వేదగిరి శ్రీనివాసరావు మృతికి సీపీఐ(ఎం) కొణిజర్ల మండల కమిటీ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ మండల కమిటీలు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేదగిరి శ్రీనివాసరావు మృతి పార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఒక ప్రకటనలో కోరారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణ య్య, మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ, వ్యకాస మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబ రావు, రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, ప్రతాపనేని లక్ష్మయ్య, మోత్కూరి వెంక టేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, సంక్రాంతి నర్సయ్య, దొండపనేని కృష్ణార్జునరావు, చింత నిప్పు చలపతిరావు, ఎస్కె. సైదా, కట్టా రాంబాబు నివాళ్లర్పించారు.
జూలూరుపాడు : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు మృతదేహానికి సీపీఐ(ఎం) నాయకులు వైరా పార్టీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో కొండలరావు, ధర్మా, చీమలపాటి బిక్షం, కనకయ్య ఉన్నారు.