Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ సర్వేలో విద్యార్థులు, పేరెంట్స్ సూచన
- 4,860 మంది విద్యార్థులు, 2345మంది పేరెంట్స్ సర్వే
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ను నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్-19నిబంధలు పాటిస్తూ పాఠశాలలు పున:ప్రారంభించాలని ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నిర్వహణ, పాఠశాలల ప్రారంభం, ఆన్లైన్ క్లాసుల బోధనకు గల అవకాశాలు, తదితర అంశాలపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను క్షేత్రస్థాయి నుండి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) సేకరించింది. ఈ సర్వేలో భాగంగా ఖమ్మం జిల్లాలోని 142 మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న గ్రామాలు, పరిసర గ్రామాల్లో జూన్22 నుండి 27వరకూ పర్యటించి, స్వచ్ఛందంగా సర్వే నిర్వహించారు. ఇందుకు సంబంధించి 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం...
సర్వే వివరాలు ఇలా ఉన్నాయి...
సర్వేచేసిన మండలాలు 21
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, వార్డులు 144
సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు 2345
సర్వేలో పాల్గొన్న విద్యార్థులు 4,860
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు 1,642
ప్రయివేటు పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు 703
పాఠశాలలను పున:ప్రారంభించాలన్న తల్లిదండ్రుల శాతం 93
యూటీఎఫ్ సర్వే ద్వారా సర్కారుకు సూచించిన వివరాలివే...
టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని, రాష్ట్ర కార్యదర్శి బండి నర్సింహారావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, నెల్లూరి వీరబాబు తదితరులు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పి. మదన్మోహన్ ద్వారా విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. వాటిలో ప్రధానంగా ప్రస్తుత విద్యాసంవత్సరం వృధాకాకుండా పాఠశాలలు ఆఫ్లైన్లో ప్రారంభించాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం మెనూను పెంచి పాఠశాలల పున:ప్రారంభం వరకూ, ఆ తరువాత కూడా కోవిడ్ ప్రభావం తగ్గేవరకూ విద్యార్థుల ఇండ్లకు భోజనం సరఫరా చేయాలని తీర్పునిచ్చారు. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఆన్లైన్ బోధన ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదని తెల్చిచెప్పారు. ఉపాధ్యాయుని బోధనకు ఆన్లైన్ తరగతులు సహాయ కారిగా మాత్రమే ఉండాలని పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం లేని గ్రామీణ ప్రాంతాల్లో (మహారాష్ట్ర వలే) భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్, తదితర జాగ్రత్తలు పాటిస్తూ వీలైనంత త్వరగా పాఠశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి.
భౌతిక దూరం పాటించడానికి వసతి సరిపోని పాఠశాలల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు ఫిఫ్టులలో పాఠశాలలు నడపాలని కోరారు. మొదట 10,9 తరగతులు, ఆ తరువాత 8,7,6తరగతులు, ఆ తరువాత 5,4,3,2,1తరగతులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేరళ మోడల్లో తాత్కాలికంగా ఆన్లైన్ బోధనను నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు, గ్రామపంచాయతీలకు, టీవీలు, కంప్యూటర్లు, సరఫరా చేసి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించి, ఆన్లైన్ బోధనకు వినియోగించుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి మాస్కుల, సబ్బులు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలు స్థానిక ప్రభుత్వాలకు అప్పగించి, సంబంధిత సిబ్బందిని నియమించి అదనపు నిధులు కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలతో పాటు, నోట్పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు కూడా సరపరా చేయాలని కోరారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ కోవిడ్-19పరీక్షలు నిర్వహించాలి. టీఎస్ యూటీఎఫ్ నాయకులు షేక్ మహబూబ్ అలీ, బుర్రి వెంకన్న, పారుపల్లి నాగేశ్వరరావు, వి. రాంబాబు, శ్రీకాంత్, పి. సురేష్, ఉద్దండు షరీఫ్, రవికుమార్, రమేష్, ఎన్. నవీన్కుమార్, పి. విద్యాసాగర్, ఏ. రామకృష్ణ, సీహెచ్ శ్రీనివాసరావు, గురవయ్య డీఈవోకు నివేదిక అందజేశారు.
సర్వేలో వెల్లడైన అంశాలివే...
సర్వేచేసిన కుటుంబాలు 2,345.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పాఠశాలలు 3,538(72.88శాతం),
ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు 1,322(27.12)
కుటుంబానికి గల స్మార్ట్ఫోన్లు
ఒకటే ఫోన్ ఉన్న కుటుంబాలు 955 (40.74శాతం)
రెండు ఫోన్లు ఉన్న కుటుంబాటు 173(7.41శాతం)
అసలే స్మార్ట్ సెల్ఫోన్ లేనివాళ్లు 1,042(44.44శాతం)
స్మార్ట్ఫోన్ ఉన్నా పిల్లలకు ఇచ్చే వెసులుబాటు ఉన్న కుటుంబాలు 28.87శాతం
వెసులుబాటు లేని కుటుంబాలు 71.13శాతం
ఫోన్లో డేటా కనెక్షన్ ఉండి, ఆన్లైన్ క్లాసులకు సరిపోయే కుటుంబాలు 181(13.89శాతం)
డేటా ఉన్నా సరిపోదన్న వారి సంఖ్య 362(27.78శాతం)
అసలు డేటా కనెక్షన్ లేని విద్యార్థుల కుటుంబాలు 760(58.33శాతం)
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కుటుంబాలు 204(8.70శాతం)
ఇంటర్నెట్ లేని కుటుంబాలు 2,141(91.30శాతం)
ఇంట్లో టీవీ ఉన్న కుటుంబాలు 1,880(80.19శాతం)
టీవీ లేని కుటుంబాలు 465(19.81శాతం)
టీవీ ఉన్న పాఠశాలలు 1,736(35.71శాతం)
టీవీ ఉన్నా వినియోగంలో లేని పాఠశాలలు 810(16.67శాతం)
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పాఠశాలలు 1,041(21.43శాతం)
ఇంటర్నెట్ సౌకర్యం లేని పాఠశాలలు 3,124(64.29శాతం)
ఇంటర్నెట్ గురించే తెలియని పాఠశాలలు 695(14.29శాతం)
టీవీ ఉన్న గ్రామపంచాయతీలు 405(8.33శాతం)
పంచాయతీల్లో టీవీ లేని వారు 3,645(75శాతం)
పంచాయతీల్లో టీవీ ఉన్నదీ, లేనిదీ తెలియదన్న వారు 810(16.67శాతం)
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పంచాయతీలు 405(8.33శాతం)
ఇంటర్నెట్ సౌకర్యం లేదన్నవారు 3,645(75శాతం)
ఇంటర్నెట్ గురించి తెలియదని చెప్పిన వారు 810(16.67శాతం)
పాఠశాలకు కాలినడకన వెళ్లేవారు 3,029మంది(62.33శాతం)
బస్లో వెళ్లేవారు 673(13.85శాతం)
ఇతర వాహనాలు 1,158(23.46శాతం)
మంచినీటి వసతి ఉందన్న పాఠశాలలు 4,008(82.47శాతం)
మంచినీటి వసతి లేదన్నవారు 401(8.25శాతం)
ఉంది కానీ తాగలేదన్న వారు 451(9.28శాతం)
మరుగుదొడ్లు, పారిశుధ్యం ఉన్నాయన్న పాఠశాలలు 4,008(82.47శాతం)
లేదన్న వారు 401(8.25శాతం)
ఉంది కానీ సౌకర్యం లేదన్న వారు 451(9.28శాతం)
గ్రామంలో ప్రభుత్వ వైద్యశాల ఉందన్నవారు 1,767(36.36శాతం)
వైద్యశాల లేదన్నవారు 3,093(63.64శాతం)
ప్రభుత్వ వైద్యులున్నారని వెల్లడించిన వారు 1,389(28.57శాతం)
వైద్యులు లేరన్నవారు 3,471(71.43శాతం)
పాఠశాలల పున:ప్రారంభం కావాలన్న తల్లిదండ్రులు 2,132(90.91శాతం)
ఆన్లైన్లో ప్రారంభించాలన్న తల్లిదండ్రులు 213(9.09శాతం)
ప్రయివేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారన్న వారు 144(10.89శాతం)
నిర్వహించడంలేదన్న వారు 1,178(89.11శాతం)