పసుపులో దుంప కుళ్లు నివారణ ఎలా?
- రాథోడ్, జన్నారం (మంచిర్యాల జిల్లా)
ఎండు లక్షణాలు మొదట ఆకుల అంచు నుంచి మొదలవుతాయి. ఆకంతా వ్యాపిస్తాయి. మొక్కలో కొన్ని వేర్లు మాత్రం గోధుమ రంగులో ఉండి, మిగిలినవి కుళ్లిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ కలిపి మొక్కల చుట్టూ తడపాలి.
మొక్కజొన్నలో కండె పురుగును ఎలా నివారించాలి?
- శ్రీశైలం, మద్దిరెడ్డిపల్లి
(నవాబ్పేట మం, వికారాబాద్ జిల్లా)
మొక్కజొన్న కండెను గులాబీ రంగు, శనగపచ్చ పురుగులు నష్టపరుస్తాయి. వీటి నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల క్వినాల్ఫాస్ 2.5 మి.లీటర్ల క్లోరపైరిఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
సోయా చిక్కుడును పచ్చపురుగు ఆశిస్తోంది. ఏం చేయాలి?
- శ్రీధర్, నేరడిగొండ (ఆదిలాబాద్ జిల్లా)
సోయాబీన్ ఆకులను పచ్చపురుగులు గోకి తిని నష్టపరుస్తాయి. నివారణకు లీటరు నీటిలో 2.5 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మి.లీటర్ల మోనోక్రోట్ఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
బీర ఆకు పసుపు రంగులోకి మారుతోంది. ఎలా నివారించాలి?
-లక్ష్మణ్, ముత్తారం (పెద్దపల్లి జిల్లా)
బూడిద ఆకు తెగులు ఒక మాదిరి రంగులో ఉంటుంది. చల్లని వాతావరణంలో ఇది ఆశిస్తుంది. మొదట లేత ఆకుపచ్చ, ముదురాకు పచ్చ కలిపి మొజాయిక్లా కనిపిస్తుంది. తర్వాత ఆకులపై పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఉదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి 25 గ్రాముల మాంకోజెబ్ లేదా 2గ్రాముల మెటలాక్సిల్ కలిపి పిచికారీ చేయాలి.
సపోటలో మేలైన రకాలు ఏవి?
- శేఖర్, చిట్యాల (నల్లగొండ జిల్లా)
క్రికెటోబాల్, పాల, ద్వారపూడి, కీర్తిబర్తి, కాలిపత్తి, పీకే ఎం-1, పీకెేఎం -3, డీహెచ్, ఎన్61,2
సేకరణ:మోత్కూరి యాదయ్య
Authorization