కందిలో ఆకు చుట్టు పురుగు నివారణ ఎలా?
- నారాయణ, కామారెడ్డి
కంది పంట ఎదిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీకి తింటుంది. దీంతో ఆకులు తెల్లగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 3 మి.లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా క్వినాల్ఫాల్ కలిపి పిచికారీ చేయాలి.
వరిలో తెల్ల తెగులును ఎలా నివారించాలి?
- సురేష్, దొండపల్లి (మంచిర్యాల జిల్లా)
ఆకులు నిలువుగా ముడుచుకుంటుంది. తెల్లని గీతలు ఏర్పడతాయి. ఆకు ముడతలు విడదీస్తే లేత పసుపు లేదా ఆకుపచ్చ లార్వాలు కనిపిస్తాయి. దీని నివారణకు పిలక దశలో 2.5 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5గ్రాముల ఎసిఫేట్ లేదా 2గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.25 గ్రాముల ప్లూబెండమైడ్ 20 డబ్ల్యూడీ పిచికారీ చేయాలి.
మొక్కజొన్నను వడలు తెగులు నుంచి ఎలా కాపాడాలి?
- నిరంజన్, కొత్తగూడెం
ఈ తెగులు కారణంగా మొక్కలపై నుంచి కిందికి వడలి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారిపోతాయి. తర్వాత ఎండిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినప్పుడు ఎరుపు, గోధుమ రంగుకు మారిన బెండును గమనించొచ్చు. దీని నివారణకు 2 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రాన్ని 100 కిలోల పశువుల ఎరువుతో వృద్ధి చేసి వరుసగా మూడు, నాలుగు సంవత్సరాలు భూమిలో కలపాలి.
వేరుశనగను నల్లి ఆశిస్తోంది. ఏం చేయాలి?
- సోమయ్య, వర్ధన్నపేట (వరంగల్ రూరల్ జిల్లా)
పిల్ల, తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి రసం పీల్చుతూ ఉంటాయి. ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకుపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 5 మి.లీటర్ల డైకోఫాల్ లేదా ఒక మి.లీటరు ప్రొపైర్గైట్ కలిపి పిచికారీ చేయాలి.
బెండలో పల్లాకు తెగులు నివారణ ఎలా?
- భూపాల్, మోత్కూరు (యాదాద్రి జిల్లా)
పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన ఆకులు పసుపు రంగుకు మారి గిడసబారి తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా ట్రైజోఫాన్ కలిపి పిచికారీ చేయాలి.
Authorization