వ్యవసాయ అనుబంధ పశుపోషణపై రైతులు మక్కువ చూపుతున్నారు. పశుసంపదపై ఆదాయం సంపాదిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో పశువుల మేతకు సుమారు 70 శాతం ఖర్చు పెడుతున్నారు. అయితే... చౌకగా లభ్యమయ్యే పశుగ్రాస పంటలను పచ్చిమేతగా వాడడం వల్ల ఖర్చుతగ్గి పాల ఉత్పత్తి పెరుగుతుంది. పశుపోషణ లాభదాయకంగా ఉంటుంది. పచ్చిమేత తినడానికి పశువులకు సులువుగా ఉం టుంది. అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. అధిక పాల ఉత్పత్తి సామర్థ్యమున్న సంకరజాతి ఆవులు, గేదెలకు అధిక పాల దిగుబడికి పచ్చి మేత అవసరం. అందువల్ల రైతులు అధిక పచ్చిమేత దిగుబడికి ఒక ప్రణాళికాబద్ధంగా పశుగ్రాస పంట సరళిని ఎన్నుకొని పండించుకోవాలి. పశువులకు మేతగా ఉపయోగించే పంటల్లో ధాన్యపుజాతి, గడ్డిజాతి, పప్పుజాతి పంటలు ముఖ్యమైనవి.
ధాన్యపు జాతి పశుగ్రాస పంటలు
ఏకవార్షికాలు : జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఓట్స్,
బహువార్షికాలు: బాజ్రా, నేపియర్, హైబ్రిడ్లు
పప్పుజాతి పశుగ్రాసాలు
ఏకవార్షికాలు : బొబ్బెర్లు, ఉలవలు, గోరుచిక్కుడు, పిల్లిపెసర, జనుము, బర్సీమ్
బహువార్షికాలు: ల్యూసర్స్, స్రైలో, దశరధ గడ్డి
గడ్డిజాతి పశుగ్రాసాలు గినీ గడ్డి, పారాగడ్డి, దీనానాథ్గడ్డి, అంజన్గడ్డి, రోడ్స్గడ్డి, క్రైసోపోగాన్, సెహిమాగడ్డి, సిగల్ గడ్డి.
సాగుకు అనుకూలమైన పశుగ్రాసపు చెట్లు : సుబాబుల్, అవిశ, విప్ప.
వివిధ కారణాల వల్ల ఆహార పంటల సాగుకు అనుకూలంగా లేని భూములో ఈ కింది సూచించిన పశుగ్రాసాన్ని సాగు చేసుకుని రైతులు లబ్ధిపొందొచ్చు.
ఆమ్ల నేలలల్లో : మొక్కజొన్న(ఆఫ్రికన్ టాల్) బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు, గినీగడ్డి (హమిల్)
చౌడు నేలల్లో : రోడ్స్గడ్డి, సూడాన్ గడ్డి (రకం ఎస్ఎస్జి 59-3) ఓట్స్ (కెంట్, ఓఎస్్-6), బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు, సజ్జ (ఎస్డీఎఫ్డీ-2) లూసర్న్ (టీ-9)దశరధగడ్డి (హైడ్జ్లూసర్న్) పారాగడ్డి, బర్సీం(మెస్కావి)
సున్నపు నేలల్లో : జొన్న (పీసీ-7) సజ్జ (రాజ్కోబాజ్రా) బాజ్రానేపియర్ హైబ్రిడ్లు
నీరు నిలువ ఉండే నేలల్లో : పారాగడ్డి, బాజ్రానేపియర్ హైబ్రిడ్లు, (కొన్ని నెలరోజుల వరకు తట్టుకుంటాయి) బంజరు, పడావు భూముల్లో స్టైలో, అంజన్గడ్డి.
రైతులు ఇవి గుర్తించుకోవాలి...
గడ్డిజాతి పశగ్రాస విత్తనాలు పరిమా ణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. కనుక వాటిని 2సెం.మీ కంటే ఎక్కువ లోతు లేకుండా విత్తు కోవాలి. నాణ్యతగల అధిక పచ్చిమేత దిగు బడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50శాతం పూత దశలో కోయాలి. పశువుల మేతలో మూడు వంతుల గడ్డిజాతి పశుగ్రాసంతోపాటు ఒక వంతు పప్పుజాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వల్ల అధిక పోషక విలువలున్న పచ్చిమేత లభిస్తుంది. పశుగ్రసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్తో చిన్న ముక్కలుగా కత్తిరించి వేస్తే పశువులు అధిక మేత తింటాయి. వృథాను అరికట్టొచ్చు. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయకపోతే పశువులకు నాము వ్యాధిసోకే అవకాశం ఉంటుంది. పొలం చుట్టూ సుబా బుల్, అవిశ చెట్లను పెంచ డం వల్ల వేసవి కాలంలో పశువుల మేత సమృద్ధిగా అందిం చొచ్చు. అంతే కాకుండా మన పరిసరాల్లో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్పచెట్లు, రావిచెట్లు, మర్రెచెట్లు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకొని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించొచ్చు. ట్యూసర్న్లో బంగారుతీగ పర్నాకలుపు నివారణకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో రెండు మిల్లీ లీటర్ల ఇమాజితపైర్ అనే కలుపు మందులను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట మార్పిడి చేసుకోవాలి. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకి 15నుంచి 20 రోజల ముందే పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశముంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70రోజులకు తదుపరి కోతలను 45రోజులకు కోసుకోవాలి. ఈ గ్రాసంలో మూడేళ్ల తర్వాత దుబ్బుకు 50నుంచి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అలాగే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్ని పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. స్టైలో విత్తనాలను 80 సెంటీగ్రేడ్ వద్ద వేడినీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటినీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్వి పాశ్చరుగా (పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్విపాశ్చర్ అంటారు) అభివృద్ది చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేతే లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిశ, ఇప్పచెట్లు, వంటి పశుగ్రాసాలైన బాజ్రా నేపియర్ లేదా అంజన్గడ్డి లేదా గినిగడ్డి లను, పప్పుజాతి పశుగ్రాసాలైన దరశరధగడ్డి లను అంతర పంటలుగా వేసుకోవచ్చు.
Authorization