గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28-35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 11-22 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 28-34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 10-21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు.
సాగు సూచనలు
వరి: రబీలో నవంబరు 15 తర్వాత వరి నారు పోసుకునేందుకు అనుకూలం. ఎకరానికి సరిపడా నారుమడి ఆఖరి దుక్కిలో 500 గ్రాముల జింక్ సల్ఫేట్ని వేయాలి. కంకినల్లి లక్షణాలు (మధ్య ఈనెపైన ఎర్రని ధారలు/ పోటాకు పైన ఎర్రని మచ్చలు) గమనించినట్టయితే లీటరు నీటిలో ఒక మి.లీటరు స్పైరోమెసిఫెన్ లేదా 5 మి.లీటరు డైకోఫాల్ లేదా 2 మి.లీటరు ప్రొఫినోఫాస్ కలిపి 10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గితెగులు/ మెడవిరుపు తెగులు ఆశించేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటిలో 1.5 మి.లీటర్ల ఐసోప్రోథయొలేన్ లేదా 2.5 మి.లీటర్ల కాసుగామైసిన్ లేదా 0.5 గ్రాము ట్రైసైక్లోజోల్ కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆలస్యంగా నాట్లు వేసి పూత దశలో ఉన్న వరిలో సుడిదోమ ఉధృతి (20-30 పురుగులు/ డబ్బుకు) పెరుగుతుంది. దీని నివార ణకు లీటరు నీటిలో 1.5 మి.లీటర్ల ఎసిఫేట్, 1.6 మి.లీటర్ల బుప్రోఫెజిన్ కలిపి మొక్కల మొదళ్లపై పడే విధంగా పిచికారీ చేయాలి. ఒకవేళ దోమ ఉధృతి (30-100పురుగులు) మరీ ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 0.4 గ్రాముల డినోటెప్యూరాన్ లేదా 0.6 గ్రాముల పైమిట్రోజైన్ లేదా ఎథిప్రోల్, 0.25 గ్రాము ఇమిడాక్లోప్రిడ్ కలిపి మందులను మార్చి 7-10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. దోమ ఉధృతికి దోహదపడే మందులైన క్లోరిపైరిఫాస్, ప్రోఫెనోఫాస్, సింథటిక్ పైరథ్రాయిడ్స్, వివిధ బయో మందులు వాడొద్దు.
మొక్కజొన్న: ఈ పంట వేసేందుకు నవంబరు 15 వరకు అనుకూలమైన సమయం. పైరు మొలిచిన 10 నుంచి15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల క్లోరిపైఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. పైరు 25 నుంచి 30 రోజుల దశలో కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి 3 నుంచి 4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.
పత్తి: ఈ పంటలో గులాబీ రంగు పురుగు ఉనికి గమనించినట్టయితే లీటరు నీటిలో 2 మి.లీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 2.5 మి.లీ క్వినాల్ఫాస్ మందును వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వేరుశనగ: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగ కాండం కుళ్లు తెగులు ఆశించేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటిలో ఒక మి.లీటరు టిబ్యుకొనజోల్ లేదా ఒక గ్రాము కార్బండజిమ్ కలిపి కాండం అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. వేరుశనగలో ఆకుమచ్చ తెగులు సోకేందుకు కూడా అనుకూలం. నివారణకు లీటరు నీటిలో 2.0 గ్రాముల మ్యాంకోజెబ్, కార్బండజిమ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లేదా ఒక మి.లీటరు టేబ్యుకోనజోల్ లేదా ఒక గ్రాము కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగ పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఎకరానికి 200 కిలోల జిప్సాన్ని పైపాటుగా వేయాలి.
కంది: ఈ పంట ప్రస్తుతం మొగ్గ లేదా పూత దశలో ఉంది. దీనికి మరుక గూడు పురుగు సోకే సూచన లున్నాయి. ఈ పురుగు రెండు లేదా మూడు మొవ్వులను ఒక దగ్గరకు చేర్చి గూడు చేసి పూతను తింటాయి. నివారణకు 5 మి.లీటర్ల వేప పిండి కషాయం 0.5 శాతం లేదా వేపనూనె మొగ్గ దశలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బట్టి లీటరు నీటిలో 2 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్, ఒక మి.లీటరు డైక్లోరోవాస్ లేదా 0.2 మి.లీటర్ల ప్లుటెండమైడ్ లేదా 0.3 మి.లీటర్ల స్పినోసాడ్ లేదా 0.3 మి.లీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ కూరగాయ పంటల్లో ూడిద తెగులు సోకేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా మి.లీటర్ల కేరాతేన లేదా 2 మి.లీటర్ల హెక్షకొనజోల్ ముందును కలిపి పిచికారీ చేయాలి.
Authorization