పంటల ప్రధాన వనరుల్లో ఎరువుల పాత్ర కీలకం. పైరుకు ఇవి పోష కాలు అందించి అధిక దిగుబడులు అందిం చేందుకు దోహదపడతాయి. అయితే.. వీటి వినియోగం విషయంలో జాగ్రత్తలు ప్రధానం. లేదంటే పంట ఖర్చు పెరగడంతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. తగిన మోతాదులో ఎరువుల వాడితేనే అన్నిరకాల నష్టాల నుంచి రక్షణ పొందొచ్చు.
నత్రజని ఎరువులు
ఈ ఎరువుల ద్వారా పంటలకు 25 నుంచి 35శాతం మాత్రమే నత్రజని అందుతుంది. అమ్మోనియా రూపంలో ఆవిరి కావడం, సేంద్రియ రూపాన్ని సంతరించుకోవడమే దీనికి కారణం. అందుకే.. అవసరాన్నిబట్టే పంటలకు ఈ పోషకాలను అందించాలి. ఎరువు వేసే పద్ధతి కూడా ముఖ్యమైనదే. నీరు ఎక్కువ నిల్వ ఉంచాల్సిన వరి పొలంలో యూరియా రూపంలో అందిస్తే అత్యంత స్థిరత్వం కలిగిన అమ్మోనియా రూపంలో నత్రజని ఎక్కువగా అందు బాటులో ఉంటుంది. ఆమ్లత్వం కలిగిన ఎత్తైన నేలల్లో కూడా అమ్మోనియా ఆధారిత నత్రజని ఎరువులు వేయడం ద్వారా వర్షాకాలంలో అమ్మోనియా మృతికా కణాలకు అతుక్కొని నష్టపోకుండా ఉంటుంది. అతకబడిన అమ్మోనియా నైట్రిఫికేషన్ పద్ధతి ద్వారా నెమ్మదిగా విడుదలవుతూ దీర్ఘకాలం పంటలకు నత్రజని అందిస్తుంది. అత్యధిక అమ్లత్వం కలిగిన మెరక నేలల్లో అమ్మోనియం సల్ఫేట్కి బదులు యూరియా రూపంలోనే ఇవ్వడం మేలు. తక్కువ వర్షపాతం కలిగిన క్షారత్వ మెరక నేలల్లో నైట్రేట్ రూపంలో అందించాలి. యూరియా లేదా అమ్మోనియా ఆధారిత ఎరువుల రూపంలో వాడితే అవిరి రూపంలో నష్టం జరిగే అవకాశం ఉంది. అన్ని ఎరువులు కోల్పోయే స్వభావం ఎక్కువ. పంట మొత్తం కాలంలో నత్రజని పోషకం అవసరం ఉంటుంది. పంట ఎక్కువ మోతాదులో తీసుకోవాలంటే దశల వారీగా అందించాలి. దీర్ఘకాలిక, బహువార్షిక పంటలకు ఎక్కువ దశలలో ఎరువులు వేయాలి. అందుకు అనుగుణంగా సిఫార్సు చేసిన మొత్తం ఎరువును ముందే విభజించుకోవాలి. తక్కువ ధన అయాను మారక సామర్థ్యం కలిగిన మొరపు, ఇసుక నేలల్లో నత్రజని నష్టం ఎక్కువ. కాబట్టి ఇసుక, ఇతర తేలికపాటి నేలల్లో ఎక్కువ దఫాలుగా ఎరువులు వేయాలి. మధ్యకాలిక వరి వంగడాలకు మూడు దఫాలుగా దమ్ము చేసేటప్పుడు పిలకల దశ, కంకి పడే దశలో వేయాలి. ముతక నేలల్లో మొత్తం ఎరువు వివిధ దశల్లో మూడు నాలుగు దఫాలుగా వేయాలి. పంట వేసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు నీటి నిల్వ వల్ల నత్రజని ఎరువులను వేయడం కుదరకపోతే మరో పద్ధతిని అవలంబించొచ్చు. మొత్తం ఎరువును వేప లేదా బొగ్గు పూసిన నత్రజని ఎరువులను ఒకే దఫాగా దమ్ము చేసేటప్పుడే వేసుకోవచ్చు. రెండు పంటలు వేసే మాగాణి నేలల్లో మొదటి పంటకు సిఫార్సు చేసిన ఎరువుల్లో 50శాతం సేంద్రియ ఎరువుల రూపంలో అందించడం మేలు. తర్వాత పంటకు అందుబాటులో ఉంటుంది. భూముల భౌతిక స్థితి మెరుగవుతుంది. ఆమ్ల భూము లను సవరిం చాలంటే సున్నం ఆధారిత పదార్థాలు వాడాలి. అయితే... యూరియా లాంటి అమ్మో నియా రూపంలో నత్రజనిని అందించే ఎరువులు వాడేటప్పుడు సున్నం ఒకటి రెండు వారాల ముందే వేయాలి. ఒకేసారి వేస్తే అమ్మో నియారూపంలో ఆవిరయ్యే ప్రమాదం ఉంది. యూరియాను వెదజల్లినప్పుడు 70శాతం నత్రజని వివిధ రూపాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది.
నష్టాన్ని తగ్గించే మార్గాలు
బంక మట్టి నేలలు, కిలో మృతికలో 10 సీఎండీ కంటే ఎక్కువ ధన అయానుమారక సామర్థ్యం ఉన్న నేలల్లో యూరియాను గుళికలు, గుండ్ల రూపంలో అందించాలి. నీటి నియంత్రణ కష్టమైన నేలలు, తరచుగా ముంపు ఎదురయ్యే నేలల్లో సల్ఫర్ లేదా లక్కపొర వేసిన యూరియాను వాడాలి. నేరుగా విత్తిన పంటలకు లోతైన నేలల్లో నత్రజని, యూరియా రూపంలో వాడేందుకు ముందు ఇంకా ఇది మేలు. తడిచిన మట్టితో యూరియా కలిపి 24నుంచి 48 గంటలలు నీడలో ఆరబెట్టాలి. యూరియాను ఐదు రెట్లబరువున్న వేప చెక్కతో కలిపి వాడితే నత్రజని నెమ్మదిగా ఎక్కువ కాలం పంటకు అందుతుంది. మాగాణి వరి పొలాల్లో వేప చెక్కతో కలిపే ముందు 100 కిలోల యూరియాను లీటరు కిరోసిన్తో రెండు కిలోల బొగ్గుతారును కలపాలి. ఐదు శాతం వేప పదార్ధాలతో శుద్ధి చేసిన యూరియాను గంట లేదా గంటన్నర ఆరబెట్టి నేరుగా విత్తే దమ్ము చేసిన లోతట్టు నేలల్లో వాడితే నత్రజని వాడక సామర్థ్యం రెట్టింపవుతుంది.
సాధ్యమైనంత వరకు యూరియాను లోతు సాళ్లలో వేయాలి. దున్ని, దమ్ము చేసిన తర్వాత తేలికపాటి నేలల్లో యూరియా చెక్కలు లేదా గుళికల రూపంలో లోతుగా వేయాలి. ప్రధాన పొలంలో వరి నాటిన తర్వాత గ్రాన్సూన్స్ లేదా యూరియా చెక్కల రూపంలో అందించాలి. అదే విధంగా గంధకం లేదా లక్కతో శుద్ధి చేసిన యూరియా అయితే వెదజల్లొచ్చు.
త్వరితగతిన నత్రజని స్పందనను పంటలో చూడాలనుకుంటే ఐదు శాతం యూరియా ద్రావణం తయారు చేసి పిచికారీ చేయాలి. పవర్ స్ప్రేయర్ వాడితే 15శాతం అదనంగా యూరియా వాడాలి. తాజా యూరియాను వాడకపోవడం (నేరుగా పిచికారీ) మేలు. బైయూరెట్ వల్ల ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది.
- డాక్టర్ అమరపల్లి గీత
శాస్త్రవేత్త, ఫ్లాంట్ ఫిజియాలజీ విభాగం,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,
పాలెం, మహబూబ్నగర్ జిల్లా
Authorization