అధిక ఉత్పత్తి కోసం రైతులు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. విచక్షణారహితంగా మందులు వినియోగిస్తున్నారు. అధిక ఉత్పత్తి మాటేమోగానీ పంటల నాణ్యత తగ్గుతుందని గ్రహించడం లేదు. భూసారం దెబ్బతిని వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు. సుస్థిర సాగుకు సేంద్రియ ఎరువులే మేలని అన్నదాతలు గుర్తించాలి. స్వతహాగా కంపోస్టు తయారీ చేసుకుని వ్యవసాయాన్ని కాపాడుకోవాలి.
భూమిలో సారం పెంచుకోవడానికి మట్టిలో జీవ పదార్థాలు పెంచుకోవాలి. అది ఎకరానికి ప్రతి పంట కాలానికి కనీసం 1-2 టన్నులు ఉండాలి. అందుకోసం పంట వ్యర్థాలను కానీ, మొక్కల/చెట్ల ఆకులను గానీ వాడుకోవచ్చు. జీవ పదార్థాల్ని భూమిని కప్పి ఉంచడానికి వాడుకోవాలి. జీవ పదార్థం లేకుండా కేవలం పంచగవ్య, జీవామృతం లాంటివి వాడుకుంటే ఉపయోగం ఉండదు.
సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్లి పోషకాలు విడుదలవుతాయి. ఈ మచర్య సహజంగా జరగడానికి చాలా నెలలు పడుతుంది. కుళ్లే ప్రక్రియ చాలా త్వరగా ్త యారైన ఎరువును కంపోస్టు ఎరువ అంటారు.
కంపోస్టింగ్కు అనువైన పరిస్థితులు
పంట వ్యర్థాల ఎంపిక : పంట వ్యార్థాల్లో ఉండే కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్థాల్లో తక్కువ ఉంటుందో అది త్వరగా కుళ్లుతుంది.
ఉదాహరణకు : గడ్డి ఆకు, గ్లైరిసీడియా లేత కొమ్మలు, ఆకులు, ఆహార పదార్థాలు, పప్పుజాతి మొక్కల ఆకు, కొమ్మల భాగాలు, పేడ మొదలైన వాటిలో నత్రజని మోతాదు ఎక్కువ ఉండటం వల్ల అవి త్వరగా కుళ్లుతాయి.
కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్థాల్లో ఎక్కువ ఉంటుందో అవి త్వరగా కుళ్లవు.
ఉదాహరణకు : చెక్క రంపపు పొట్టు, వరిగడ్డి.
కనుక కంపోస్టు 3-4 నెలల్లో తయారు కావాలంటే నత్రజని మోతాదు ఎక్కువ ఉన్న పంట వ్యర్థాలను ఎంపిక చేసుకోవాలి.
మొదటి పద్ధతి
- కంపోస్ట్ దిబ్బలో ఎక్కువ కర్బన పదార్థాలు (ఎండ పుల్లలు వంటివి) ఎక్కువగా ఉన్నట్లయితే నత్రజని దిబ్బకు అందించడం వల్ల త్వరగా కుళ్లుతుంది.
- నత్రజని పశువుల మూత్రంలో ఉంటుంది. కనుక మూత్రాన్ని చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది.
- పంట వ్యర్థాలను చిన్న చిన్ను ముక్కలుగా కత్తిరించి దిబ్బలో వేయడం వల్ల త్వరగా కుళ్లి ఎరువు తయారవుతుంది.
- దిబ్బలో ఎప్పుడూ తగినంత తేమ ఉండాలి. తేమ ఉండటం వల్ల సూక్ష్మ జీవులు అధికంగా వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు త్వరగా కుళ్లుతాయి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ దిబ్బలో నీరు నిల్వ ఉండకూడదు. అందుకోసం దిబ్బ అడుగులో రాళ్లు, పెంకులు వంటివి చేయడం వల్ల ఎక్కువైన నీరు నిల్వ ఉండకుండా జారిపోతుంది.
- నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ భాగానికి గాలి ఉండదు. గాలి అందనప్పుడు వేరే రకమైన సూక్ష్మజీవులు (ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరం లేనివి) పెరుగుతాయి.
- తెగుళ్లకు సంబంధించిన సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దిబ్బ నుంచి కంపు మొదలవుతుంది.
- తేమ త్వరగా కోల్పోకుండా ఉండటానికి దిబ్బను చెట్ల నీడలో వేసుకోవాలి.
రెండో పద్ధతి
- గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుప్పలుగా వేస్తారు. అలా చేయడం వల్ల అది ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలా వరకూ కోల్పోతుంది.
- రైతులు కొంత శ్రమపడి సేంద్రియ పదార్థాలను సేకరించుకోవాలి.
- రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు, తగినంత పొడువుతో గొయ్యి తీయించాలి.
- అందులో సేంద్రియ వ్యర్థ పదార్థాలను ఆరు అంగుళాల మందం వరకూ నింపి దానిపై పేడ నీటిని, పశు మూత్రాన్ని చల్లాలి.
- ఆపై సూపర్ పాస్పేట్ను చిలకరించి, తిరిగి ఇంకొక ఆరు అంగుళాల మందం వరకూ మళ్లీ సేంద్రియ పదార్థాలను నింపాలి. తిరిగి పేడ నీటిని, పశు మూత్రాలను చల్లి సూపర్ పాస్పేట్ను చిలకరించాలి.
- ఈ విధంగా సేంద్రియ పదార్థాలను పొరలుగా అమర్చిన తర్వాత అందులో తేమను 60 శాతానికి పెంచి భూమి కంటే కొంచెం ఎత్తు వరకూ కూర్చి, గాలి పోకుండా పేడతో పూత పూయాలి.
- సూక్ష్మజీవుల చర్య ద్వారా గొయ్యిలో వేసిన సేంద్రియ పదార్థాలు కుళ్లి సుమారు 90-100 రోజుల్లో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది.
- గొయ్యిలో ఉత్పన్నమైన వేడిమికి (40-50 డిగ్రీల సెంటీగ్రేట్) అందులోని శిలీంద్రాలు, రోగకారక క్రిములు, క్రిమికీటకాలు నశిస్తాయి.
వానపాముల ఎరువు
మానవుడు వ్యవసాయం మొదలు పెట్టకముందు నుంచీ నేల క్రమం తప్పకుండా దున్నబడేది. వానపాములతోనే నేలల సొరంగాలు వేస్తూ నేలపైన ఆకులు, అలుములు, నేలలో కలుపుతూ వానపాములు నేలలను గుల్లగా చేస్తాయి. అందువల్ల వర్షం నీరు బాగా ఇంకుతుంది. వేర్లు మరింత లోతుగా చౌరబ డతాయి. వానపాములు నేలలోని సేంద్రియ పదార్థాలను తింటూ విసర్జించడం వల్ల వాటి శరీరంలో అనేక రకాల సూక్ష్మజీవుల చర్య వల్ల వానపాముల ఎరువుకు సారం కలుకుగుతుంది. అయితే... రసాయన ఎరువులు వాడటం వల్ల గాఢతకు తట్టుకోలేక వానపాములు చనిపోతున్నాయి. ఇటీవలి కాలంలో వాటి ఉపయోగాన్ని తెలుసుకుని వానపాములను పెంచి ఎరువును తయారు చేస్తున్నారు. అలాంటి రెండు పద్ధతులను ఇక్కడ వివరిస్తున్నారు.
తయారీ
కంపోస్టు త్వరగా తయారు చేసుకోవడానికి వానపాములను పెంట కుప్పల్లో పెంచాలి. పంట వ్యర్థాలు/చెత్త బాగా చివికిన తర్వాత వాన పాములు వాటిని త్వరితగతిన ఎరువుగా మార్చివేస్తాయి.
కంపోస్టు తయారీలో వేడి దశ పూర్తయి, పెంట పోగు చల్లబడిని తర్వాత వానపాములను విడిచి పెట్టాలి. దీనికి స్వదేశీ వానపాములు వాడటం శ్రేయస్కరం, (పెరియోనిక్స్, లాంపిటో వంటివి).
- తొట్టిలో అడుగు పొరగా ఇటుక ముక్కలు, ఇసుక వంటివి వేయాలి.
- దానిపై మెత్తని మట్టి పర్చి 100 వానపాములను విడిచిపెట్టాలి.
- తడిగా ఉన్న పశువుల ఎరువు/ పేడ అక్కడక్కడ ముద్దగా పెట్టాలి.
- దానిపై చివికిన దిబ్బ ఎరువు 0.7 మీటర్ల ఎత్తు వరకు వేసుకోవాలి.
- చీమలు, ఇతర పరాన్న భుక్కుల నుంచి రక్షణ కల్పించాలి.
రెండు ట్యాంకుల పద్ధతి
ఇది రోజుకు 150-200 గ్రాముల వ్యర్థాలు ఉత్పన్నమయ్యే కుటుంబానికి సరిపోతుంది. ఖాళీలు వదులుతూ అడ్డుగోడ కుట్టుకోవాలి.
- ఇందులో ఒకటో ట్యాంకు పెంట నింపడం మొదలు పెట్టి అది నిండిపోగానే పాలిథీన్ కాగితాన్ని కప్పాలి. రెండో ట్యాంకు చెత్త నింపుతూ పోవాలి.
- 15-20 రోజుల తర్వాత దీన్ని తొలగించి ఒకరోజు చల్ల బడినిచ్చి, 15-20 రోజులు పాలిథీన్ కాగితాన్ని కప్పి తీసివేయాలి.
- వర్మీ కంపోస్టు 45-60 రోజుల్లో తయారవుతుంది. రెండో ట్యాంకులోనికి వానపాములు వలస పోతాయి.
ప్రయోజనాలు
- వర్మీ కంపోస్టులో అధిక మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింకు, కాల్షియం, మ్యాంగనీసు, కాపర్ మొదలైన పదార్థాలు ఉంటాయి.
- వర్మీ కంపోస్టులో హార్మోన్లు, వ్యాధులను నిరోధించే పదార్థాలు ఉండటం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అధికమ వుతుంది.
Authorization