పైరుకు కావాల్సిన నీటి అవసరాలు నేల, పైరు, వాతావరణం, పంట పండించే తీరు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. పంట ఏదైనా దిగుబడులతోపాటు నమ్మకంగా పంటలు పండించడానికి వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు సాగునీటి వసతిని తప్పకుండా సమకూర్చుకోవాలి. మేలైన నీటి యాజ మాన్యానికి మొక్క వేరు నేలలోకి వెళ్లే లోతు, నీటికి కీలక దశలు, పంట కోతకొచ్చేందుకో పట్టే కాలం, బెట్ట తట్టుకునే పైరు దశ మొదలైన వాటిపై సరైన అవగాహణ అవసరం.వివిధ పంటలకు కావాల్సిన సాధరణ నీటి పరిమాణం దృష్టిలో పెట్టుకోవాలి.
ఏ పంటకు ఏ దశలో నీటి వినియోగం కీలకం
వరి: పిలకలు వేసే, పూత, పాలు పోసుకునే సమయం, జొన్న, మొక్కజొన్న: పూత, కంకులు బయటకు వచ్చే సమయం, గింజ పాలుపోసుకునే దశలు, వేరుశనగ: పూత, ఊడలు దిగే, విత్తనం తయారయ్యే దశ, నువ్వులు: పూత, గింజ నిండే దశ, పొద్దు తిరుగుడు, ఆముదం: మొగ్గ, పూత, గింజ నిండేదశ, శనగ, సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము పంటలకు పూత, గింజ ఏర్పడే దశ, పత్తి, మిరప, బెండ, వంగ, బిన్సీస్ పంటలకు పూత కాయ ఏర్పడే దశ, చెరుకు: పంట నిలదొక్కుకునే దశ( మొదటి 4 నెలలు),
ఉల్లి: గడ్డ ఊరే దశ, క్యారెట్: వేరు పెరిగే దశ, టమాట: పూత, కాయయ పరిపక్వదశలో ఉన్నప్పుడు నీరు తప్పకుండా అందేలా చూడాలి.
సాగునీటి యాజమాన్యం: ఏ పైరుకైనా అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. ఏ పైరుకు ఎన్ని తడులు ఇవ్వాలి, తడుల మధ్య కాల వ్యవధి ఎంత ఉండాలి అనేది ముఖ్యంగా నేల స్వభావం, పైరు గుణగణాలు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50శాతం కంటే తగ్గిపోక ముందే పైరుకు నీరుపెట్టాలి. నేలలో పైరుకు లభించే 75శాతం వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావాల్సినంత నీరు లభ్యం కాక వర్షపు నీటి ఎద్దడి కలుగుతుంది. దీని వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా పై పొరలలో 15నుంచి 20 సెం.మీ లోతు వరకు మట్టిని పరిశీలించి నీరు పెట్టాల్సిన సమయాన్ని నిర్ణయించాలి. మట్టిని చేత్తో పట్టుకొని చూసి దానిలో ఉన్న తేమ హెచ్చుతగ్గులను గమనించవచ్చు. ఏయే నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలి అని తెలుసుకునేదాన్ని ఇసుక గుంత పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఇసుక నేలలకు వరి పైరుకు తప్ప ఇతర అన్ని రకాల నేలలకు,పైరులకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది.
పంటను సులువుగా తనిఖీ చేసేందుకు మూడడుగులు వెడల్పు, మూడడుగుల పొడవు, మూడడగుల లోతున్న గుంతను తీయాలి. గుంటలో వచ్చిన మట్టితో పరిమాణాన్ని బట్టి ఇసుకతో బాగా కలిపికలియబెట్టాలి. గుంటను ఈ విధంగా కలిపిన ఇసుక, మట్టితో ఆరు అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల వేసిన మట్టిని బాగా దిమ్మెస చేస్తూ గుంటను నింపాలి. మామూలుగా పొలంలో ఏపైరును పెట్టాలో దాన్నే పెట్టాలి. ఇసుక కలిపిన గుంటలో మట్టి నీటిని పీల్చుకునే శక్తి తక్కువగా ఉండడం వల్ల మొక్కలకు నీరు తక్కు వైనప్పుడు వాడిపోయే లక్షణాలు, తక్కిన పొలంలో మొక్కలకంటే ముందుగా చూపు తాయి. నీటి అవసరాన్ని గుంటలోని మొక్కలు ముందుగానే సూచించడం వల్ల పైరుకు నీర ఎప్పు డెప్పుడు అందించాలో అర్దమవుతుంది. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది.కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5శాతం నుండి కొంచెం అటుఇటుగా మార్చుకోవాలి.
సాగు నీటిని పొదుపుగా పారించే నేలలు: నీటి వనరుల నుండి కాల్వల ద్వారా పొలానికి తీసుకొని పోయేటప్పుడు దాదాపు 20 శాతం నీరు నేలలో ఇంకి పోవడం మూలంగానూ ఆవిరి కావడం ద్వారానూ వృధా అవుతోంది. అంతే కాకుండా కాల్వలు తెగిపోవడం, కలుపు మొక్కలు పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్గుకోవడం జరుగుతుంది. ఇసుక నేలల్లో ఇంకా ఎక్కువ నీరు ఇంకిపోతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలున్నాయి. 1. అర్ధ చంద్రాకారంలో చేసిన సిమెంటు పెంకులు గానీ, మట్టి పెంకులుగానీ కాల్వ పొడవునా పరుచుకోవచ్చు. 2. కాల్వలు లేకుండా సిమెంటు లేదా ప్లాస్టిక్ పైపుల ద్వారా నేరుగా పొలానికి తీసుకపోవచ్చు. దీనికి సాంకేతిక సహాయం అవసరం లేదు.
వివిధ పంటలకు కావాల్సిన
నీటి పరిమాణం (మి.మీ)లో
రబీ సీజన్లో
వరి 1200-1800
మొక్కజొన్న 500- 800
జొన్న 450-600
సోయా చిక్కుడు 400-450
సజ్జ 400-550
వేరుశనగ 500-700
పొద్దుతిరుగుడు 350-500
ఆముదం 300-350
క్యాబేజీ 500
కంది 350-450
శనగ 350
ఉల్లి 450-550
బెండ, వంగ 500-600
క్యారెట్ 400
కేవలం ఖరీఫ్లో
వరి 1000-1200
ఆరుతడి వరి 800 -1000
ఖరీఫ్, రబీలో
పత్తి 600-800
మిరప 550-600
అరటి 1600-2200
మామిడి 1100-1200
నిమ్మ, ద్రాక్ష 900- 1200
Authorization