వేరు కూరగాయలలో క్యారెట్ కూడా ముఖ్యమైనది. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. వీటి వేర్లు దుంపలుగా మారడం వల్ల సలాడ్గా తినడానికి, పలు రకాల కూరలు, స్వీట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.క్యారెట్లో అంథోసైనిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎర్రగా ఉండే రకాలు, కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల నారింజ రంగులో ఉండే రకాలున్నాయి. క్యారెట్లో 'ఎ' విటమిన్తోపాటు ప్రొటీన్లు, లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల మంచి పౌష్టికాహారంగా గుర్తింపబడింది.
రకాలు: క్యారెట్లో ఆసియా (ఎర్ర దుంపలు), యురోపియన్ (నారింజ దుంపలు) రకాలున్నప్పటికీ ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. ముఖ్యంగా పూసా కేసర్, పూసామేఘాలి, చాన్టనీ, నాన్టిస్ హాఫ్లాంగ్, ఖరోడా, రాయల్ఫోర్ట్, న్యూఖరోడా, సంకర రకాలైన రాయల్ ఖరోడా, కురుంచా,నిష, నేహా, నందిని రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి.
పూసా కేసర్: దుంపలు లోకల్రెడ్ కన్నా నెల రోజులు ఎక్కువగా నేలలోనే ఉన్న నాణ్యత చెడిపోదు. అధిక దిగుబడి నిచ్చు ఎర్రదుంపలు రకం. దీనిల కెరోటిన్ శాతం ఎక్కువ.
ఎర్లీనాన్టిస్: దుంపవేర్లు స్థూపాకారంలో ఉండి 12 నుంచి 15 సెం.మీ పొడవు, పల్చటి పైపొర కలిగి, నారింజరంగు కండ కలిగిన రకం. దుంప విత్తిన 90 నుంచి 100 రోజులలో తయారవుతుంది.
చాన్టనీ: క్యానింగ్, నిల్వ చేయడానికి అనుకూలమైన రకం. వేరు దుంప 11 నుంచి 15 సెం.మీ పొడవు 3నుంచి 5 సెం.మీ మందంతో నారింజరంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది శీతోష్ణమండలానికి బాగా అనువైన రకం.
పూసా యమదగ్ని: ఇసి 9981లో నుంచి త్వరగా కాపుకొచ్చే లక్షణం, నాన్టిన నుంచి బెండు, కంద ఒకే రంగు కలిగిన లక్షణాలు ఈ సంకర రకంలో ఉన్నాయి. దుంప వేర్లు15నుంచి 18 సెం.మీ పొడవు కలిగి, నారింజరంగుతో నిగనిగలాడుతూ ఉంటాయి. ఎక్కువ కెరోటిన్ శాతంతో అధికదిగుబడినిచ్చేరకం. ప్రయివేటు సీడ్ కంపెనీ వారి లక్ష్మణ్, ఫోటాన్ రకాలు అందుబాటులో ఉన్నాయి.
నేలలు: మురుగునీటి వసరతి కలిగిన లోతైన ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలం. బరువైన బంక నేలలు పనికిరావు. నేల ఉదజని సూచిన 6.5 ఉంటే మంచిది. బంక నేలల్లో వేర్ల పెరుగుదల మందగించి దుంపలు అభివృద్ది చెందకుండా పక్క వేర్లు ఏర్పడతాయి.
వాతావరణం: క్యారెట్ చల్లని వాతావరణంలో పంచించే పంట. అధిక ఉష్ణోగ్రతతో దుంప పెరుగుదల, రంగు సరిగా ఉండదు. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపలు రంగు తక్కువగా, పొడవుగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపల దిగుబడికి 18 నుంచి 24 డిగ్రీల సెం.ఉష్ణోగ్రత ఉండాలి. 15 డిగ్రీల సెం. కన్నా తక్కువ21 డిగ్రీల సెం. కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కెరోటిన్ శాతం తగ్గుతుంది. అధిక వేడి లేని బెంగుళూరు , చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలు ఏడాది పొడవునా క్యారెట్ సాగు అనుకూలం.
విత్తన మోతాదు: ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తే కాలం: ఆగస్టు నుంచి నవంబరు వరకు విత్తుకొని క్యారెట్ సాగు చేసుకోవచ్చు.
ప్రధాన పొలం తయారీ, సాగు విధానం: ఎన్నిక చేసిన పొలాన్ని 4లేదా 5సార్లు బాగా దుక్కిదున్ని చదును చేయాలి. క్యారెట్ను చిన్నచిన్న మడులు లేదా బోదెలు చేసి సాగు చేయ వచ్చు. పొలంలో చిన్న మడులను తయారు చేసి 22.5 సెం.మీ దూరం వరుసలలో విత్తనాలను 1-1.5సెం.మీ లోతులో పడేటట్టు విత్తాలి. లేదా 30 సెం.మీ దూరంలో బోదెలు తయారుచేసి విత్తనాలు 5 సెం.మ ఈ దూరంలో పడేలా విత్తాలి. మొలకెత్తే శాతం పెంచడానికి విత్తనాన్ని బాగా రుద్దాలి. విత్తనాలు చిన్నవిగా ఉన్నందువల్ల ఒక కికలో విత్తనానికి 10 కిలలో సన్నని ఇసుకతో కలిపి విత్తుకుంటే సరైన దూరంలో విత్తకోవడానికి సులభంగా ఉంటుంది. విత్తిన 7 రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి.
ఎత్తైన మడుల పద్ధతి: ఇటీవల కాలంలో క్యారెట్ బెడ్ కం సీడ్ ప్లాంటర్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యంత్రంలో బెడ్ తయారీ, విత్తనం ఒకేసారి 8 వరుసల్లో రెండు బెడ్లపైన నాటడానికి వీలుగా యంత్రాన్ని తయారు చేశారు. ఇది స్త్రుతం వ్యాపార సరళిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేఆలనుకునే వారికి అత్యంత సులభమైన పద్దతి. దుంపలు బెడ్లపైన పెరుగుతాయి. కనుక ఏపుగా పెరగడమే కాకుండా తక్కువ సమయంలో 10 నుండి 15 రోజులు ముందుగా తవ్వకానికి వస్తుంది. ఈ పద్దతిలో నీరు నీరు నిలవదు. కనుక వేఉ కుళ్లు వ్యాధి సోకే అవకాశం లేదు.
నీటి యాజమాన్యం: వేరు దుంప అధిక దిగుబడులు సాధించడానికి ఎక్కువసార్లు నీరు పెట్టాలి. నేల స్వభావం, వావవరణ పరిస్థితులను బట్టి 5నుంచి 7 రోజుల కొకసారి నీరు పారించాలి. దుంపల పెరుగుదల దశలో తేమ తగినంత ఉండాలి. కనుక ఆకులు వాడిపోయినట్టు గమనించక ముందే తప్పనిసరిగా తడివ్వాలి. అవసరానికి మించి నీరు పెట్టినా వేరు దిగుబడి తగ్గి, మొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. నీటి యాజమాన్యంలో ఒడిదుడుకులుంటే క్యారెట్ నాణ్యత దెబ్బతింటుంది. కనుక క్యారెట్ సాగులో నీటి యాజమాన్యం చాల ముఖ్యం.
ఎరువులు: క్యారెట్కు ఎక్కువ పోషక పదార్ధాలు అవసరం. ఆఖరి దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువు 10 టన్నులు ఒక ఎకరానికి వేయాలి. పశువుల ఎరువుతో పాటు 16 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు ఆఖరు దుక్కిలో వేయాలి. 20 కిలోల నత్రజని ఎరువులను రెండు సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కిలో మిగతా సగం విత్తిన ఆరువారాల తర్వాత వేయాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పకుండా తడివ్వాలి. ఎక్కువ మోతాదు నత్రజని ఎరువులు వేసినట్టయితే క్యారెట్ వేర్లు చీలిపోయే అవకాశముంది. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులు వేసుకుంటే క్యారెట్లో దిగుబడుల తోపాటు వేరు నాణ్యత కూడా పెరుగుతుంది.
అంతరకృషి: బోదెలలో మొక్కలు ఒత్తుగా ఉంటే 5 సెం.మీ ఒకటి చొప్పున ఉంచి మిగిలినవి తీసేయాలి. ఖాళీగా ఉన్న ప్రాంతాలను పూరించాలి. విత్తిన నెల రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. దీని కోసం కూలీలతో కలుపు తీయించుకుని మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోయాలి. కలుపు నివారణకు ట్రెఫ్లాన్ కలుపు మందు 0.24-0.4కి మూల పదార్థం ఎకరానికి విత్తేముందు వేయాలి. దుంపలు పెరిగేటప్పుడు ఎండ తగలకుండా మట్టిని ఎగదోయాలి. ఎండ తగిలిన చోట దుంపలు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. ధర పలకదు.
సస్యరక్షణ: క్యారెట్ పంటపై వచ్చే చీడలు, తెగుళ్లు చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో క్యారెట్పై పెంకు పురుగులు, రస్ట్ఫ్లై, దీపపు పురుగులు ఆశించే అవకాశం ఉంది. పరశోధన ఫలితాల ఆధారంగా ఈ కింద పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మందలు సూచించడమైంది.
పురుగులు
క్యారెట్రస్ట్ ఫ్లై: పిల్ల దశ పురుగులు వేర్లలోకి చొచ్చుకు నిపోయి వేర్లను తినేస్తుంది. దీని వల్ల వేర్లు ఆకారాన్ని కోల్పోతాయి. లోపల కుళ్లిపోయి మార్కెట్కు పనికి రాకుండా పోతాయి. ఆకులు కూడా వాడిపోయి రాలిపోతాయి. నివారణకు మలాథియాన్ 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2లేక మూడు సార్లు పిచికారి చేయాలి.
తెగుళ్లు
ఆకుమచ్చతెగులు: ఆకులపై మచ్చలు మొదట ఆకు అంచుల మీద కనిపించి క్రమేపి ఆకు మొత్తం వ్యాపిస్తుంది. చివరికి ఆకు పండుబారి రాలిపోతుంది. ఒక్కోసారి ఆకుల కాడలు కూడా పూర్తిగా మాడి ఎండిపోతాయి. పొలంలో మురుగు నీరు పోయే సౌకర్యం కల్పించాలి. 50 డిగ్రీల సెం. వేడి నీటితో విత్తనాన్ని 15 నిమిషాలుంచి విత్తనశుద్ధి చేయాలి. పంటపై మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 మి.గ్రా లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2.5 గ్రా. లీటరు నీటకి కలిపి పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు: ఆకులపై పసుపు మచ్చలు ఏర్పడి గోధుమ రంగు కలిగి నీటి మచ్చలుగా మారు తాయి. మచ్చల మధ్యబాగం పొడిగాను, పెళుసుగాను ఉంటుంది. అకుల అంచులు ముడుచుకుపోయి చనిపోతాయి. దుంపలపై కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆ భాగం కుళ్లిపోతుంది. తెగులు నివారణకు తెగులు సోకని పంట నుంచి మాత్రమే విత్తనం సేకరించాలి. వేడి నీటితో విత్తనశుద్ధి చేయాలి. పంట మార్పిడి పాటించాలి.
పంట కోత: వేరు దుంపలు మొదట తెల్లగా ఉండి, తర్వాత పసుపు రంగు నుండి క్రమంగా ముదురు నారింజ లేదా ఎరుపు రంగుకు మారుతాయి. దుంపలు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత నీరు నీరు పారించి తర్వాత రోజు ఆకులతో సహా దుంపలను పెరికేయాలి. పక్వానికి వచ్చిన తర్వాత కూడా దుంపలను తీయకపోతే దుంపలపై వేర్లువస్తాయి.
దిగుబడి: ఎకరానికి 8 నుంచి 12 టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది.
నిల్వ: పెరికిన క్యారెట్ దుంపలు సాధారణ వాతావరణ పరిస్థిల వద్ద 3నుంచి 4 రోజులు తాజాగా ఉంటాయి. కానీ 0-4.4డిగ్రీల సెం. ఉష్ణోగ్రత, 95 శాతం గాలిలో తేమ వద్ద శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే 3నుంచి 3 నెలలు చెడిపోకుండా ఉంటాయి.
Authorization