ఉల్లిగడ్డ కూరగాయలతో కలిపి పచ్చికూరగా, ఇంకా తినే పదార్థాలకు రుచి కల్పించేందుకు, సలాడ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో సుమారు 33,851 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. 18.0 టన్నుల సరాసరి దిగుబడి వస్తుంది.
ఉల్లిలో సమగ్ర సస్యరక్షణ:
1.ధాన్యపు పంటలతో పంటల మార్పిడి చేయాలి.2. ఎకరానికి 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులిపురుగులు, నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనం అవుతాయి.3. పొలంలో అక్కడక్కడ పసుపు రంగుపూసిన డబ్బాలు(జిగురుగ్రీజ్ పూసిన) ఎకరానికి 2చొప్పున పెట్టాలి.4. తామర పురుగుల నివారణకు జెట్నాజిల్ పంపుతో నీటిని చల్లాలి. 5. కిలో విత్తనానికి 8గ్రా. ట్రైకోడెర్మావిరిడి లేదా 3గ్రా. థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.6. రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి.7. పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5శాతం వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పంటకోత ఆరబెట్టుట: గడ్డలు పీకడానికి ముందు నీళ్లు పెట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెం.మీ కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరపెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
Authorization