ప్రపంచంలో అత్యధికంగా సాగు చేసే కూరగాయలలో ఆలుగడ్డ తర్వాత అత్యంత ముఖ్యమైనది టమాట పంట. వీటిని అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగా, జ్యాసుగా, కెచప్, ప్యూరీ, పేస్టు, పొడి రూపంలో కూడా వాడుతారు. టమాటలో అధికంగా సీ విటమిన్ ఉంటుంది. వీటి ఉత్పత్తులకు అనేక దేశాలలో మంచి డిమాండ్ ఉంది.టమాట విత్తనంలో 24శాతం నూనె ఉంటుంది.ఈ నూనె మార్గరైన్ పరిశ్రమలో వాడుతారు.
వాతావరణం: టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లోనూ సాగు చేయవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనువైనది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షాపాతానికి తట్టుకోలేదు.
నేలలు: బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయవచ్చు. శీతాకాలంలో దీన్ని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కావు.
నాటే సమయం: వర్షాకాలంలో జూన్, జులై, శీతాకాలంలో అక్టోబరు, నవంబరు, వేసవిలో జనవరి, ఫిబ్రవరిలో నాటుకోవచ్చు.
టమాట సాగులో సమస్యలు
ఎండాకాలంలో దిగుబడి తగ్గిపోతుంది. వర్షాకాలపు పంటలో ఎండతెగులు, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాల విత్తనాలు లభించకపోవడం.
నివారణ మార్గాలు
సమగ్ర సస్యరక్షణ పద్దతులను పాటించి తెగుళ్లను తట్టుకునే రకాలు, హైబ్రీడ్స్ను సాగు చేయాలి.రైతు స్థాయిలో విత్తనోత్పత్తికి శిక్షణా తరగతులు నిర్వహించి, విత్తన గ్రామాలను ఏర్పాటు చేసి, మార్కెటింగ్ నియంత్రణ ఉండేటట్టు చూడాలి.
రకాలు: పూసారూబీ, పూసా ఎర్లీడ్వార్ఫీ,మారుతమ్, అర్క మెఘాలి, అర్క సౌరభ్,అర్కనికాస్.
శీతాకాలానికి: పూసారూబీ,పూసాఎర్లీడార్ఫ్, అర్కవికాస్,అర్కసౌరభ్.
ప్రాసెసింగ్కు అనుకూలమైన రకాలు:హైబ్రిడ్ రకాలు సలాడ్కు, ప్రాసెసింగ్కు అనుకూలం.
నిల్వకి: సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 8నుంచి 10 రోజుల వరకు,శీతల గిడ్డంగుల్లో 30 రోజుల వరకు నిల్వ ఉండే రకాలు. అర్కవికాస్, అర్కసౌరభ్,ఇతర హైబ్రిడ్ రకాలు.
నేల తయారీ: మూడు నాలుగు సార్లు దున్ని పదును చేయాలి. వర్షా కాలం పంటకు 60సెం.మీ. దూరంలో బోదెలు చేసుకోవాలి. ఇతర రుతువుల్లో 4ఇంటు5 చ.మీ గత మడులను తయారు చేసుకోవాలి.
విత్తన మోతాదు: ఎకరానికి సూటి రకాలకు 200గ్రా. సంకరజాతి రకాలకు 60నుంచి 80గ్రా. విత్తనం కావాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3గ్రా. థైరమ్తో లేదా 3గ్రా మెటలాక్సిల్తో 2 గంటల తర్వాత 4గ్రా. ట్రైకోడెర్మా కల్చర్తోనూ విత్తనశుద్ధి చేయాలి.
నారుపోయడం: ఎకరం పొలంలో నాటడానికి 4ఇంటు1 చ.మీ విస్తీర్ణం గల 8నుండి 10 నారు ముడులను తయారు చేయాలి.నారుమళుతెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీ. నీటికి 3గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.5శాతం బోర్డో మిశ్రమంతో నారుమళ్లన శుద్ధి చేయాలి. 100లీ.మందు ద్రావణం 40చ.మీ నారుమడికి విత్తే ముందు విత్తనాలను 60డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5నుంచి 10 నిమిషాల సేపు ఉంచి తీయాలి. నారుమడిలో 10 సె.మీ ఎడంతో వరుసల్లో 1-1.5 సె.మీ లోతులో విత్తనాలను పల్చగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్క్యాన్తో నీటిని చల్లి పాలిథీన్షీట్ లేదా వరిగడ్డితో నారుమళ్లను కప్పాలి. విత్తనాలు మొల కెత్తిన వెంటనే 7నుంచి 10రోజులకు మల్చింగ్గా వేసి వరిగడ్డి లేదా పాలిథీన్ షీట్ తీసివేయాలి. రెండు మూడు వారాల వయసులో నారుకుళ్లు తెగులు రాకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5గ్రా.లీతో పిచికారి చేయాలి. మూడు వారాల వయసుగల నారుమడికి రసంపీల్చే పురుగుల నుండి నివారణకు కార్బోప్యురాన్ 3జి గుళికలు 40చ.మీ నారుమడికి 100గ్రా. చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి. నారు పీకే రెండు మూడు రోజులకు ముందు లీటరు నీటికి 2 మి.లీ రోగార్, 1గ్రా. బావిస్టిన్ను కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు ధృడపడడానికి గింజ విత్తిన 20నుంచి 30 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరుపెట్టాలి. 21నుంచి 25 రోజుల వయసు ఉండి 3నుమంచి 4 ఆకులు గల మొక్కలను నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు నెల రోజులు మించిన నారును నాటుకోవద్దు.
నాటడం: వర్షాకాలంలో 60ఇంటు45 సెం.మీ.శాతాకాలంలో 60ఇంటు 60, వేసవిలో45ఇంటు 30 సెం.మీ దూరంలో నాటుకోవాలి.
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరానికి 6నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరానికి 24కిలోల భాస్వరం, 150 కిలోల సూపర్ఫాస్పేట్, 24కిలోల పోటాష్నిచ్చే ఎరువు లను 40కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేయాలి. 48నుంచి 60కిలోల నత్రజనిని 3 సమపాళ్లుగా చేసి, నాటిన 30నుంచి 45, 60వ రోజున పైపాటుగా వేసి బోదెలను ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటికి 20గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15నుంచి 20శాతం దిగుబడి పెరుగుతుంది. నాటేముందు ఎకరానికి 8నుంచి 12 కిలోల చొప్పున బోరాక్స్ వేసినట్టయితే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరానికి 10కిలోల చొప్పున జింకు సల్ఫేట్ వేసినట్టయితే జింకు లోపం రాకుండా ఉంటుంది. నాటిన తర్వాత 30నుంచి 45 రోజులకు లీ.నీటికి 5గ్రా. జింకు సల్ఫేట్ను కలిపి పిచికారి చేసినట్టయితే 20శాతం దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరానికి 400మి.గ్రా, 200లీటర్ల నీటికి కలిపి లేదా 1మి.లీ ప్లానోఫిక్స్ 4.0 లీ. నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేస్తే పూత , పిందె నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది.
కలుపు నివారణ- అంతరకృషి
ఎకరంలో కలుపు నివారణకు పెండిమిథాలిన్ 1.0లీ.(తేలిక నేలలు), 1.20 లీ(బరువు నేలలు) 200ల లీటర్ల నీటిలో కలిపి నాటిన 48గంట ల్లోపు తడినేలపై పిచికారి చేయాలి. మెట్రిబుజిన్ అనే మందును 300గ్రా. మోతాదులో నాటిన 15 రోజులకు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 30నుంచి 35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పొలంలో కలుపు లేకుండా మొదటి నాలుగు వారాల్లో అంతరకృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు.
పొడవుగా పెరిగే హైబ్రీడ్ మొక్కలకు, మామూలు రకాలకు కూడా కర్రలను పాలి ఊతం ఇవ్వాలి. ఊతమివ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి. అంతేకాకుండా కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు.
నీటియాజమాన్యం: భూమిలో తేమనుబట్టి 7నుంచి 10 రోజుల వ్యవధిలో నీరుకట్టాలి.
సస్యరక్షణ పురుగులు
కాయతొలుచు పురుగు: లేత ఆకులను, కొమ్మలను తినేస్తుంది. కోత దశలో కాయలను తొలచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎరపంట గా బంతిని వేసుకోవాలి. ఒక వరుస బంతి మొక్కలు, ప్రతి 16 వరుసలకు టమాటా కంటే బంతినారును 20 రోజుల ముందు నాటుకోవాలి. ట్రైకో గ్రామా బదనికలను ఎకరానికి 20వేల చొప్పున విడుదల చేయాలి. ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను పెట్టాలి. నాటిన 28నుంచి 35 రోజులకు ప్లూబెండమైడ్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎన్పివి వైరస్ ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఎకరానికి 20 చొప్పున పక్షిస్థావరాలను ఉంచాలి. ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి. క్రిమి సంహార మందులను పిచికారీ చేసేందుకు ముందు కాయలను కోయాలి.
పచ్చదోమ: ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లు పసుపుపచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రబ్బరు పురగు: పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను పెట్టాలి. 10కి. తవుడు, 1కిలో కార్బరిల్ 50శాతం పొడి మందు, 1కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పాకం చేసి పులియపెట్టినది. ఈ పురుగు నివారణకు కాయతొలుచు పురుగుకు చెప్పబడిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి.
తెగుళ్లు
నారుకుళ్లు తెగులు: నారుకుళ్లు తెగులు ఆశించడం వల్ల నారుమడిలో మొక్కల మొదళ్లు కుళ్లిపోయి నారు గుంపులు,గుంపులుగా చని పోతుంది. విత్తడానికి ముందు తప్పనిసరిగా 3గ్రా. థైరం లేదా మాం కోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. తర్వాత ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశనిని 4గ్రా. 1 కిలోవిత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో రెండుమూడు సార్లు తడపాలి.
ఆకుమాడు తెగులు: ఆకులు, కాండం మీద కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండ ిపోతాయి. మొక్కదశలో ఎప్పుడైనా అశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో, ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ లేదా క్లోరోథలోనిల్ 2గ్రా. లేదా ప్రొకొన జోల్ 1 మి.లీ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో మూడు,నాలుగు సార్లు పిచికారి చేయాలి.
వడలు తెగులు: మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి తొడిమతో సహా రాలి, తర్వాత మొక్క వడలి పోయి చినిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తెగులును తట్టుకునే బిటి 1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.
వైరస్ తెగులు: తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపుపచ్చ మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని, మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చే పరుగుల (పేనుబంక) నివారణకు అంతర్వాహిక కీటక నాశనులను పిచికారీ చేసుకోవాలి.
టమాట స్పాటెడ్ విల్డ్ వైరస్: టమాట చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారి, ఆకుల మీద పుసు రంగు మచ్చలు ఏర్పడి మాడి పోతాయి. మొక్కలు గడసబారి, పూత, పిందె పట్టక ఎండిపోతుంది.దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకేయడంతోపాటు తెగులను వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Authorization