నారుమడి: నారును ఎత్తైన నారుమడిలో వరుస క్రమంలో విత్తితే గాలి, వెలుతురు సోకి ఒకే రకంగా నారును ఎత్తైన నారుమడిలో వరుస క్రమంలో విత్తితే గాలి, వెలుతురు సోకి ఒకే రకంగా మొక్కలు దృఢంగా ఉంటాయి. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే విత్తాలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. కాప్టాన్ 8గ్రా, ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేస్తే రసం పీల్చే పురుగులు, ఆకు మచ్చ తెగుళ్లను నివారించవచ్చు. నారుమళ్ల తెగుళ్ల నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ 2 గ్రా. లీటరు నీటికి చొమొక్కలు దృఢంగా ఉంటాయి. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే విత్తాలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. కాప్టాన్ 8గ్రా, ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేస్తే రసం పీల్చే పురుగులు, ఆకు మచ్చ తెగుళ్లను నివారించవచ్చు. నారుమళ్ల తెగుళ్ల నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ద్రావణంతో మళ్లను తడపాలి. నారు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు ఎకరానికి సరిపడే నారుమడికి 80 నుంచి 100 గ్రా. కార్బోఫ్యూరాన్, ఫిప్రోనిల్ గుళికలను ఇసుకతో కలిపి చల్లి నారుమడిని తడపాలి.
ప్రధాన పొలం
వేసవిలో దుక్కిదున్నుట వల్ల నేలలోని నిద్రావస్థ దశలోని పురుగు లు, నులిపురుగులు, మొండి జాతి కలుపు మొక్కల ఉధృతి తగ్గు తుంది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండి వేయాలి. ప్రారంభదశలో ఆశించే చీడపీడల నివారణకు నారును నాటే ముందు 20 మి.లీ డైమిథోయేట్, 100 గ్రా. కార్బండజిమ్ 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 20 నుంచి 30 నిమిషాలు ముంచి నాటుకోవాలి. టమాట, వంగ, మిరప పంటలకు ప్రతి 16 వరుసలకు ఒక వరుస బంతి, క్యాబేజీ, కాలిఫ్లవర్ పంటలకు ప్రతి 25 వరుసలకు రెండు వరుసల ఆవాలు 15 రోజుల వ్యవధిలో ఎర పంటలుగా నాటాలి. 5శాతం వేప గింజల కషాయాన్ని 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. పసుపు రంగు అట్టలకు గ్రీజుకానీ ఆముదం కానీ పూసి పొలంలో అక్కడక్కడ పెట్టి తెల్లదోమ ఉనికి గమనించాలి. రసం పీల్చే పరుగుల నివారణకు అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో అంతర్వాహిక క్రిమిసంహారక మందులను పిచికారి చేయాలి. క్యాబేజి, కాలిఫ్లవర్లో డైమండ్ రెక్కల పురుగు ఉధృతిని బట్టి నోవాల్యురాన్ 1 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ చొప్పున నీటికి కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చు పురుగుల వ్యాప్తిని అరికట్టడానికి పొలం చుట్టూ ఎత్తుగా పెరిగే జొన్న లేదా మొక్కజొన్న పంటలను 4 నుంచి5 వరుసల్లో రక్షల పంటలుగా వేయాలి.
లద్దె పురుగుల యాజమాన్యం
పొలంలో అక్కడక్కడ ఆముదం మొక్కలు పెట్టాలి. గుడ్ల సముదాయాలను, జల్లెడాకులను గమనించి ఏరి నాశనం చేయాలి. పురుగుల ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టాలి. ట్రైకో గ్రామ గుడ్లు పరాన్ని జీవులను ఎకరానికి 20వేల చొప్పున 10 రోజుల వ్యవధిలో 4నుంచి 5సార్లు వదలాలి. వారానికి ఒకసారి చొపున నాలుగు సార్లు ఎన్వివి వైరస్ ద్రావణం 250 ఎల్ఇ 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి. ఎకరానికి 2 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజులకు బిటి సంబంధిత మందులను 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లద్దె పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాన్ట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లేదా ఇండాక్సికార్బ్0.5 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీ. చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
విషపు ఎరలను పొలంలో అక్కడక్కడ ఉంచాలి. లద్దె పురుగుల నివారణకు 10 కి. తవుడు, 1 కి. బెల్లం పాకం, 1కి. కార్బరిల్ 1 లీటరు క్లోరిపైరిపాస్ తగినంత నీటిలో కలిపి చిన్నచిన్న ఉండలు చేసి 24 గంటల తర్వాత పొలంలో అక్కడక్కడ సాయంత్రం సమయంలో పెట్టాలి. తీగజాతి కూరగాయలలో పండు ఈగ నివారణకు మలాథియాన్100 మి.లీ, 100 గ్రా చక్కెర,10 లీటర్ల నీటిలో కలిపి మట్టి మూకుళ్లలో పోసి ఎకరానికి 10 నుంచి 12 చొప్పున అక్కడక్కడ పెట్టాలి. ఎకరానికి మూడు చొప్పున క్యూల్యూర్ బుట్టలను పెట్టడం వల్ల తల్లి పురుగులు ఆకర్షింపబడతాయి.
ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణంతో మొక్క మొదలు చుట్టూ తడపాలి. ఆఖరు దుక్కిలో ట్రైకోడెర్మాతో వృద్ది పర్చబడిన పశువుల ఎరువు వేయాలి. పంట మార్పిడి చేయాలి.
బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం3.0గ్రా.లీ లేదా ట్రైడిమార్ఫ్ లేదా డైనోక్యాప్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.
తుప్పు తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లీ. లేదా కార్బండజిమ్, మ్యాంకోజెబ్ 23గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
తెగులు సోకిన మొక్కలను, కాయలను ఏరి నాశనం చేసి పరిశుభ్రతను పాటించాలి. చీడపీడలకు ఆశ్రయం కల్పించే వివిధ కలుపు మొక్కలను సకాలంలో నివారించాలి.
Authorization