ముల్లంగి: అలాక్లోర్ అనే మందును 1.0 నుంచి 1.25 లీటర్లు అంటే లీటరు నీటికి 5.0-6.0 మి.లీ చొప్పున కలిపి విత్తిన రెండు రోజుల లోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి.
ఉల్లి, వెల్లుల్లి: ఆక్సీప్లోరోఫెన్ అనే మందును ఎకరానికి 300 మి.లీ (లీటరు నీటికి 1.5-2.0 మి.లీ) లేదా ఆక్సాడయార్జిల్ (రాఫ్ట్)600-800 మి.లీ (లీటరు నీటికి 3.0-4.0 మి.లీ) లేదా పెండిమిథాలిన్ లేదా అలాక్లోడ్ అనే మందును 1.0-1.25 లీటర్లు(లీటరుకు 5.0-6.0మి.లీ) చొప్పున కలిపి నాటిన రెండు రోజుల్లోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి.
పోస్ట్ ఎమర్జెన్స్: క్విజాల్ఫాల్ ఇథైల్ 400 మి.లీ లేదా ప్రొపాక్విజాఫాప్ 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి నాటిన 15నుంచి 20 రోజులకు పిచికారి చేయడం వల్ల గడ్డిజాతి కలుపును నివారించుకోవచ్చు.
టమాట
ప్రీ ఎమర్జెన్స్: పెండిమిథాలిన్ లేదా అలా క్లోర్ ఎకరానికి ఒక లీటరు (లీటరు నీటికి 5.0 మి.లీ) చొప్పున కలిపి విత్తిన లేదా నాటిన రెండు రోజుల్లోపు తేమ గల నేలపై పిచికారీ చేసుకోవాలి.20-25 రోజుల మధ్యన ఒకసారి అంతరకృషి చేసుకోవాలి. లేదా మెట్రి బ్యూజిన్ అనే మందును 300 గ్రా.లు ఎకరానికి లీటరు నీటికి 1.5 గ్రొ. చొప్పున కలిపి నాటిన రెండు రోజుల్లోపు పిచికారి చేయాలి.
పోస్ట్ ఎమర్జెన్స్: క్విజాఫాప్ ఇథైల్ 400 మి.లీ ప్రొపాక్విజాఫాస్ 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి నాటిన 15 నుంచి 20 రోజులకు పిచికారి చేయడం వల్ల గడ్డిజాతి కలుపును నివారించుకోవచ్చు.
తుంగలాంటి కొన్ని మొండిజాతి కలుపు నివారణ భూమిని దున్నక ముందు లేదా మొదటి పంట తర్వాత రెండో పంట వేయకముందు చేపట్టవలసిన పద్ధతి.
తుంగ, ఇతర కలుపును 15-20 రోజుల వరకు పెరగనీయాలి. అవసరమైతే నీటిని పెట్టి త్వరగా పెరిగేటట్టు చేయాలి. కలుపు బాగా పెరిగిన తర్వాత గ్లైఫోసేట్ అనే మందును ఎకరానికి 2-2.5 లీటర్లు అంటే లీటరు నీటికి 10 మి.లీ చొప్పున కలిపి కలుపు బాగా తడిసేటట్టు పిచికారి చేయాలి. 10-15 రోజులు ఆగి కలుపు చనిపోయిన తర్వాత దున్నినట్టయితే తుంగను కొంత వరకు నివారించవచ్చు. వైరస్ తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు. పొలంలో మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న వంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశలో నాటుకోవాలి. లేదా వీలైన రైతులు 35 శాతం షేడ్నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు.
వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి వంటి పండ్ల తోటల్లో మొదటి మూడు నాలుగేండ్లు అంతర పంటగా బెండ, సోర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరు చిక్కుడు వంటి కూరగాయ పంటలను సాగు చేసి రైతులు ఆదాయం పొందవచ్చు.
నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో ఏంద్రియ ఎరువులు, వాటితోపాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియపు ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేల గుల్లబారి, తేమను ఎక్కువ రోజులు పట్టి ఉంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్టు చేస్తుంది.
టమాట, పుచ్చలో నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయపగుళ్లు కనబడతాయి. నీటి యాజమాన్యం సక్రమంగా ఉండేటట్టు చూడాలి. ఆ తర్వాత కాయపగుళ్ల నివారణకు బోరాక్స్ లేదా ఆల్బోర్ 3 గ్రా.లీ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
పూత, పిందె రాలకుండా ఉండడానికి టమాట, వంగ వంటి పంటలకు ఒక మి.లీ ప్లానోఫిక్స్ (ఎన్ఎఎ)4.5 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. మిరపలో పూత దశలోట్రైకాంటినాల్ 2.0 మి.గ్రా. లేదా 2.5 మి.లీ ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే పిందె నిలిచి కాత బాగా ఉంటుంది.
Authorization