పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలు వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టాలి. తలనత్త ఆశించిన కొమ్మలను పురగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం కిందికి తుంచి వేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ట్రైకోగ్రామ బదనికలను ఎకరానికి 20వేల చొప్పున విడుదల చేయాలి.బిటి మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పూతదశలో పిచికారి చేయాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేయాలి. బాక్టీరియా ఎండుతెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి మందును వేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను ఎకరానికి రెండు మూడు కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. అయితే ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను 10కిలోల వేపపిండి,90కిలోల పశువుల ఎరువుతో కలిపి 15 రోజులు నీడలోఉంచి అప్పుడప్పుడు నీరు చల్లుతూ ఉంటే ఈ శిలీంధం దానిలో బాగా అభివృద్ధి చెందుతుంది. దీని వాడకం వల్ల భూమి నుంచి ఆశించే ఎండు, కుళ్లు తెగుళ్లను నివారించవచ్చు. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరానికి 10కిలోల చొప్పున కార్బోప్యురాన్ గుళికలను వేసుకోవాలి.2 మి.లీ డైమిథోయేట్ లూదా0.5 మి.లీ సైపర్మైత్రిన్ లేదా 2 మి.లీ ప్రొఫెనోఫాస్ లేదా థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి కాయతొలుచు పురుగులను నివారించుకోవచ్చు. పంట పూత, కోత దశలో2, 4-డి(10.మి.గ్రా.లీటరు నీటికి లేదా నాప్తలీన్ అసిటికామ్లం 1 మి.లీ 4లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే 20 శాతం అధిక దిగుబడి సాధించవచ్చు.
Authorization