రసంపీల్చేపురుగులు(తెల్లనల్లి,తామరపురుగులు,పచ్చదోమ): పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చేస్తాయి. పురుగులు ఆశించి ఆకులు ముందుగా పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కిందివైపుకు ముడుచుకొని పోయి దోనే ఆకారంగా మారిపాలిపోతాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్1.6మి.లీ లేదా డైమిథోయేట్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్5మి.లీ లేదా డైమిథోయేట్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత, కాయతొలుచు పురుగు: తొలిదశలో చిన్న గొంగళి పురుగులు రెండు మూడు లేత ఆకులను కలిపి గూడుకట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొద్దీ ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను పూతను, కాయల్లోని తేమగింజలను తింటూ పంటకు నష్టం కలిగిస్తాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్1.6మి.లీ లేదా క్వినాల్ఫాస్2మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి. లేదంటే మొగ్గ పూత వాడి రాలిపోతుంది.
కోడుఈగ: చిన్న పురుగులు లేత మొగ్గ,పూత తినివేయడం వల్ల మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజకట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించిన మొగ్గ పూత వాడి రాలిపోతుంది.
నివారణ: పురుగు ఆశించిన మొగ్గల్ని, తాలు కాయలను ఏరినాశనం చేయాలి. మొగ్గదశలో డైమిథోయేట్ 2మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బీహారీ గొంగళి పురుగు: తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి పాకుతూ మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి.
నివారణ: పంటలో గుడ్లు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి.క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగులు: ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల ఆంచులు లోపలికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కరిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండుతెగులు సోకిన కాండం మీద, కాయలమీద గులాబి రంగు శీలింధ్ర బీజాల సముదాయం కనిపిస్తుంది. తెగులు కల్గించే శీలీంధ్రం భూమిలోను విత్తనాలు పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరం లేదా కాప్టాన్ లేదా కార్బెండిజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెట్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంట కోత: ఆకులు పసుపురంగుకు మారి రాలడం ప్రారంభమైనప్పుడు 70శాతం కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తకిందులుగా నిలబెట్టాలి. 5 నుంచి 6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి మార్పిడి చేయాలి.
నిల్వ చేయడం: గింజల్లో తేమ శాతం 8 కిలోలు తగ్గేవరకు ఎండలో ఆరబెట్టాలి. గోనెసంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్
పొడిని చల్లాలి. పురుగు
పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి.
ఎగుమతి ప్రాధాన్యం: తెల్లనువ్వు రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యం ఉంటుంది. ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం, పురుగు మందుల అవశేషాలు లేనిదిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం
ప్రధాన శాస్త్రవేత్త (నూనె గింజలు)
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం
మహబూబ్నగర్ జిల్లా
Authorization