పంటకు పురుగు, తెగుళ్లు ఆశించినప్పుడు వాటి నివారణకు పురుగు మందులు పిచికారి చేస్తారు. ఆ సమయంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించకపోతే మానవాళికే కాకుండా జంతుజాలానికి కూడా ప్రాణాపాయం సంభవించవచ్చు. చాలా వరకు పురుగు మందులు గాలి ద్వారా, చర్మం ద్వారా శరీరం లోపలికి ప్రవేశించి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తాయి. అందుకే పిచికారి చేసే సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
- పురుగు మందులు తాగునీటిని, ఆహార పదార్ధాలను కలుషితం చేయకుండా వాటిని ఉపయోగించిన తర్వాత ఖాళీ డబ్బాలను భూమిలో పాతిపెట్టాలి.
- పురుగు మందులు సరైన ప్యాకింగ్లో ఉన్నాయో లేవో జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి.
- పురుగు మందులు ఉపయోగించే ముందు లేబుళ్లు, వివరాల పత్రాన్ని పూర్తిగా చదవాలి.
- పురుగు మందుల డబ్బాలను పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలి. అలాగే పిల్లల చేత పిచికారి చేయించరాదు.
- ఆహార పదార్ధాలతోపాటు పురుగు మందులను నిల్వ చేయకూడదు.
- పురుగు మందులను పిచికారి చేసే సమయంలో రక్షణ కల్పించే వస్త్రాలను ధరించాలి.
- అనారోగ్యంతో ఉన్నా, లేక ఏదైనా గాయంతో ఉన్నప్పుడు పొలంలోకి దిగి పిచికారి చేయవద్దు.
- మిట్ట మధ్యాహ్నాం పిచికారి చేసేటట్టయితే వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలి.
- పురుగు మందులను చేయితో కలపకుండా గరిటె, కట్టెను ఉపయో గించాలి.
- ఎదురు గాలికి కాకుండా గాలి వీచే దశలోనే పిచికారి చేయాలి.
- చిల్లుపడిన, పాడైన స్ప్రేయర్ను వాడకూడదు. నిజిన్ను శుభ్రపర్చాల్సి వస్తే నోటితో ఊదకూడదు.
- పిచికారి చేసేటప్పుడు ఆహారపదార్ధాలు తినడం, మంచినీళ్లు తాగడం చేయొద్దు.
- పురుగు మందు పొరపాటున శరీరంపై పడితో పొడి బట్టతో తుడవాలి. వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఉపయోగించిన పురుగు మందు డబ్బాలను గృహ అవసరాలకు ఉపయోగించుకోవద్దు.
- వాతావరణం అనుకూలంగా లేకపోతే పిచికారి చేయొద్దు.
- మందు చల్లిన పొలంలో హెచ్చ రిక బోర్డు పెట్టాలి.
Authorization