రాష్ట్రంలో సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ నెలలో ప్రవేశిస్తాయి. కొంత ఆలస్యమైనా ఆందోళన అవసరం లేదు. రైతులు తొందరపడి విత్తనాలు వేసుకోవద్దు. రుతపవనాలు అందుకొని వర్షాలు ప్రారంభంకాగానే ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు సంభవిస్తాయి. విత్తనాలు వేసుకోవాలంటే ముఖ్యంగా రైతులు నాగలి దున్నుతుంటే సరిపోను సాలు రావాలి. నాగలికి సరైన సాలు వచ్చిందంటే నేల సంపూర్ణంగా తడిచినట్లు. కనుక తేలికపాటి నేలల్లో సాలు 50 నుంచి 60 మిల్లీ మీటర్లు అదే విధంగా బరువు నేలలు (గట్టి)నేలలు 70 నుంచి 80 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి. అప్పుడు మంచిగా మొలకెత్తి ధృడంగా ఉంటాయి.
ఎర్రనేలలున్న వారు వర్షాధార పంటలు వేసుకోవాలి. రైతులు ఇది గమనించాలి. నేలల్లో సత్తువ పెంచేందుకు ప్రయత్నించాలి. నాగార్జున సాగర్ లెప్ట్కెనాల్ కాలువల ద్వారా సాగయ్యే భూమిలో పచ్చిరొట్ట సాగు చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. పైరుల గురించి తొందర అవసరం లేదు. జూన్ నెలాఖరు వరకు జొన్న పంట వేసుకోవచ్చు. జూన్ నెలలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఈ నెల 25 నుంచి విత్తనాలు వేసుకోవడం ప్రారంభించినా ఫర్వాలేదు. ఈ సారి వర్షాలు విస్తారంగా కురుస్తాయనే సూచనలున్నాయి. ఈ విషయం ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎరువులు కూడా తగ్గించుకోవాలి.
మన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులే వాడాలి. నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత మోతాదులో వేయాలో సూచించన మేరకే వేసుకోవాలి. భాస్వరం పైపాటుగా వేయకూడదు. ఈ విషయం రైతులు గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించుకోవాల్సిన పని లేదు. రెగ్యులర్ పైరులపైనే దృష్టిపెట్టాలి. విశ్వవిద్యాలయం సూచనలు గమనించాలి. తెగుళ్లు, క్రిమిసంహారక మందులు క్రమంగా వేసుకోవాలి. యూరియ, క్రిమిసంహారక మందులు తగ్గించుకోవాలి. ఏ షాపులో విత్తనాలు కొనుగోలు చేస్తామో అక్కడ టాగ్, బిల్లులు, రసీదులు పొందాలి.
1. రైతు తొందరపడొద్దు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురిశాకే మేలుకో. నాగలికి సరపడా సాలువస్తేనే విత్తనాలు వేసుకోవాలి.
2. చెరువుల ఆయకట్టు కింద వరికి ముందుగా పెసర పంటను లేదా పచ్చిరొట్టను ఎరువుగా ఉపయోగించుకొని ఎరువుల ఖర్చును తగ్గించుకోవాలి.
3. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టి, భూసార సమతుల్యాన్ని ఒడిసిపట్టాలి. భాస్వరాన్ని పైపైనే వేయొద్దు, కావాల్సిన మేరకు పొటాష్, నత్రజని వేసుకోవాలి.
4. యూరియా తక్కువ మోతాదులో వేసుకోవాలి. చీడపీడలను క్రమంగా తగ్గించుకోవాలి
5. వర్షం మీద ఆధారపడి ఎర్రనేలల్లో పత్తి వేయడం మంచిది కాదు, నీటి వసతి ఉంటే కొద్దిపాటి మేరకు వేసుకోవాలి.
6. అంతర పంటలను సాగు చేసుకోవాలి. చీడపీడపీడలను అదుపు చేసుకోవాలి. స్థిరమైన ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
7. పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనము, పెసర పంటలు వేసుకోవాలి. భూసారాన్ని పెంచుకోవాలి.
8. సమగ్ర సశ్య రక్షణ చర్యలు చేపట్టాలి. విచక్షణారహిరతంగా పురుగు మందులు వాడడం తగ్గించుకోవాలి.
9. క్రిమి సంహారాకాలను సిఫార్సు చేసిన మేరకే వాడుకోవాలి. అధికారుల సలహాలు ఎప్పటికప్పడు తీసుకోవాలి.
- డాక్టర్ దండ రాజిరెడ్డి
పరిశోధనా సంచాలకులు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
Authorization