కాప్సికం... ఈ కూరగాయ మిరప జాతిలాగానే సొలనేసి జాతికి చెందినది. కారం తక్కువగా ఉండడం వల్ల దీన్ని పచ్చికూరగాయగా ఉపయోగిస్తారు. దీనిని సిమ్లా మిర్చి, బెల్పెప్పర్, కూరమిరప, బెంగుళూరు మిర్చి అని కూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ ఎ,సి అధికంగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగులో ఉంటాయి. పాలీహౌస్లో పండించడం వల్ల పంటకు కావాల్సిన టెంపరేచర్ మాత్రమే అందుతుంది కనుక కాయలు ఒకే సైజులోనూ ఒకే కలర్లోనూ ఉంటాయి. పంట కాలం ఎక్కువగా ఉంటుంది. బయట నాలుగు నెలలకు వచ్చే పంట ఇందులో ఆరు నెలలకు వస్తుంది. చీడపీడల బెడద తక్కువ. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
వాతావరణం: సిమ్లా మిర్చిని మన రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా పండిస్తున్నారు. రాత్రి వేళల్లో 10నుంచి 17 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత, 30నుంచి 40రోజుల పాటు ఉంటే ఈ పంట అధికంగా పండుతుంది.
షేడ్నెట్, పాలీహౌస్లలో సంవత్సరం పొడుగునా ఈ పంటను పండించవచ్చు.
నేలలు: నీటి వసతి కలిగి సారవంతమైన మురుగు నీటి సౌకర్యం గల అన్ని నేలలు ఈ పంటకు అనుకూలం.చౌడు నేలలు పనికి రావు.
అనువైన రకాలు: కబీాలిఫోర్నియా వండరు, యోలోవండరు, కింగ్ఆఫ్నార్త్, అర్కాగౌరవ్, అర్కామోహిని,అర్కాబసంత్.
ఇవి కాకుండా ప్రయివేటు కంపెనీల సంకర రకాలు ఇంద్ర(ఆకుపచ్చ), ఒరోబెల్లి(పసుపు), బాంబే (ఎరుపు) గల రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
విత్తన మోతాదు: 50గ్రా. విత్తనాలు ఒక పాలీహౌస్ యూనిట్కు సరిపోతాయి. విత్తనాలు మార్కెట్లో 10 గ్రా. ప్యాకింగ్లో లభిస్తాయి.
నారుమడి తయారీ: ఒక పాలీహౌస్(560చ.మీ) విస్తీర్ణంకు సరిపడా నారు పెంచుట 1మి. వెడల్పు ఇంటు 5మీ. పొడవుగల 3 బెడ్స్ సరిపోతాయి. 45 రోజుల వయస్సున్న నారును సాధారణ పరిస్థితులలో అయితే సెప్టెంబరు నెలలో నాటుకోవాలి. నారుమడిని ఎత్తుగా చేసి 2 గంపలు (10 కిలోల) పశువుల ఎరువు, 1గంప(4కిలోల) వేపపిండి పోసి బాగా కలియబెట్టాలి. చ.మీకు 20గ్రా.కార్బోప్యూరాన్ గుళికలు వేస్తే రసం పీల్చు పురుగులు ఆశించవు. నాటిన 12నుంచి 20 రోజలకు ఒక సారి కాపర్ సంబంధిత శిలీంధ్రనాశినులతో నేల తడిచేటట్టుగా పిచికారీ చేసిన నారుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. పాలీహౌస్లో 80సెం.ఈ వెడల్పు15సెం.మీ ఎత్తుగల బెడ్లను 60సెం.మీ దూరంలో వేసుకోవాలి. పాలీహౌస్లో 560 చ.మీకి 150 కిలోల పశువుల ఎరువు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 21 కిలోలు, పొటాష్ 2.5 కిలోలు వేసి కలియబెట్టాలి.వేపపిండి 28కిలోలు కలపాలి.
నాటే సమయం: ఆగస్టు నుండి నవంబరు వరకు నాటుకోవచ్చు. ఫాగర్స్ ఉన్న యెడల పాలీహౌస్లో సంవత్సరం మొత్తం సాగు చేయొచ్చు.
నాటటము: నారు వయస్సు 35నుంచి 40 రోజులున్నప్పుడు పాలీహౌస్లో బెడ్లలో నాటుకోవాలి. ఒక వేళ నారు వయస్సు పెరిగినట్టయితే తలలు తుంచి నాటాలి. బెడ్స్80సెం.మీ వెడల్పు ఇంటు 15సెం.మీ ఎత్తుగల బెడ్స్ను పాలీహౌస్ పాడుగునా తయారు చేసుకొని వాటి మీద 60ఇంటు 60 సెం.మీ. లేదా 60ఇంటు45 సెం.మీ. దూరంలో కుదురికి ఒకటి చొప్పున నాటుకోవాలి. నారు నాటే ముందు నారుని ఇమిడాక్లోప్రిడ్ ముందులో 10 నిమిషాలు ముంచి నాటినట్టయితే తొలిదశలో ఆశించు పేనుబంక, రసం పీల్చే పురుగుల నుండి రక్షణ కలిగించవచ్చు. నాటిన 20నుంచి 30 రోజుల తర్వాత సీఓసీ(కాపర్ ఆక్సీక్లోరైడ్) మందు ద్రావణం మొక్క పాదులలో పోసినట్టయితే మొదలు కుళ్లు తెగులును అరికట్టవచ్చు.
రకాలు: కాలిఫోర్నియా వండర్: కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పంట కాలం 140నుంచి 150 రోజులు. ఎకరానికి 6నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుంది.
అర్కబసంత్: కాయలు లేత పసుపు రంగులో ఉంటాయి. పంట కాలం 125నుంచి 140 రోజులు. ఎకరానికి 6నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది.
అర్కగౌరవ్: లేత కాయలు ముదురాకు పచ్చగా ఉండి, పూర్తిగా పెరిగిన దశలో నారింజ రంగుకు మారుతాయి. కాయలు చాలా పెద్దవిగా ఉంటాయి. పంట కాలం 125నుంచి 150 రోజులు. ఎకరానికి 6నుంచి8 టన్నులు వస్తుంది.
అర్కమోహిని: కాయలు ముదురాకు పచ్చరంగులో ఉంటాయి. కాయలు పండినప్పుడు ఎర్రరంగుకు మారుతాయి. కాయలు చాల పెద్దవిగా ఉంటాయి. (కాయ బరువు180నుంచి 200గ్రా).పంట కాలం 120 రోజులు.ఎకరానికి 6నుంచి 8 టన్నులు వస్తుంది. పై మూడు రకాలు ఖరీఫ్,రబీకి అనువైనవే.
గ్రీన్గోల్డ్(హైబ్రిడ్): కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.ఖరీఫ్, రబీ, వసంత రుతువులకు అనువైనవి. టోబాకో వైరస్ తెగులను తట్టుకుంటుంది. దిగుబడి 8నుంచి 10 టన్నులు, అత్యధిక దిగుబడి ఎకరానికి 12నుంచి 15 టన్నులు.
భారత్(హైబ్రిడ్): కాయలు ముదురాకు పచ్చగా ఉంటాయి.పంట దిగుబడి ఎకరానికి 14నుంచి 16 టన్నులు.వివిధ కంపెనీలకు చెందిన పలు హైబ్రిడ్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా రకాలు ఎంపిక చేసుకోవాలి.
రకాలు
ఇందిర: ఇది ఆకుపచ్చ రకం. కాయ కొంచెం పొడవుగా ఉండి బరువు 180గ్రా. ఉంటుంది.పంట కాలం 150 రోజులు.
పొరబెల్లి: ఇవి పసుపు పచ్చ రంగు రకం. కాయ సైజు పెద్దగా ఉంటుంది. పొడవు, వెడల్పు సమానంగా ఉంటుంది.
బోంబె: ఇది ఎరుపు రకం. కాయ ఆకారం ఇందిర మాదిరగా ఉంటుంది. చిన్నదిగా ఉంటుంది. దిగుబడి ఇందిర రకం కన్నా తక్కువ.
ఎరువుల యాజమాన్యం
ఆఖరి దుక్కిలో 1.5 టన్నుల పశువుల ఎరువు, 30కిలోల వేప పిండి వేయాలి. నాటటానికి ముందు 3 కిలోల డీఏపీ ఒక కిలో మ్యూరేట్ పొటాష్ బెడ్ల మీద సమానంగా చల్లాలి. నీటిలో కరిగే ఎరువులను (యూరియా, సల్ఫేట్ ఆఫ్ పొటాష్)ను డ్రిప్ ద్వారా వారంలో రెండు సార్లు ఇచ్చినప్పుడు దిగుబడి అధికంగా వస్తుంది. పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు ఒక శాతం యూరియా (1లీ.నీటికి 10గ్రా.)పిచికారీ చేసినట్టయితే దిగుబడి బాగుంటుంది.
జింక్లోప నివారణకు 3కిలోల జింక్ సల్ఫేట్ను వేయాలి. లేదా 2గ్రా. జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు ఇచ్చినప్పుడు 1కిలో యూరియా,360గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వారానికి ఒక రోజు వేయాలి.
కలుపు నివారణ అంతరకృషి: మొక్కలు నాటిన తర్వాత మనుషులతో రెండు సార్లు కలుపు తీస్తే సరిపోతుంది.
నీటి యాజమాన్యం
డ్రిప్ ద్వారా నీరు అవసరాన్ని బట్టిపెట్టాలి.వాతావణం మబ్బుగా ఉన్నప్పుడు పాలీహౌస్లో ఉన్న షేడ్నెట్ తొలగించాలి. ఎండ ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు షేడ్నెట్ కప్పి ఉంచాలి.
ట్రైనింగ్: మొదట వచ్చే పూతను పిందెలను జాగ్రత్తగా గోటితో తుంచి వేయాలి. ప్రతి మొక్కనుండి 4నుంచి 6 కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి. కొమ్మలు బలంగా ఉన్న వాటిలోనే పూత ఉంచాలి.
స్టేకింగ్: పాలీహౌస్లో బెడ్లమీద 2.5 మీ. ఎత్తులో జీఐ వైరుతో ఒక్కొక్క మొక్కల వరుసకు ఒక వరుస వైరును పైపులకు కట్టాలి. ఈ విధంగా కట్టిన వైరుకు మొక్క మొదలులో ప్లాస్టిక్ వైరుతో వలులుగా కట్టాలి. ఈ విధంగా 4నుంచి 6 ప్లాస్టిక్ తాడుతో ప్రతి కొమ్మను జీఐ వైరుకు వదులుగా కట్టాలి. మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మను ప్లాస్టిక్ తాడుకి మెలి పెట్టడం ద్వారా కొమ్మ కాపు మీద పడకుండా చూడాలి.
సస్యరక్షణ
పై ముడత: నారు నాటిన 20 రోజులకు పాలీహౌస్లో తామరపురుగులు ఆశించే అవకాశం ఉంది. రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్నీ పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు కార్బరిల్ 3గ్రా. లేదా ఫాసలోన్3 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.25మి.లీ లీటరు నీటికి కలిపి ఆకు అడగు భాగం తడిచే విధంగా పిచికారీ చేయాలి.
తెగుళ్లు
నారుకుళ్లు తెగులు: లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది.దీని నివారణకు విత్తనశుద్ది చేసిన విత్తనం నాటుకోవాలి. విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, వారం రోజుల తర్వాత 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి లేదా 1శాతం బోర్డో మిశ్రమంతో పిచికారి చేయాలి. ఎత్తయిన నారు ముడలలో నారును పెంచాలి. విత్తనం ఒత్తుగా విత్తకూడదు. నారు కుళ్లు కనబడిన వెంటనే తడులను ఆపివేయాలి.
మొక్కలు ఎండు తెగులు: మొక్కలు ఎండిపోయి పూత, పిందె ఆకులు రాలిపోతాయి. దీని నివాణకు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 శాతం బోర్డోమిశ్రమం కలిపిన ద్రావణంతో మొదళ్లు తడిపి నత్రజని, నీటి తడులు తగ్గించాలి.
బూడిద తెగులు: ఆకుల అడుగున తెల్లటి బూడిద కలిగిన మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. తేమ, వేడి అధికంగా లేకుండా చూసుకోవాలి.
నివారణ: నీటిలో కరిగే గంధకం 3గ్రా. లేద కెరథేన్ 1 మి.లీ లీటరు నీటికి తడిపి పిచికారీ చేయాలి.కోతలు: ప్రతి రెండు రోజులకోసారి కాయలు కోయాలి.
Authorization