రాష్ట్రంలో జామ పంట సుమారుగా 6230 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 84,170 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు.
పేదవాడి ఆపిల్గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది. అందులో అధికంగా లభించే విటమిన్ సి, ఇతర ఔషద గుణాల వల్ల మధుమేహంతో బాధపడేవారికి జామ పండు మంచి ఆహారం. దేశీయంగా, అంతర్జాతీయంగా సుమారు 40 దేశాలలో జామ మార్కెట్ అవుతుంది. సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినప్పుడు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి. ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది. కనుక ప్రస్తుత సాగు పద్ధతిలో మార్పు చేసి దిగుబడుల అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి ఊపందుకుంది. ఈ అత్యధిక సాంద్ర పద్ధతినే 'మెడో' పద్ధతిగా కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో మొక్క పరిమాణాన్ని అవసరం మేరకు నియంత్రించాలి. తద్వార వెలుతురు ప్రసరణ బాగా జరిగేటట్టు చూడడం వల్ల వివిధ సాగు పనులు ఉదా: కొమ్మ కత్తిరింపులు, సస్యరక్షణ చర్యలు, కోత మొదలుగునవి తేలికగా చేయవచ్చు.
రకాలు: వాణిజ్య రకాలైన అలహాబాద్, సఫీద్, లక్నో 49, అధిక సాంద్రత, అత్యధిక సాంద్రత విధానానికి బాగా అనుకూలం.
మొక్కల సాంద్రత: మెడో పద్ధతిలో ఎకరానికి 200 మొక్కలు
2 మీ×1 మీ దూరంలో నాటుతారు. అదే మన సంప్రదాయ పద్ధతిలో 6 మీ×6 మీ దూరంలో ఎకరానికి 112 మొక్కలు నాటేవారు. జామను అధిక సాంద్రత పద్ధతిలో కింద తెలిపిన దూరాన్ని పాటించి నాటుకోవచ్చు.
1. 3 మీ×3 మీ, ఎకరానికి 888 మొక్కలు, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి, మూడేండ్లలో
2. 3 మీ×3మీ, ఎకరానికి 444 మొక్కలు, 7నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది.
3. 6 మీ× 3మీ, ఎకరానికి 222 మొక్కలు, 5నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది.
4.2 మీ×1మీ, ఎకరానికి 2 వేల మొక్కలు, ఎకరానికి 16 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది.
మొక్కలు నాటుట: ఎక్కువ చలి ఉంటే డిసెంబరు, జనవరి నెలలో తప్పా సంవత్సరంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఒకటిన్నర అడుగుల పరిమాణంలో పొడవు, వెడల్పు, లోతు ఉండే గోతులు తీసి 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు,500గ్రా సూపర్ ఫాస్పేట్ కలిపి గుంతల్లో నింపుకోవాలి.
మొక్కల పెరుగుదల నియంత్రణ: మొక్క కాండంపై 30నుంచి 40 సెం.మీ వరకు పక్క కొమ్మలు పెరగనివ్వకూడదు. సుమారు 40సెం.మీ ఎత్తు వద్ద ప్రధాన కాండాన్ని కత్తిరించి వేయాలి. తరువాత, 20 రోజుల తర్వాత కత్తిరించిన దగ్గర కొత్త చిగర్లు వస్తాయి.అందులో 4 కొమ్మలు ఉంచి 4 కొమ్మలు తీసివేయాలి. తరువాత ఈ కొమ్మలు 3,4 నెలలు పెరిగిన తర్వాత 50 శాతం కత్తిరించాలి. మళ్లీ కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పైన తెలిపిన విధంగా ఎంపిక చేసుకొని మిగిలిన వాటిని కత్తిరించాలి. కొత్తగా వచ్చే కొమ్మల మీద పూత, పిందె ఏర్పడతాయి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కలు కావాల్సిన అకారం సంతరించుకుంటాయి. రెండో సంవత్సరం కూడా కొమ్మ కత్తిరింపులు చేయాలి. దాంతో మొక్కలన్నీ 2.5 మీ ఎత్తు, 2మీ. వెడల్పు వరకు నియంత్రించుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, అడ్డంగా ఉన్న కొమ్మలను తీసేయాలి. గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను నాలుగింట మూడో వంతు కత్తిరిస్తే పక్క కొమ్మలపై కాపు బాగా వస్తుంది. కాయలను చిన్న కొమ్మలతో పాటు కోయడం ద్వారా ఇదే రకమైన ఫలితాన్ని పొందవచ్చు.
ఎరువుల వాడకం మోతాదు ప్రతి చెట్టుకు
చెట్టు మొదటి సంవత్సరం నాటేటప్పుడు 90గ్రా యూరియా, 3 నెలల తర్వాత 90గ్రా, యూరియా, 185గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్, 9 నెలల తర్వాత 5గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్. రెండో సంవత్సరం జూన్లో 180గ్రా. సెప్టెంబరులో 110గ్రా యూరియాతోపాటు 370గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్, జూన్లో 100గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్, మూడో సంవత్సరం జూన్లో 270గ్రా, సెప్టెంబరులో 115గ్రా. యూరియాతో పాటు 555గ్రా సింగిల్ సూపర్ ఫాస్పేట్, జూన్లో 180గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్, నాలుగో సంవత్సరం జూన్లో 360 గ్రా. యూరియా, సెప్టెంబరులో 150గ్రా. యూరియా, సెప్టెంబరులో 740గ్రా సింగిల్ సూపర్ ఫాస్పేట్, జూన్లో మల్లీ 200గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. అదే విధంగా ఐదో సంవత్సరం జూన్లో 450గ్రా, సెప్టెంబరులో 190గ్రా. యూరియా, 900గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్, జూన్లో 250గ్రా.మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
కాపు నియంత్రణ: సాధారణంగా జామలో సంవత్సరానికి రెండు సార్లు కాపు వస్తుంది. ఈ విధంగా వచ్చి దిగుబడిలో కాయ సైజు, నాణ్యత తగ్గిపోతుంది. కనుక వాణిజ్య రీత్యా సంవత్సరం మొత్తంలో చలికాలంలో పంట తీసుకోవడం వల్ల కాయ నాణ్యత దిగుబడి బాగుంటుంది. కాపుని నియంత్రించేందుకు ఈ కింద వివరించిన ఏదో ఒక పద్ధతిని అవలంభించాలి.
పండ్ల కోత
జామ నాణ్యత నిల్వగుణం కాపు తీసుకునే కాలంపై ఆధారపడి ఉంటుంది. వర్షకాలం పంట కంటే శీతాకాలం పంటలో జామ నాణ్యత బాగా ఉంటుంది. పూత తర్వాత 4నుంచి 5 నెలలకు జామ కోతకొస్తుంది. కోతకొచ్చినప్పుడు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.ఒక చెట్టులో అన్ని కాయలు ఒకేసారి పక్వదశకు రానందున జామ కాయలను పలుమార్లు కోయాల్సి వస్తుంది.వర్షాకాలపు పంటలో 2నుంచి 3 రోజుల వ్యవధిలో, శీతాకాలపు పంటలో 4నుంచి 5 రోజుల వ్యవధిలో కాయలు తెంపాలి. కాయలు తెంపేటప్పుడు తొడిమెతోపాటు రెండు ఆకులు ఉండేటట్టు కోసినట్టయితే కాయ తాజాగా ఉంటుంది.దూరం ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి కూడా వీలుంటుంది.
దిగుబడి
శీతాకాలం కాపు సెప్టెంబరు నుండి జనవరి వరకు కోతకొస్తుంది.మంచి యాజమాన్య పద్ధతిలో నాటిన తోటలు రెండో సంవత్సరంలో కాపుకొస్తాయి. నాటిన మూడో సంవత్సరం నుండి లాభదాయకమైన దిగుబడులు వస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు తెంపాలి.అధిక సాంద్రతలో జామ సాగు చేసేటప్పుడు చెట్టుకు 10 నుంచి 15 కిలోల చొప్పున ఎకరానికి 8 నుంచి 10 టన్నులు, అత్యధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు 16 నుంచి 20 టన్నుల దిగుబడి పొందవచ్చు.
Authorization