పొలంలోని మట్టి జీవం కోల్పోయి క్రమేణా పంట ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. వాడుతున్న రసాయన ఎరువుల వినియోగం తగ్గి క్రమేపిి రసాయనిక ఎరువుల మోతాదు పెంచవలసి వస్తుంది. దీంతో రైతులకు ఖర్చు అధిగమవుతుంది. భూమిలో నీటి నిలువ సామర్ధ్యం తగ్గి ఎక్కువ నీరు ఉపయోగించాల్సి వస్తుంది. ఇదే క్రమంలో సూక్ష్మపోషకాల లోపాలు అధికమవుతాయి. తద్వార పంట ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఏటవాలు భూముల్లో మట్టికోత అధికమై సారవంతమైన పైమట్టి కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
పోషక విలువలు ఎలా పోగొట్టుకుంటున్నాం
కంపోస్టు, పశువుల ఎరువులను తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఇందులోని పోషకాల విలువలను పొందలేకపోతాం. నిర్లక్ష్యంగా వీటిని తయారు చేస్తే అవి బాగా చివకక పంటకు కావాల్సిన సత్ఫలితాలను ఇవ్వవు. అప్పుడప్పుడు వీటిమీద నీరు చల్లాలి. బాగా చివకడం కోసం నీడ ఉన్న ప్రాంతాల్లో వీటిని (గుంటలు) ఏర్పాటు చేయాలి. పొలంలో వాడటప్పుడు రైతాంగం కుప్పలుగా పోసి చాలా రోజులు అలాగే ఎండకు వదిలే పొలంలో వీటిని వెంటనే కలియదున్నాలి.
సేంద్రీయ ఎరువులు దొరకనప్పుడు ఏం చేయాలి
పొలానికి సేంద్రీయ ఎరువు వాడడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. ఈ ఎరువు దొరకనప్పుడు పంట అవశేషాలను కాల్చకుండా పొలంలో బాగా కలియదున్నాలి. చుట్టుపక్కల అభ్యమయ్యే పచ్చిరొట్ట ఆకును వీలైనంతగా వాడాలి. అప్పుడప్పుడు ఆకు బాగా రాల్చే సోయాచిక్కుడు వంటి పంటలను పండించడం ద్వారా కొంత మేరకు సేంద్రీయ ఎరువుల లోటు తీర్చినట్లు అవుతుంది. జీవన ఎరువులను బాగా చివికిన, తేమ కలిగిన సేంద్రీయ ఎరువులతో కలిపి వాడొచ్చు. ఇంకా వీలైతే 200-300 కిలోల బాగా చివికిన పశువుల ఎరువుతో జీవన ఎరువులను కలిపి 2-3 రోజులు నీడలో ఉంచి కలియపెట్టి వాడితే ఇంకా మంచి ఫలితాలుంటాయి. కానీ విత్తనానికి దట్టించవలసిన జీవన ఎరువులు వాటిని వాడవలసిన పద్ధతి ప్రకారం విత్తనానికే దట్టించాలి. మార్కెట్లో లభ్యమయ్యే సేంద్రీయ ఎరువు, రైతులు తయారు చేసుకున్న సేంద్రీయ ఎరువులకు తేడా ఏమీ ఉండదు. మార్కెట్లో దొరికే సేంద్రీయ ఎరువులో కొద్ది మోతాదులో పోషకాలు కలుపుతుంటారు. ఈ పోషకాలనే రైతాంగ ఎరువుల ద్వారా ఇస్తుంటారు. కనుక అధిక ఖర్చుతో వీటిని ఇవ్వడంకన్నా రైతాంగం తమ వీలును బట్టి తమ దగ్గరే కంపోస్టు, పశువుల ఎరువులను తయారు చేసుకొని వాడడం శ్రేయస్కరం. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఇక పోతే రైతులు తమ పొలంలో తక్కువగా ఉన్న పోషక పదార్ధాల గురించి తెలుసుకోలేక తద్వారా దాన్ని వాడకుండా అధికోత్పత్తి పొందలేకపోతున్నారు. అదే విధంగా రైతులు తమ పొలంలో సరిపోయినంత లేక ఎక్కువగా ఉన్న పోషకాల గురించి తెలియకుండా వాటిని అనవసరంగా ఎక్కువగా రసాయన ఎరువుల రూపంలో వాడి పంట ఖర్చును ఎక్కువ చేసుకుంటున్నారు. తమ పొలంలో ఉన్న చౌడు మొదలుగు పంట నిరోధక గుణాలను తెలుసుకొని వాటి గురించి చర్యలను తీసుకోకుండా నష్టపోతున్నారు.భూసార పరీక్షలకు 5నుంచి 10 ఎకరాల పొలంలో 10నుంచి 15 స్థాలాల్లో 15 సెం.మీ లోతులో మట్టిని తీసి భూసారపరీక్ష్షకు పంపించాలి. చిన్న రైతులు 1నుంచి 5 ఎకరాలు 5నుంచి 10 స్థలాల్లో మట్టిని తీసి ఒక ప్రయోగశాలకు పంపించాలి.
భూసార పరీక్షలు చేయిస్తే అన్ని ఎరువుల వాడకం తగ్గుతుంది. పొలాన్ని బట్టి సిఫార్సులు మారుతాయి. సాధారణంగా కొన్ని పోషకాలు ఎక్కువగా మరికొన్నింటిని తక్కువగా వాడమని ఫలితాలు సూచిస్తాయి. కనుక అన్ని ఎరువుల వాడకం ఎక్కువ కావడం లేకుండా తక్కువగ వాడమనే అపోహలు లేకుండ భూసార పరీక్షకు అనుగుణంగా ఎరువులు సిఫార్సు చేస్తారు. భూసార పరీక్షలలో సిఫార్సు చేసిన ఎరువుల కన్నా రైతు తక్కువగా లేక అధికంగా వాడుతున్నట్లయితే సమతుల్యత జరిగి పంట ఉత్పత్తి పెరుగుతుంది. అదే విధంగా ఏదైన పోషక పదార్థ లోపం భూసార పరీక్షలో తేలితే దాన్ని వాడడం వల్ల పంట ఉత్పత్తి పెరుగుతుంది. ఒక సారి చేసిన భూసార పరీక్షా ఫలితాలు రైతాంగానికి 2-3 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి. కనుక భూసార పరీక్షా ఫలితం మొదటిసారిగా పంట వేసిన తరువాత చేతిరి అందితే దాన్ని 2వ పంటకు కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే మొదట వేసిన పంట రెండో పంట వేరైతే రెండవ పంటకు ఎరువుల సిఫార్సు దగ్గరలోని వ్యవసాయ అధికారినిగానీ, భూసార కేంద్రంలో గాని వ్యవసాయ శాస్త్రవేత్తను గాని సంప్రదించి ఎరువులు వాడాలి.
నేల దెబ్బతింటుంది
బోరు బావుల నీటి నాణ్యత పంట మీద ప్రభావం చూపిస్తుంది. లవణాలు అధికంగా ఉన్నప్పుడు క్రమంగా నేల దెబ్బతిని పంట ఏపుగా ఎదగదు. వర్షాకాలంలో ఇటువంటి నీటి ప్రభావం, లవణాల సాంధత్రను బట్టి ఎక్కువగా దుష్పరిణామాలు ఇవ్వకపోయినప్పటికీ రబీలో బాగా నష్టం కలుగ చేస్తుంది. కనుక ఇటువంటి నీటిని సమీపంలో భూసార కేంద్రం పరీక్ష చేయించుకొని వాడకాన్ని నియంత్రించాలి. లేనట్లయితే కాలక్రమేణా భూమి దెబ్బతింటుంది.
పంట మధ్య కాలంలో భాస్వరం కలిగిన కాంప్లెక్స్లను వాడరాదు.
ఖర్చు వృధా అవుతుంది
పంట తనకు కావాల్సిన భాస్వరాన్ని భూమి నుంచి తన మొదట పెరుగుదల దశలోనే 70 నుంచి 80 శాతం వరకు గ్రహిస్తుంది. మిగిలిన భాస్వరాన్ని కూడా భూమి నుంచే లభ్యతను బట్టి భూమిలోపలి పొరలో ఉన్న వేర్ల ద్వారా గ్రహిస్తుంది. కనుక పైపాటి భాస్వరం ఎరువులను పంట మధ్యకాలంలో వేసినా కూడా అధిక ప్రయోజనం కలుగదు, ఖర్చు వృధా అవుతుంది. ఈ విధంగా మధ్యకాలంలో వేసిన భాస్వరపు ఎరువులు భూమిపై భాగంలోనే ఉండి పోతుంది.
అంతరంగిక మార్పులతో
పంటలో సూక్ష్మపోషక పదార్ధలోప చిహ్నలు చిన్న వయసులోనే కనిపిస్తాయి. సూక్ష్మపోషక పదార్ధ లోపం ఉన్నట్లయితే మొక్క సరిగ్గా పెరగదు. కనుక బాగా పెరిగిన మొక్కల్లో నీటి ముంపు, హఠాత్తుగా వాతావరణ ఉష్ణోగ్రత తగ్గింపు, అకాల, దీర్ఘకాలిక మబ్బుపట్టడం వంటి పరిస్థితుల వల్ల అంతరంగిక మార్పులు జరిగి ఆకులు పసుపుపచ్చగా మారుతాయి. సాధారణంగా బోరాన్ లోపంలో మాత్రం తక్కువ పూత పూయడం, కాయలు చిన్నవిగా రావడం వంటి మార్పులు పంట చివరి దశలో స్పష్టమవుతాయి. పంట కాలంలో జింక ్లోప నివారణకు జింకు పిచికారి అవసరం. దీని కోసం జింకు ఉన్న నాణ్యత గల పైవాటిని ఏదైనా వాడొచ్చు కానీ పిచికారి కొరకు అయ్యే ఖర్చు ప్రకారం జింక్ సల్ఫేట్ వాడితే ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు లీటరు నీటికి 2గ్రా. జింక్ సల్ఫేట్ చొప్పున ఒక ఎకరానికి వాడాల్సిన 200లీటర్ల పిచికారికి ఖర్చు మనిషి కూలీ ఒక రోజుకు 200 నుంచి 300 రూపాయలు. కానీ చలామిన్ ఖర్చు జింక్ సల్ఫేట్కన్నా ఎక్కువ. జింక్ సల్ఫేట్ భూమిలో వేయాడానికి ఎకరానికి 20 కిలోలు, ధర 400 నుంచి 500 రూపాయలు. ఇది మూడు పంటలకు సరిపోతుంది.
Authorization