రాష్ట్రంలో సుమారు 63 శాతం పంటలను వర్షా ధారంగా పండి స్తున్నారు. ఇక్కడి వాతావరణం బహువార్షిక ఉద్యాన పంటలు అంటే మామిడి, బత్తాయి, జామ, అరటి పండ్లతోటలతోపాటు కూరగాయలు, పూల తోటలకు అనువైనది. ప్రస్తుతం ఉన్న 3.79 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లకు పెంచుకునే అవకాశం ఉంది. తద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
మెట్ట భూముల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల తక్కువ సారం కలిగి నీటిని నిల్వ చేసుకోలేని నేలల్లో సాలుసరి పంటల దిగుబడులు అనేక ఒడిదుడుకులకు గురవుతాయి. కనుక రైతులు పంట కాలం ముందు, ఆ తర్వాత వచ్చే అకాల వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు లోతైన వేరు వ్యవస్థ కలిగిన పండ్ల తోటలను పెంచుకోవచ్చు.
లోతైన నేలల్లో సీతాఫలం
రైతులు తమ ప్రాంతానికి తగిన నేల, వర్షరీతిని అనుసరించి అనువైన పండ్ల తోటలు, రకాలను ఎన్నుకోవాలి. ఉదాహరణకు 600 నుంచి 700 మి.మీ వర్షపాతం మూడున్న నుంచి నాలుగు నెలల వరకు వచ్చు లోతైన నేలల్లో సీతాఫలం (బాలానగర్, అటిమోయా) చింత (పికెయం-1 అనంతపూర్, తిరుపతి సెలక్షన్లు), ఉసిరి (కృష్ణ, కాంచన్, చకియ బనారసి) నేరేడు (ఎరకాడ, రాజ్మన్, బిగ్ అర్కసహాన్) చాన్స్సీడ్లింగ్) వర్షాధారంగా వేసుకోవచ్చు.
ముఖ్య విషయాలు
మెట్ట ప్రాంతంలో వర్షాధారంగా పండ్ల తోటలను సాగు చేసే రైతులు గమనించాల్సిన ముఖ్య విషయాలు మెరక పొలాలు, ఆమ్ల క్షార (ఉప్పు) గుణాలున్న మెట్ట భూములు పండ్ల తోటలకు అనుకూలమైనవి కావు భూమివాలు, పాదుపరిధి, పరిసర పరిస్థితులను బట్టి నిర్ణీత దూరంలో కౌంటూర్ గ్రేడెడ్ గట్లనుగాని వాలు సూచికలను వేసుకోవాలి. సుమారు 60 సెం.మీ వ్యాసము గల గుండ్రటి లేక అంతర పరిమాణం గల చతురస్రాకారంలో గాని గుంతలను 80 నుంచి 100 సెం.మీ లోతు తవ్వుకోవాలి. ప్రతి గుంతలో 1/3 వభాగం బెంటోనైట్, 1/3 భాగం బాగా కుళ్లిన పశువుల ఎరువు (20 నుంచి 30 కిలోలు)1/3 సాధారణ మట్టి 50 నుంచి 100గ్రా డై అమ్మోనియం ఫాస్ఫేట్, 2 కిలోల వేపపిండి / ఆముదం / వేరుశనగ, 50 గ్రా ఫ్లోరైడ్ గుళికలు బాగా కలిపి తయారు చేసుకోవాలి.
నీరు సద్వినియోగం అవుతుంది
మొక్కలు నాటిన తర్వాత గాలికి పడిపోకుండా వెదురు లేక ఇతర కర్రలతో కట్టి ఆధారమివ్వాలి. వాలు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షపు నీరు భూమిలో ఇంకుటకు పండ్లతోటల పాదులను 'వి' ఆకారంలో తయారు చేసుకోవాలి. పండ్లతోటలను నాటిన మొదటి సంవత్సరం. వేసవి కాలంలో నీటి గుంటలలో నీల్వ ఉన్న నీటి సహాయంతో మొక్కలను సంరక్షించుకోవాలి. రెండో సంవత్సరం నుండి అవి వర్షాధారంగా పెరుగుతాయి. తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను సంరక్షించుకునేందుకు మట్టి కుండలను ఉపయోగించవచ్చు. ప్రతి మొక్క పాదులో 8 నుంచి 10 లీటర్ల నీరు పట్టే ఒక కుండకు పావుభాగం మధ్యలో నుండి కొంచెం కిందికి రంధ్రం చేసి గుడ్డ పేలికతో ఒత్తి ఉంచాలి. తర్వాత మట్టి మూతకు నీరు ఆవిరికాకుండా అమర్చాలి. ఈ విధంగా చేయడం ద్వారా మొక్కకు ఒక్కొక్క బిందువు రూపంలో నీరు అందుంతుంది. దీని వల్ల మొక్కకు పోసిన నీరు పూర్తిగా సద్వినియోగం అవుతుంది. వీలును బట్టి ఈ కుండలకు డ్రిప్ను అమర్చుకోవాలి.
బాగా పెరుగుతాయి
వేసవి కాలంలో వచ్చే వర్షాల సమయం నుండి సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు అంతర కృషి చేయాలి. ఈ పద్ధతి ద్వారా పండ్ల మొక్కలు నీరు, పోషక పదార్దాలను పూర్తిగా వినియోగించుకుని బాగా పెరుగుతాయి. రెండో సంవత్సరం నుండి బాగా కుళ్లిన పశువుల ఎరువు తగిన మోతాదులో రసాయన ఎరువులు, భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు మొక్కకు 10 నుంచి 15 సెం.మీ దూరంలో సిఫారసు చేసిన విధంగా వర్షకాలంలో వేసుకోవాలి.
మంచి దిగుబడి పొందవచ్చు
రెండో సంవత్సరం మొదటి వారాల్లో మొక్కలను కత్తిరించుకోవాలి. నీటి పరివాహక ప్రాంత పరిధిలో చేపట్ణిన భూసార నీటి సంరక్షణ చర్యల వల్ల కుంటలలో నిల్వ ఉన్న నీటిని పండ్ల తోటలకు పూత, పిందె దశలో వాడినట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. పడ్ల తోటలు కాపు రావడానికి 4 నుంచి 5 సంవత్సలు పడుతుంది. కనుక వర్షాకాలంలో పండ్ల చెట్ల మధ్య వరుసలలో తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయల పంటలు వాలుకు అడ్డంగా విత్తుకోవాలి.
Authorization