ప్రశ్న: పీిహెచ్సి కన్వేయన్స్ అలవెన్సు 900 రూపాయాలు పొందుతున్నారు. పీఆర్ఎస్-2015 ప్రకారం 2000 రూపాయలకు పెంచమని కోరగా సదరమ్ సర్టిఫికెట్ అడిగారు. ఆసర్టిఫికెట్ ఆగస్టు 2017లో సమర్పించారు. అప్పటి వరకు 900 రూపాయలు చెల్లిస్తూనే ఉన్నారు. కన్వేయన్స్ అలవెన్సు హెచ్చింపు పీఆర్సీ తేదీ నుంచి వర్తిస్తుందా? లేదా సర్టిఫికెట్ ఇచ్చిన తేదీ నుండి వర్తిస్తుందా? - టి రాజేష్, జగిత్యాల.
జవాబు: కన్వేయన్స్ అలవెన్సు పొందుతూనే ఉన్నారు కనుక ఆర్పీఎస్-2015లో కన్వేయన్స్ అలవెన్స్ హెచ్చింపు, జీవో 103, తేదీ:24.07.2015 ప్రకారం తేదీ: 01.07.2015 నుండి వర్తిస్తుంది.
ప్రశ్న: ఎస్జీటీ ఉపాధ్యాయులకు డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఓడీ సౌకర్యం ఉందా? ఉంటే ఎన్నిసార్లు వినియోగించుకోవచ్చు?
- బి. రవికుమార్, టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం
డిపార్టుమెంటల్ పరీక్షలకు ఓడి ఎన్నిసార్లు ఇవ్వాలి? బదిలీపై వేరొక పాఠశాల నుండి వచ్చిన వారికి ఎన్నిసార్లు వినియోగించున్నారో ఎలా తెలుసుకోవాలి?
- వై.పద్మావతి, మధిర
జవాబు: డిమార్టుమెంటల్ పరీక్షలకు ఓడీ సౌకర్యం ఉంటుంది. ఎస్జీటీ ఉపాధ్యాయులకు కూడా ఓడీ సౌకర్యం ఉంటుంది. ఉపాధ్యాయులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆప్షనల్ కాబట్టి ఫండమెంట్ రూల్ 9(6)(బి)(111) ప్రకారం రెండుసార్లు ఓడీ అవకాశం ఉంటుంది. ఇతర పాఠశాలల నుండి బదిలీ అయిన ఉపాధ్యాయులకు వ్యక్తిగత ధృవీకరణ పత్రం ఆధారంగా ఓడీ సౌకర్యం కల్పించవచ్చు.
ప్రశ్న: 50 సంవత్సరాలు నిండి, టీటీసీ, టీపీటీ విద్యా అర్హతలు కలిగిన ఎల్పీటీ ఉపాధ్యాయునికి 24 స్కేలు ఇవ్వవచ్చా?
- డి.నాగేశ్వరరావు, ఉప్పుసాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జవాబు: టీపీటీ ఉంది కనుక ఇంటర్, డిగ్రీ (ం2, ం3) కల్గి ఉండి, జీవోటీ, ఈవోటీ పరీక్షలు పాసయిన ఎల్పీటీ ఉపాధ్యాయునికి 24 సంవత్సరాల స్కేలు ఇవ్వవచ్చు. 50 సంవత్సరాల వయసు మినహాయింపు మెమో నెం. 034408/248/పిసీ.4/2011, తేదీ: 15.04.2015 ప్రకారం వర్తించదు.
Authorization