ప్రశ్న: నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1999 సెప్టెంబరులో చేరాను. అదే సంవత్సరం జూన్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాను. నాకు ఈ ఉద్యోగం ఇంటర్ క్వాలిఫికేషన్తో వచ్చింది. అయితే నేను డిగ్రీలో చేరిన సంవత్సరంలోనే ఉద్యోగంలో చేరాను కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా?లేదా తెలుపగలరు. నాకు టెక్నికల్ బోర్డు ద్వారా చదువుకునే అవకాశం ఉందా? లేదా తెలుపగలరు.
కృష్ణ, మెదక్
జ. డిగ్రీ పూర్తి చేశారా లేదా చెప్పలేదు. డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తి చేసి ఉంటే చెల్లుబాటు అవుతుంది. రెగ్యులర్ కోర్సు అయితే మీ నియామకపు అధికారి అనుమతి ఉండాలి. ఇంకా ఉద్యోగానికి సెలవు పెట్టి చదువుకుని వుండాలి. ఆ విధంగా చదివిన డిగ్రీ ఆధారంగా టెక్నికల్ బోర్డు ద్వారా తదుపరి చదువు కొనసాగించవచ్చు.
పశ్న: నాది 2012 డీఎస్సీ నేను డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. 2013లో పరీక్షలు రాయకుండా 2014లో రాసి పాస్ అయ్యాను. అయితే నేను ఇప్పుడు బి.ఇడీ చేసుకునే అవకాశం ఉందా? లేదా? తెలుపగలరు.
దేవేందర్, వరంగల్
జ. ప్రభుత్వ మెమో నెం. 609/సర్వీస్-సి/78-1, జిఎడి తేది: 06.04.78 మరియు కాండక్ట్ రూల్స్ ప్రకారం ఉద్యోగంలో చేరిన తర్వాత చదువుకోవాలంటే ఉన్నతాధికారులు (డిఇఓ) అనుమతి తీసుకోవాలి. మీరు ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాయడంకోసం సెలవుపెట్టి, అధికారుల అనుమతి తీసుకొని వుంటే ఆ డిగ్రీ ఆధారంగా బి.ఇడి. చేయవచ్చు.
Authorization