యాదమ్మ... నలభై ఏండ్ల నుంచి బీడీలు చుడుతూనే ఉంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత భర్త ఎటో వెళ్ళిపోయాడు. ఉన్నన్ని రోజులు కూడా అతని వల్ల యాదమ్మకు ఎలాంటి సుఖం లేదు. బీడీలు చుడితేనే కడుపు నిండేది. ముగ్గరు కూతుళ్ళను కష్టపడి చదివించాలనుకుంది. పగలంతా బీడీలు చుడితే నెలకు నాలుగు వేలు. ఈ వచ్చే ఆదాయం ఆ కుటుంబానికి ఎక్కడ సరిపోతుంది. అందుకే యాదమ్మ రాత్రీ, పగలు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బీడీలు చుడుతూనే ఉంటుంది.
విశ్రాంతి లేకుండా పని చేయడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. తల్లి మంచాన పడే నాటికి పెద్ద కూతురు విజయ పదోతరగతి చదువుతోంది. దాంతో చదువు మానేసి ఆమె కూడా బీడీలు చుట్టడం మొదలు పెట్టింది. పదో తరగతి పరీక్షలు కూడా రాయలే కపోయింది. కూతురు చదువు తన వల్ల ఆగిపోయిం దని యాదమ్మ కుమిలిపోయేది. ఆ వయసులో కూడా 'ఏం కాదులే అమ్మా, ఇద్దరు చెల్లెళ్ళను మంచిగా చదివిద్దాం' అని విజయ తల్లికి ధైర్యం చెప్పేది. ఆరు నెలలకు అనారోగ్యం నుంచి కోలుకున్నా యాదమ్మ మునుపటిలా పని చేయలేక పోతున్నది. చిన్నప్పటి నుంచి బీడీలు చుట్టడం తప్పా వేరే పని తెలియదు. ఎంత కష్టం వచ్చినా ఈ పనే చేసుకునేది. ఐదు పొట్టలు నిండాలి, ఇంటి ఖర్చులు, అనార్యోగం, పిల్లల చదువులు ఇవన్నీ తలచుకుంటే యాదమ్మకు నిద్రపట్టేది కాదు. అందుకే విజయ చదువు పూర్తిగా మానేసింది. మిగిలిన ఇద్దరు పిల్లలు మాత్రం చదువుకుంటున్నారు.
కూలి పెరిగితే బాగుండని ఎన్నో సార్లు అనుకుంది. కానీ ''ఎవరు పెంచుతారు, ఎందుకు పెంచుతారు'' అని మనసులోనే అనుకుని కుమిలిపోయేది. చేయగలిగి నంత కష్టం చేసేది. విజయ చదివే స్కూల్లో విద్యార్థి సంఘం వాళ్ళు ఆమెకు పరిచయం అయ్యారు. స్కూల్ ఎందుకు మానేసిందో తెలుసుకోడానికి వాళ్ళు ఆమె ఇంటికి వెళ్ళారు. ఇంటి పరిస్థితి చూసి చలించిపోయారు. విద్యార్థి సంఘం వాళ్ళే విజయను పదో తరగతి పరీక్షలకు ఫీజు కట్టి రాయించారు. ప్రస్తుతం విజయ ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతూ ప్రైవేట్గా డిగ్రీ చదువుతోంది.
విద్యార్థి సంఘం వాళ్ళ ద్వారా యాదమ్మకు బీడీ కార్మికుల కోసం పని చేసే యూనియన్ పరిచయమయింది. యూనియన్గా పోరాడితే బీడీకార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలుసుకుంది. అప్పటి నుంచి వీలున్నప్పుడల్లా యూనియన్ కార్యక్రమాలకు కూడా పోయేది. తనలాగే బీడీలు చుడుతూ కష్టపడుతున్న ఎన్నో జీవితాల గురించి అక్కడ తెలుసుకుంది. అక్కడ సంఘం వారు చెబితే తప్పా తను వర్ధీబీడీ కార్మి కురాలని తెలియదు. ఇంతకీ ఈ వర్ధీ బీడీ కార్మికులంటే ఎవరో తెలుసుకోవలనుకుంది యాదమ్మ.
బీడి కార్మిలను పిఎఫ్ కార్మికులు, నాన్ పిఎఫ్ బీడి కార్మికులుగా వున్నారు. ఈ నాన్ పిఎఫ్ బీడి కార్మికులను వర్ధీ బీడి కార్మికులుగా పిలుస్తారు. వీరికి ఎటువంటి కార్మిక చట్టాలు వర్తించవు. ఎటువంటి సౌకర్యాలు వుండవు. దాంతో యాజమాన్యం వర్ధీ బీడి కార్మికులతో వెచ్టిచాకిరి చేయించుకుంటుంది. బీడి కంపనీ యాజమాన్యాలు ఈ వర్ధీ బీడి కార్మికుల శ్రమను జలగలా పట్టి జుర్రుకుంటున్నారు.
ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కి వర్ధీ బీడి కార్మికుల శ్రమను దోచుకుంటూ యాజమాన్యం కోట్ల రూపాయాలు వర్ధీ బీడి ద్వారా సొమ్ము చేసుకొంటు న్నారు. కార్మికులకు జి.ఓ ప్రకారం చెల్లించాల్సిన వేతనాలు చెల్లించకుండా, తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి కట్టవల్సిన పన్నులు కట్టాకుండా ఎగ్గొడుతున్నారు. ఒక పక్క యాజమాన్యం కార్మికులతో వర్ధీ బీడి చేయించు కుంటుంటే, దానికి సర్కాలు సైతం తొత్తులుగా మారి కార్మికులకు మరింత అన్యాయం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా బీడి కార్మికులు ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, బత్తీ కార్మికులు, గంపావాలా, టేకీదార్లు తదితర పనులు చేసేవారందరూ కలిసి 60 లక్షలమంది ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా బీడి పరిశ్రమను నమ్ముకొని పనిచేస్తున్నారు. చేనేత రంగం కుంటుపడిన తర్వాత రాష్ట్రంలో నిజామాబాద్, ఆది లాబాద్, కరింనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ జంటనగరాల్లో పెద్ద మొత్తంలో కార్మికులకు ఉపాది కల్పిస్తున్నది బీడి పరిశ్రమే. గత కొన్ని దశాబ్దా లుగా ఈ పరిశ్రమను నమ్ము కుని వేలాది కుటుంబాలు జీవి స్తున్నాయి. ఇంటిల్లిపాదీ బీడిలు చుట్టి ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఎన్నో.
ఈ పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు కొంతకాలంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యం గా కేంద్ర ప్రభుత్వం బీడి పరిశ్రమపై అంక్షలు విదించడం ఒకటైతే, బీడి కార్మికుల నిరక్షరాశ్యతను ఆసరా చేసుకొని యాజమాన్యం అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతున్నారు. నాన్ పీఎఫ్ కార్మికులకు నెలకు 26 రోజులు పని వుండదు. గుర్తింపు పొందిన 50 బీడి కంపెనీ యాజమా న్యాలతో పాటు, చిన్నా చితకా వర్ధీ బీడి వ్యాపారులు బీడి కార్మికుల శ్రమను నిలువు దోపిడి చేస్తు న్నారు. నెలలో వారం, పదిహేను రోజులకు మించి పని లేదు. మిగిలిన రోజుల్లో అదే ఆకు, తంబాకు, దారం ఇచ్చి వర్ధి బీడి చేయించుకుంటున్నారు. వర్ధీ బీడి యాజమాన్యాలు కూడా ప్రభుత్వ అండదండలతో నిర్భందంగా వర్ధిబీడి తయారు చేయించు కుంటున్నారు. కార్మికులకు గత్యంతరం లేక, సరిపడ వేతనాలు రాక వర్ధీ బీడిలు చేస్తున్నారు.
బీడీ కార్మికులకు జీఓ ప్రకారం 248 రూపాయలు రావాలి. అయితే యజమానులు 135కు మించి ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ రేటు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఇక వర్ధి బీడి కార్మికులకు వెయ్యి బీడిలకు 100, 110 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి వంద రూపాయలకు పది రూపాయలు పిఎఫ్ డబ్బులు యాజమాన్యం వాటా కట్టాల్సి వుంటుంది. కాని కట్టడంలేదు. ప్రతి వెయ్యి బీడిలకు సెంట్రల్ ఎక్సైజ్పన్ను 14.30రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. అంటే అటు ప్రభుత్వాన్ని ఇటు బీడి కార్మికులను నిలువునా మోసం చేస్తూ, ప్రతి వెయ్యి బీడిలకు, వర్ధీబీడి మూలంగా అదనంగా 50 రూపాయలు యాజమాన్యం లాభం పొందుతున్నారు. వర్ధిబీడి రోజుకు కోటి, రెండు కోట్ల బీడి రాష్ట్రంలో తయారు అవుతుంది. దీనిఫలితంగా బీడి కార్మికులు శ్రమదోపిడితో పాటు పిఎఫ్, పెన్షన్, సర్వీసులో గ్రాడ్యూటీ నష్టపోతున్నారు. కార్మికులకు ఇటువంటి సౌకర్యాలు లేకపోవడంతో యాజమా న్యం ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండికొడుతున్నారు.
వర్ధీ బీడి వ్యాపారులకు లేబర్, పిఎఫ్, ఫారెస్టు, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు, ప్రభుత్వం సహకరించి వారి నుండి నెలనెలా ముడుపులు తీసుకుంటూ యాజమాన్య దోపిడీని అధికారులు గుడ్లు అప్పగించి చూస్తున్నారు తప్పా మరేమి చేయడం లేదు. దీని మూలంగా, వర్ధి బీడి వ్యాపారం మూడు పూలు పన్నెండు కాయలుగా విరజిల్లుతున్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రోజూ కోటి బీడిలు వర్ధి బీడి తయారు జరుగుతుంది. ఇక్కడ తయారు అయిన వర్ధి బీడి, పొరుగు జిల్లాలకు, రాష్ట్రాలకు తరలి పోతుంది. అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ బీడి అండ్ సిగార్ వర్క్ర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిఎఫ్ కార్మికులు కల్సి వర్ధి బీడిని అడ్డుకొని, దాదాపు 40 లక్షల బీడిలను లేబర్, పిఎఫ్ అధికారులకు, పోలీసులకు అప్పగించారు.
కాని, వర్ధీ వ్యాపారాలపై అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోలేదు.పత్రికల్లో తాటికాయ అక్షరాలతో వార్తలు వచ్చినా పిర్యాదులు చేసినా, పట్టిచుకోలేదు. అంటే వర్ధీ బీడి వ్యాపారులకు ప్రభుత్వ అధికారుల అండదండలు ఎంత వరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల కార్మిక చట్టాలు యాజమాన్యాల చుట్టాలుగానే వున్నాయి. నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రద్ద పెట్టి బీడి కార్మికుల పొట్టకొడుతున్న వర్ధీ బీడి వ్యాపారులపై చర్యలు తీసుకొని బీడి కార్మికులకు నెలకు26 రోజులు చేతినిండా పని, వెయ్యి బీడిలకు నాణ్యమైన తునికాకు ఇప్పించి బీడి కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదంతా తెలుసుకున్న తర్వాత బీడీ కార్మికులు ఎంతగా శ్రమ దోపిడికి గురవుతున్నారో యాదమ్మకు అర్ధమయింది. అప్పటి నుంచి తమ సమస్యల పరిష్కారం కొరకు యూనియన్తో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంది.
Authorization