రాష్ట్ర వ్యాప్తంగా బీడి కార్మికులు , కార్మిక సంఘాల ఐక్య పోరాటల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడి కార్మికులకు కరువు భత్యం (VDA) అగ్రిమెంట్ 1994 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ల్లో కరువు భత్యం ప్రభుత్వం పెంచుతుంది. 2018 జనవరి నుండి 2018 డిసెంబర్ వరుకు వినిమయ ధరల పెరుగుదల సూచి ప్రకారం 48 పాయింట్లు వరకు పెరిగింది.
పెరిగిన వివరాల
దీని ప్రకారం పాయింట్ కు 0-10 పైసలు చొప్పున లెక్క కూడితే వెయ్యి బీడిలకు రూ 4-80 పైసలు పెరిగింది. మొత్తం వెయ్యి బీడీలకు అన్నీ కలిపితే రూ/- 186-14 పైసలు బీడీ యజమాన్యాలు ఏప్రిల్ 1 నుండి చెల్లించాలి. ఈ పెరిగిన కరువు భత్యం బీడీ కార్మికుల తోపాటు , బీడీ ప్యాకర్లకు, నెలసరి ఉద్యోగులకు, బట్టి చాటన్, లారీ, జీపు డ్త్రెవర్లకు, మేనేజర్లుకు చెల్లించాల్సి ఉంటుంది. నెల సరి ఉద్యోగులకు ఒక్కరికీ ఒక్క రోజుకు 4-80 పైసలు చొప్పున నేలకు 144/-లు బీడీ ప్యాకర్లకు పెరిగిన కరువు భత్యం రోజు 4-80 పైసలు వివిధ రకాల నమూనా బీడీ ప్యాకింగ్ కలిగిన లక్ష బీడీ ప్యాకింగ్కు కరువు భత్యం అదనంగా పెరిగింది. ఈ పెరిగిన కరువు భత్యం 1-4-2019 నుండి బీడీ యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాలి,
కార్మికులకు చెల్లించాలి
వెయ్యి బీడీలకు బేసిక్ 109-60 రూపాయలు, కరువు భత్యం (VDA)రూ,51-80 రూపాయలు, బోనస్ 8.33 శాతం 13-44 రూపాయలు, సంవత్సరాది సెలవులతో కూడిన వేతనం 5% అంటే 8-07 రూపాయలు, జాతీయ, పండుగల సెలవులతో కూడిన వేతనం 2% అంటే 3-23 రూపాయలు అన్నీ కలుపుకొని మొత్తం వెయ్యి బీడీలకు పెరిగిన రేటు ప్రకారం 186-14 రూపాయలు ఇవ్వాలి. ఈ పెరిగిన కరువు భత్యాన్ని బీడీ యాజమాన్యాలు ఇవ్వడంలేదు. అందుకే అది అమలు అయ్యే వరకు పోరాటం చేయాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యునియన్ (CITU) రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
Authorization