తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఫార్మసి కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఈ సమస్యల సాధనకై 'తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్' స్థాపించుకున్నారు. దీని ఆధ్వర్యంలో ఆ ఉద్యోగులు తమ సమస్యలపై పోరాడుతున్నారు. వారి సమస్యలేంటో ఈ వారం కొలువులో తెలుసుకుందాం...
AICTE/UGC ప్రకారంగా వేతన సంఘం అమలు పరిచిన 6వ వేతనం వీరికి ఇవ్వాలి. కానీ ఏ ఒక్క కళాశాలలో కూడ అది అమలు కావడం లేదు. కొన్ని కళాశాలలో 6వ వేతనం ఇస్తున్నాం అని చెప్పి దానిని తిరిగి చెక్కు రూపంలో గానీ, ప్రత్యక్షంగా గానీ ఇంకా చెప్పాలంటే కాలేజీలోని ఏటీఎం సెంటర్ల ద్వారా తీసి ఇవ్వాలి. లేకపోతే వారి ఉద్యోగం వదిలిపెట్టు కోవాల్సిన పరిస్థితి. ఇంకా కొన్ని కాలేజీలో 3 నుంచి 9 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
అమలుకు నోచుకోని చట్టం
ఎన్.టి.రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నన్నప్పుడుAP EDUCATION ACT-1982 ని తీసుకువచ్చారు. ఇప్పుడు TS EDUCATION ACT-1982 గా మార్పు చెందింది. ఇందులోని చాప్టర్-14, సెక్షన్-84 ప్రకారం ఉద్యోగికి ప్రతీ నెల ఒకటవ తేదీన జీతం చెల్లించాలి. కానీ అది ఎక్కడా అమలు జరగటం లేదు. దాంతో ఎంతోమంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశముంది. అధికారులు స్పందించి ఉద్యోగులకు ప్రతీ నెలా జీతాలు ఇచ్చేలా చేయాలి. తద్వారా విద్యార్థులకు సరైన విద్య అందుతుంది.
గ్రూప్ ఇన్సూరెన్స్
కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలని AICTE హ్యాండ్ బుక్-2019-20 , పేజ్.131, పాయింట్-28 లో తెలియజేసింది. కానీ ఒక్క కళాశాల కూడా దీన్ని చెల్లించడం లేదు.
ఉద్యోగ భద్రత
ఎప్పుడు, ఎవరిని, ఎందుకు ఉద్యోగం నుండి తొలగిస్తారో తెలియదు. అయితే ఉద్యోగిని తొలగించాలంటే TS EDUCATION ACT-1982 లోని చాప్టర్-14, సెక్షన్-79 ప్రకారం టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఆ ఉద్యోగి చేసిన తప్పు ఒప్పులను దర్యాప్తు చేసి నిరూపణ బట్టి చర్య తీసుకోవాలి. ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం అయితే అతనికి రావాల్సిన పారితోషికాన్ని పూర్తిగా చెల్లించాలని చట్టంలో ఉంది. ఇవేవీ పట్టించు కోవడం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కామన్ సర్వీస్ రూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడ మా ఉద్యోగులకు అమలు చేయాలి.
మెటర్నిటీ సెలవులు
మహిళా ఉద్యోగులకు ఉండాల్సిన సెలవు దినాలు ఎక్కడా పాటించడం లేదు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు 6 నెలల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులను ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్పాయి. ఇది కూడా ఎక్కడా అమలు కావడం లేదు.
ధ్రువ పత్రాలు
AICTE నిబంధనల ప్రకారం ఏ ఒక్క కళాశాల కూడా ఉద్యోగుల ధృవ పత్రాలు వారి దగ్గర ఉంచుకోరాదు. కానీ యాజమాన్యాలు AICTE రూల్స్ పాటించకుండా ఉద్యోగుల ధ్రువ పత్రాలు దగ్గర పెట్టుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు .
పైన పేర్కొన్న సమస్యలే కాకుండా ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వారి జీవితాన్ని దిన దిన గండంగా గడుపుతున్నారు.
ఈ విషయాలపై అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ సమస్యలనుపరిష్కరించాలని ఉద్యో గులు కోరుకుంటున్నారు.
అమలు కాని చట్టం
ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న మాకు చాలీ చాలని జీతాలు ఇస్తూ ప్రభుత్వాలకు మాత్రం 6వ వేతనం ఇస్తున్నామని చెప్పి ఇష్టాను సారంగా ఫీజులు పెంచుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం 10000/- నుండి 25000/- మద్యలో జీతాలు ఇస్తున్నారు. అంతే కాకుండా JNTUH పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్గా పనిచేస్తే ఆ రుసుములు కూడ చెల్లించడం లేదు. దీనిగురించి అడిగితే JNTUH అధికారులు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. మహిళ ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు 6 నెలల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. ఇది కూడా ఎక్కడా అమలు కావడంలేదు. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు కాలేజీలో అడుగుపెడితే మళ్ళీ సాయంత్రం ఏ టైమ్కు బయటకు వస్తామో తెలియదు. దాంతో పని భారం పెరిగి లేని రోగాలు వస్తున్నాయి. దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి చర్య తీసుకోవాలి. ఉద్యోగులకు మేలు జరిగేలా చూడాలి.
- నర్సింహ రాజు,అసిస్టెంట్ ప్రొఫెసర్
తప్పుడు నివేదికలు ఇస్తూ...
తనిఖీల పేరుతో FFC / TSFRC ముందు ఉద్యోగులకు 6వ వేతనం అమలు చేస్తున్నాం అని చెప్పి తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వం నుంచి కాలేజీ లో 40000/- నుంచి 165000/- వరకు ఫీజులు పెంచుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం కనీస జీతం కూడా ఇవ్వడం లేదు. అంతే కాకుండా ఉద్యోగుల కామన్ సర్వీస్ రూల్స్ పాటించకుండా ఆదివారం, పబ్లిక్ సెలవు రోజుల్లో కూడా కాలేజీలు నడుపుతున్నారు. ఉద్యోగ భద్రత అసలే లేదు. ఉద్యోగంలోంచి ఎప్పుడు తీసేస్తారో అనే భయం గుప్పిట్లో జీవితాన్ని గడుపుతున్నారు.ఉద్యోగులకు JNTUH పరీక్షలకు సంబంధించిన ఇన్విజిలేటర్, లాబ్ ఇంటర్నల్ ఎగ్జామినర్, ప్రాజెక్ట్ గైడ్కు ఇవ్వలసిన రుసుములు చెల్లించడం లేదు. ఇఎస్ఐ, పీఎఫ్ ఊసే లేదు. మా చుట్టూ ఇన్ని సమస్యలు ఉంటే మేము విద్యార్థులకు సరైన విద్యను ఎలా అందించాలి? ఆ మేరకు విద్యార్థులు నష్ట పోతారు కదా?
- బి. అనంత రామ్ ,అసోసియేట్ ప్రొఫెసర్
అధికారులు స్పందించాలి
మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. పని భారం పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కళాశాలలో 6 వ వేతనం ఇస్తున్నాము అని చెప్పి మాకు కనీసం 20000 కూడా ఇవ్వడం లేదు. ఇలాంటీ వారిపైన AICTE చర్య తీసుకోవాలి. కానీ చూసీ చూడనట్టు వ్యవరిస్తుంది. అంతే కాకుండా మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు 6 నెలల వేతనం కూడిన సెలవులు ఇవ్వాలని చట్టంలో ఉన్నా అది ఏ మాత్రం అమలుకు నోచుకోలేదు. మాకు 3 నెలల జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పోనీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోదామంటే ధ్రువ పత్రాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. సెలవు రోజుల్లో పని రోజుగా పెట్టీ ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలి. జీతాలు ప్రతీ నెల ఇచ్చేలా చేయాలి.
- సువర్ణ దేవి,అసిస్టెంట్ ప్రొఫెసర్
విద్యార్థులకు నష్టం
ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితం చాలా కష్టంగా మారింది. ఉద్యోగులకు దాదాపు 3 నుంచి 9 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం వేదిస్తున్నారు. ఉద్యోగులు స్నేహపూర్వకమైన వాతా వరణంలనో ఒక గ్రూప్గా కలిసి ఉంటే వారిని ఆవిధంగా ఉండకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్ సంబంధిత బ్రాంచ్ HOD లకు చెబుతున్నారు. మానసికంగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ మేము విద్యార్థులకు సరైన విద్యా అందించలేం. మరీ ముఖ్యంగా ఉద్యోగుల ధ్రువ పత్రాలు యాజమాన్యం దగ్గర పెట్టుకొని ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఈ విషయంలో AICTE/ JNTUH అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
- ఆర్.శ్రీనివాస్,అసోసియేట్ ప్రొఫెసర్
Authorization