నేయ్యి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. స్నానం చేయడానికి ముందు కొంచెం నెయ్యి తీసుకొని చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మదువుగా తయారవుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవలసిన అవసరం ఉండదు.
కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.
కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్కి కొన్నిచుక్కలు గోరువెచ్చని నెయ్యి కలపాలి. ఈ నూనెని మొదట మాడుకు మసాజ్ చేయాలి. తరువాత జుట్టుకు రాసుకోవాలి. పావుగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన జుట్టును మదువుగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు.
ప్రతి రోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది.
పొడిగా ఉండే పెదాలకు ప్రతిరోజూ లిప్బామ్ రాసుకోవల్సి ఉంటుంది. కానీ ప్రతిరోజూ పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మదువుగా తయారవుతాయి. దాంతో లిప్బామ్ అవసరమే ఉండదు.
కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడిచేసి చిట్లిన జుట్టుకు రాసుకోవాలి. ఓ గంట తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
నిద్ర సరిపోకపోవడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. పడుకునే ముందు కళ్లచుట్టూ ఉండే భాగాన్ని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు చాలా త్వరగా పోతాయి.
కళ్లకు వేసుకున్న మేక్పని చాలా జాగ్రత్తగా తీసివేయాలి. అందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా దూది తీసుకొని నెయ్యిలో ముంచి కళ్లచుట్టూ ఉండే చర్మాన్ని తుడవాలి.
Authorization