బొక్కలు అరిగేలా ఒంట్లో బలం ఉన్నంత కాలం మూటలు, బస్తాలు మోస్తారు. వయసైపోయిన తర్వాత వీరి పరిస్థితి ఏంటి? ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించుకుని గెలిపించిన ప్రభుత్వానికి వీరి బాధ్యత పట్టదా? పనిచేసే సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే పట్టించుకునే దిక్కు లేదు. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, మంచినీరు ఉండవు. అలిసిపోయి కూర్చుందామంటే షెడ్లు ఉండవు. ఐదు భోజన కేంద్రాలు కూడా వీరికి అందుబాటులో ఉండవు. కూలీరేట్లు పెంచాలంటే సేట్లను బతిమాలాడాలి. ఇఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించరు. ఇన్ని సమస్యల మధ్య బతుకీడుస్తున్నారు హమాలీ కార్మికులు.
- దాదాపు 200 మంది హమాలీలు పనిచేసే ముక్తార్గంజ్లో కనీస సౌకర్యాలైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. హమాలీలు కూర్చునేందుకు కనీస షెడ్ లేదు.
- 150 మంది హమాలీలు ఉన్న కిషన్గంజ్లో అందరూ ట్రాన్స్పోర్ట్ హమాలీలు. రాత్రి ఒక గంటల నుంచి పనిచేయాలి. రాత్రిపూట పనిచేసే క్రమంలో శతాబ్దాలుగా ఇక్కడ నివసించే ప్రజలతో నిత్యం గొడవలవుతున్నాయి. గతంలో మూత్రశాలలు ఉండేవి. వాటిని కూల్చేశారు. విశ్రాంతి షెడ్ లేదు.
- 150 మంది హమాలీలు పనిచేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి కూలిరేట్లు పెంచి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. గతంలో హమాలీలు కూర్చుండే ప్రభుత్వ స్థలాన్ని ఇతరులు కబ్జాచేసి షాపులు కట్టుకున్నారు. మూత్రశాలలు లేవు.
- 200 హమాలీలు పనిచేస్తున్న ఫీల్ఖానా మార్కెట్లో కూలిరేట్లు సరిగా లేవు. ఇతర రాష్ట్రాల కార్మికులతో చాకిరీ చేయిస్తున్నారు. సంఘం దగ్గరికి కార్మికులను రానివ్వడం లేదు.
- 250 మంది హమాలీలు పని చేస్తున్న బేగం బజార్లో సీఐటీయూ బలంగా ఉంది. దాంతో ట్రాన్స్పోర్టుల్లో కూలిరేట్లు పెరుగుతున్నాయి. అయితే పప్పు, చక్కెర షాపుల్లో పనిచేసే హమాలీలకు రేట్లు సరిగా లేవు. సేట్ల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. మూత్రశాలలు లేవు. విశ్రాంతి షెడ్లేదు.
- భూలక్ష్మమ్మ గుడి వద్ద 50 మంది హమాలీలు ఉంటారు. వీళ్ళందరూ ట్రాన్స్పోర్టు హమాలీలు. కూలీరేట్లు సరిగా లేవు. మూత్రశాలలు, విశ్రాంతి షెడ్ లేదు.
కొత్త ఉస్మాన్గంజ్ వద్ద 300 మంది హమాలీలు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల హమాలీలతో చాకిరీ చేయిస్తున్నారు. కూలీరేట్లు లేవు. మూత్రశాలలు, విశ్రాంతి షెడ్స్ లేవు.
డిమాండ్స్:
- హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. గుర్తింపు కార్డులివ్వాలి. ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షలు, సాధారణమృతికి ఒక లక్ష దహన సంస్కారాలకు 10 వేలు ఇవ్వాలి.
- ఇఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
- డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
- పనిచేసే చోట కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీరు, విశ్రాంతి షెడ్లు కల్పించాలి.
- ఐదు రూపాయల భోజన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ కార్మికులుగా గుర్తించాలి. పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
- మార్కెట్ ధరలకు అనుగుణంగా కూలిరేట్లు పెంచాలి.
Authorization