Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ప్రపంచాన్ని మహ మ్మారిలా చుట్టే సింది. ఇది వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీసింది. అందు లోనూ చిన్న వ్యాపారాల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఇవి కొనసాగాలంటే పటిష్టమైన ఆధారం అవసరం. ప్రస్తుతం సమాచారాన్ని చేర వేయడంలో ఇంటర్నెట్ అత్యంత ప్రభావ వంతమైన మాధ్యమంగా ఉంది. సోషల్ మీడియాని ఉపయోగిం చుకుని వ్యాపారాలు వినూత్న పద్ధతుల్లో తమ సమస్యలకు పరిష్కారాలు వెదుక్కుంటూ ముందుకు పోతున్నారు. మహమ్మారి సమయంలో తమ వ్యాపారాలను కొనసాగించ డానికి ఎలాంటి కొత్త ఆవిష్కరణలు చేశారో ముగ్గురు మహిళా వ్యాపార వేత్తలు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉపయోగపడిందో చెబుతున్నారు.
ఫేస్బుక్, ప్రపంచ బ్యాంక్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఇసిడి) అనే మూడు సంస్థలు కలిసి 'ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ రిపోర్ట్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ సహాయంతో వ్యాపారం చేస్తున్న లక్షలాది చిన్న వ్యాపారాలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫేస్బుక్ ద్వారా వ్యాపారం చేస్తున్న వ్యాపార వేత్తల్లో సుమారు 18 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం పురుషుల కన్నా కూడా సోషల్ మీడియా తమకే ఎంతగానో ఉపయోగ పడుతుందని మహిళా వ్యాపారవేత్తలు తెలియజేశారు.
సోషల్ మీడియా వేదికగా
లాక్డౌన్ సమయంలో అనేక మంది మహిళా వ్యాపారవేత్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తమ వ్యాపారాన్ని కొనసాగించారు. అప్పటికే ఉన్న కష్టమర్లకు నిరంతరం సమాచారాన్ని అందించడానికి, కొత్త కష్టమర్లను చేరుకోవాడానికి ఫేస్బుక్ను విస్తృతంగా ఉపయోగించుకున్నారు. దేశంలో మార్చి 24న మొదటిసారి లాక్డౌన్ ప్రకటించారు. తమ అవసరాలు చూసుకునేందుకు ప్రజలకు కనీసం నాలుగు గంటల సమయం కూడా ఇవ్వలేదు. ఇక వ్యాపారవేత్తలైతే ఈ షాక్ నుండి కొలుకోడానికి కొంత సమయం పట్టింది.
ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలని
''ఫిజీ గోబ్లెట్ పూర్తి మేడ్-ఇన్-ఇండియా బ్రాండ్గా మంచి పేరు సంపాదించింది. మా దగ్గర చేతివత్తులు తయారు చేసేవారు మాతో కలిసి ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మా కింద వందలాది మంది చేతివత్తులవారిని కూడా నియమించాము. ప్రతి జత చేయడానికి 60 గంటలకు పైగా సమయం పడుతుంది. దీనిలో నైపుణ్యం సాధించడానికి చాలాకాలం పడుతుంది. మనదేశ కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో పని చేస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉచిత షిప్పింగ్ను అందిస్తున్నాం. ఉత్తమమైన నాణ్యమైన డిజైనర్ పాదరక్షలను సరసమైన ధరలకు అందిస్తున్నాము'' అంటున్నారు లక్షీత.
కష్టకాలంలో ఆదుకోవాలని
చిన్న, మధ్యస్థ వ్యాపారాల డైరెక్టర్ అర్చన వోహ్రా మాట్లా డుతూ ''చిన్న వ్యాపారాలు అభి వృద్ది చెందడానికి, మహమ్మారి సమయంలో కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త పద్ధతులను అవలంబించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎలా సహాయపడుతుందనే విషయంపై ఇలా అంటున్నారు... ''ప్రస్తుతం భారతదేశంలో చిన్న వ్యాపారాలు సజావుగా సాగడానికి ముఖ్యమైన మార్గాలలో ఒకటి ఆఫ్లైన్ వ్యాపారం. అలాగే దీన్ని డిజిటల్ వైపుకు మార్చడం. కోవిడ్-19 వల్ల అనేక వ్యాపారాలను డిజిటల్ చేయడానికి, ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కు మారడం అనివార్యంగా మారింది. ఉదాహరణకు లక్నోకు చెందిన అడా డిజైనర్ చికాన్ స్టూడియో వారి కొత్త ఉత్పత్తులను ప్రచారం చేసుకోడానికి ఐజిటివిని ఉపయోగిస్తోంది. కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడానికి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంభాషణ, మార్కెటింగ్కి కూడా దీన్ని ఉపయోగిస్తోంది. మరో విషయం ఏమిటంటే ఇలాంటి సమయంలో చేసే కొద్దిగ ఆర్థిక సహాయ మైనా చిన్న వ్యాపారులకు ఎంతోగానో సహాయపడుతుంది. అందుకే భారత దేశంతో సహా 30 దేశాలలో 30,000 చిన్న వ్యాపారాలకు సహాయం చేయడానికి మేము 747 కోట్ల రూపా యాల గ్రాంట్ ప్రో గ్రామ్ను రూపొం దించాం. మహ మ్మారి విజృంభి స్తున్న పరిస్థితులు చూస్తుంటే చిన్న వ్యాపారాలు కోలు కోవడం చాలా కష్టంగా అనిపిం చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అంటున్నారు.
పరిష్కారాలకై పరిశోధించాం
స్కడూష్లో ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇండిస్టీకి సంబంధించిన మార్కెటింగ్ ఏజెన్సీకి కో ఫౌండర్గా నేను ఉన్నాను. ఈ సమయంలో మేము సెమినార్లు, వెబ్ నార్లను నిర్వహించడంపై ప్రత్యేకంగా దష్టి సారించాం. ప్రస్తుత పరిస్థితులను తట్టుకోగలిగే పరి ష్కారాలకై పరిశోధించాం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యా పారం ఎలా ఉంటుందో అని కాస్త ఆందోళన చెందా ము. కానీ సోషల్ మీడియా సహాయంతో మా వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగించ గలమనే నమ్మకం ఏర్పడింది.
- వి.ప్రియా
ఉద్యోగస్తులకు ఆదాయం వుంటేనే
చిన్న వ్యాపారాలు కొనసాగడం అనేది ఉద్యోగస్తులకు వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. మేము చేతివృత్తులు తయారు చేస్తాం. లాక్డౌన్ నుండి కాస్త తేరుకుని మా పనిపై దృష్టి పెట్టాం. ఉద్యోగుల ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీర్చడంపై మా దృష్టి కేంద్రీకరించాం. అప్పుడే మా వ్యాపారం విజయవంతం అవుతుంది. దానికోసం ముందుగా మమ్మల్ని మేము మానసికంగా, ఆర్ధికంగా సిద్ధం చేసుకు న్నాము. మా ఇకామర్స్ ఛానల్ ఫిజ్జి గోబ్లెట్.కామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై దష్టి కేంద్రీకరించాము. ఇంటి నుండే ఈ పనిని చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మేము మా ఆన్లైన్ ఛానెల్ను ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచకుంటూ వచ్చాము. లాక్డౌన్ సమయంలో ఇది మాకు ఎంతగానో ఉపయోగ పడింది. అయితే మొదటి ఆరు వారాలు ఆన్లైన్లో కూడా డెలివరీలను నిషేధించారు. ఆ సమయంలో కూడా కస్టమర్లతో నిరంతరం సంభా షిస్తూ సన్నిహితంగా ఉన్నాము. మే ప్రారంభంలో డెలివరీలు ప్రారంభ మైన తర్వాత మా ఇకామర్స్ ఛానెల్ గణనీయంగా మెరుగు పడింది. ఇప్పుడు గతంకంటే కూడా మా వ్యాపారం మరింత అభివృద్ది చెందింది.
- లక్షిత గోవిల్, ఫిజ్జిగోబ్లెట్ వ్యవస్థాపకురాలు
ఫేస్బుక్ సహకారంతో
మహమ్మారి మా కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రవాణా మొత్తం స్థంబించిపోయింది. దాంతో లోడింగ్, అన్లోడింగ్కి చాలా కష్టంగా మారింది. లక్నో నగర పరిధిలో అనేక కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. దాంతో సప్లరు తీవ్రంగా ప్రభావితమైంది. ప్రజలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడటంతో మా చేతివృత్తుల దుకాణాలలో వ్యాపారం బాగా తగ్గింది. ఇలాంటి సమయంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై ఎక్కువగా ఆధారపడ్డాం. వాటి సాయంతో ఇప్పటికే ఉన్న కస్టమర్లతో మాట్లాడ డానికి, వారికి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి ఫేస్బుక్ మెసెంజర్ను ఉపయోగించాము. ఇంటి నుండి షాపింగ్ చేయాలనుకునే మా కస్టమర్ల కోసం ఐజిటివిని కూడా ఉపయోగించాం. మా వ్యాపార ప్రచారం కోసం ఫేస్బుక్ యాడ్ మేనేజర్ను కూడా ఉపయోగపడింది.
- రియా