Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ తర్వాత ముస్లింలకు మరో పెద్ద పండుగ బక్రీద్. రెండు రోజుల్లో పండుగ రాబోతుంది. త్యాగానికి చిహ్నంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మేక మాంసాన్ని పేదలకు పంచుతారు. కరోనా వల్ల గతంలో మాదిరి పండుగ చేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లోనే వుండి బక్రీద్ జరుపుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టిక ఆహారాన్ని తప్పక తీసుకోవల్సిన సమ యం ఇది. కాబట్టి బక్రీద్ సందర్భంగా అలాంటి కొన్ని వంటకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
స్వీట్ బాసుంది
కావల్సిన పదార్థాలు : బాస్మతి రైస్ - ఒక కప్పు, పాలు - అర లీటరు, కండెన్డ్స్ మిల్క్(పాలను బాగా మరిగించి మీగడ తీసిన పాలు) అర కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్, ఎండు ద్రాక్ష - రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా కట్ చేసుకోవాలి), నూనె - టేబుల్ స్పూన్, పంచదార - ఎమినిమి టేబుల్ స్పూన్లు, గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుపువ్వు నానబెట్టుకోవాలి.
తయారుచేయు విధానం : ముందుగా బియ్యంను నీళ్ళలోవేసి శుభ్రంగా కడిగి, నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీరు వంపేసి కచ్చాపక్కాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరకప్పు నీటిని పాన్లో పోసిన మరిగించాలి. తర్వాత అందులో రుబ్బిపెట్టుకొన్న బియ్యం పిండిని వేయాలి. ఐదు నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి. తర్వాత అందులో పాలు కూడా పోసి నిధానంగా కలియబెడుతూ, బియ్యంపిండి పాత్ర అడుగు అంటకుండా చూడాలి. అలాగే నెయ్యి వేసి మిక్స్ చేయాలి. ఇలా ఒక్కసారి రైస్ను ఉడికించుకొన్న తర్వాత, అందులోనే పంచదార కూడా వేసి మరో రెండు నిముషాలు మిక్స్ చేసి ఉడికించుకోవాలి. మొత్తం పదార్థాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. తర్వాత అందులో ముందుగా కుంకుమపువ్వు నానబెట్టిన పాలను కూడా పోసి బాగా మిక్స్ చేయాలి. చివరగా కట్ చేసి రోస్ట్ చేసి పెట్టుకొన్న నట్స్ను గార్నిషింగ్గా వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే కలర్ ఫుల్ స్వీట్ బాసుంది రెడీ. అంతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయడమే ఆలస్యం. బాసుందిని చల్లగా లేదా వేడిగా కూడా సర్వ్ చేయవచ్చు.
మటన్ కోఫ్తా బిర్యానీ
తయారీకి కావల్సిన పదార్థాలు
రైస్ తయారీకి : బాస్మతి రైస్ - 4 కప్పులు, కరవే సీడ్స్ - అర టేబుల్ స్పూన్.
గరం మసాలా కోసం: పెప్పర్ కార్నర్ - ఏడు, లవంగాలు - కొద్దిగా, యాలకులు - ఐదు, షాజీర - టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క - 1 అంగుళం, కుంకుమపువ్వు - చిటికెడు(పాలలో నానబెట్టాలి), ఉప్పు - రుచికి సరిపడా.
కోఫ్తా తయారీకి కావల్సినవి : మటన్ ఖీమా - 500 గ్రా|| ఉల్లిగడ్డ- ఒకటి(పేస్ట్), గరం మసాలా పౌడర్ - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, గసగసాలు - టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ - టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, ఫ్రెష్ క్రీమ్ - టేబుల్ స్పూను, కారం - టేబుల్ స్పూను, కొబ్బరి తురుము - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - కప్పు, శెనగపిండి - టేబుల్ స్పూను, నట్ గమ్ పౌడర్ - అర టేబుల్ స్పూను, బ్రెడ్ - ఒక ముక్క (పాలలో నానబెట్టుకోవాలి)
కర్రీ తయారీకి కావల్సినవి : నూనె - అర కప్పు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, టమాటా - రెండు, అల్లం పేస్ట్ - టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీస్పూను, పసుపు - పావు స్పూను, పెరుగు - మూడు టేబుల్ స్పూన్లు, గరం మసాలా - అర స్పూను, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, క్విరా వాటర్ - ఒక టేబుల్ స్పూను, పుదీనా - కప్పు, ఎల్లో ఫుడ్ కలర్ - చిటికెడు, నట్ గమ్ పౌడర్ - పావు టీస్పూను, గ్రీన్ కార్డమ్ పౌడర్ - పావు టీస్పూను,
తయారుచేయు విధానం
రైస్ తయారీ : ముందుగా బియ్యంను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత డీప్ బాటమ్ పాన్లో నీరు మరిగించి పెట్టుకోవాలి. నీరు మరుగుతుండగా, అందులో గరం మసాలా జోడించాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం అందులో వేసి, బియ్యంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలబెట్టి, ఉడికించుకోవాలి. బియ్యం ముప్పావు వంతు ఉడికిన తర్వాత నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
కోప్తా తయారీ : కోప్తా కోసం సిద్దంగా ఉంచుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని ఒక్కసారిగా పొడి చేసుకోలేకపోతే, రెండు మూడు పదార్థాలు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. కోఫ్తా కోసం సిధ్దం చేసుకున్న పదార్థాలను గ్రైండ్ చేసుకున్న పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి రిఫ్రిజరేటర్లో 30 నుండి 40 నిముషాల వరకూ ఉంచాలి. 40 నిముషాల తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. పాన్ మొత్తం నూనెను చేతులతో అప్లై చేయాలి. ఇప్పుడు ఫ్రిజ్లో నుండి తీసిన మీట్ మిశ్రమంను చేత్తో చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మీట్ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకున్నాక తిరిగి రిఫ్రిజరేటర్లో పెట్టాలి.
కర్రీ తయారీ : పాన్ స్టౌ మీద పెట్టి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి నిముషం వేగించాలి. వేగిన తర్వాత అందులో ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో టమాటా పేస్ట్, మచ్చిమిర్చి, పసుపు, ప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి. అవసరమయితే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సాప్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి, ఇందులో రిఫ్రిజరేటర్లో పెట్టుకున్న కోఫ్తాలను వేయాలి. అలాగే చిక్కగా చిలికిన పెరుగు కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టాలి. మొత్తం మిశ్రమం ఉడకడం ప్రారంభించాక 20 నిముషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోనే నట్ మగ్ పౌడర్, పుదీనా, కొత్తిమీర ఆకులు తరుగు వేసి కలుపుకోవాలి.
బిర్యానీ తయారీ : డీప్ బాటమ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి రాసి, రైస్ను పొరలుగా సర్ధాలి. తర్వాత కోఫ్తా కర్రీని మరో పొరగా సర్దాలి. తిరిగి రైస్ లైయర్, కోఫ్తా లేయర్ రెండు మూడు లేయర్స్గా సర్ధుకోవాలి. ఫైనల్గా కెవరా నీటిని, పాలలో నానబెట్టిని కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్ను చిలకరించుకోవాలి. 10 నిముషాలు తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. తర్వాత ఆవిరి మీద 10 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే మటన్ కోఫ్తా బిర్యానీ రిసిపి రెడీ. రైతా లేదా గ్రీన్ సలాడ్తో ఎంజారు చేయొచ్చు.
మటన్ గల్లౌటి కబాబ్
కావల్సిన పదార్థాలు : మటన్ కీమా - 1 కేజీ, పచ్చి బొప్పాయి పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, ఏలకులు పొడి - 1 స్పూన్, పసుపు కారం పొడి - 1 స్పూన్, చనా పొడి - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - అర స్పూన్, జాపత్రి పొడి - అర స్పూన్, ధనియాల పొడి - 1 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 1 కప్పు.
తయారు చేసే విధానం : మటన్ కీమాను నీటితో శుభ్రంగా కడిగి పచ్చి బొప్పాయి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాపత్రి పొడి, గరం మసాలా పొడి వేయాలి. ధనియాల పొడి, పసుపు, కారం, చనా పొడి, ఏలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. గంట తరువాత ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్లో తీసుకోని టిక్కీలుగా చేసుకోవాలి. పాన్లో నూనె పోసి వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో టిక్కీలను వేసి రెండు వైపుల 15-20 నిముషాల పాటు వేగించాలి. కీమా బాగా ఉడికినట్టు నిర్ధారణ చేసుకోవాలి. కబాబ్ రెండు వైపుల గోల్డ్ రంగు రావాలి. కబాబ్స్ పూర్తిగా వేగాక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేయండి.