Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసుపు సాధారణ రంగు కంటే కాస్త ఘాఢంగా ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా పసుపు లేత పసుపు రంగులో ఉంటుంది. రసాయనాలు కలిపి తయారు చేసిన పసుపును వంటల్లో వాడితే మనం రోగాలకు స్వాగతం పలికినట్లే. గ్లాస్ నీళ్లు తీసుకొని అందులో పసుపు వేయాలి. స్వచ్ఛమైన పసుపు అయితే కొద్దిగా రంగును విడుదల చేస్తూ అడుగుకు చేరుకుంటుంది. అదే కల్తీ అయితే కలపకుండానే నీరు మొత్తం పసుపు రంగుకు మారిపోతుంది.
- ధనియాల పొడిలో గడ్డి గింజల పొడి కలుపుతారు. లేదా ఎండబెట్టిన పేడను కలుపుతారు. ఈ కల్తీని తెలుసుకునేందుకు ధనియాల పొడి వాసనను చూడాలి. చక్కటి ధనియాల పొడి వాసన రాకపోతే అందులో కల్తీ జరిగిందన్నమాటే.
- నిత్యం వాడే వంటల్లో ఇది చాలా ముఖ్యమైంది. అయితే ఈ మధ్యకాలంలో దీనిలో పలు రసాయనాలతో పాటు రంపపు పొట్టు, ఇటుక పొడి వంటివి కలుపుతున్నారు. దీనిని గుర్తించేందుకు ఓ గ్లాస్లో నీళ్లు పోసి అందులో కారం వేయాలి. ఒకవేళ కారం నీళ్లపై తేలియాడితే.. అందులో రంపపు పొట్టు ఉన్నట్లు లెక్క. ఒకవేళ నీరు ఎరుపు రంగులోకి మారితే కెమికల్ కలిసిందని చెప్పచ్చు. అదే స్వచ్ఛమైన కారం కొద్దిగా రంగును విడుదల చేసి నీటి అడుగున ఉండిపోతుంది. ఇటుక పొడి ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే.. కారాన్ని చేతి వేళ్లతో తీసి కాస్త నలపాలి. ఒకవేళ అప్పుడు అది ఇసుక మాదిరిగా అనిపిస్తే.. కారంలో ఇటుక పొడి కలిసిందని చెప్పచ్చు.
- ఈ మధ్యకాలంలో దాల్చిన చెక్క పొడిని రంపపు పొట్టుతో కలిపి కల్తీ చేస్తున్నారు. అలాగే చెక్కను కూడా వేరే చెట్టు బెరడు ను ఉపయోగించి కల్తీ అంటకడుతు న్నారు. వీటిని గుర్తిం చడం సులువే. ఒకవేళ రంపపు పొట్టు అయితే నీటిపై తేలుతుంది. సాధా రణంగా దాల్చిన చెక్క లేదా ఆ పొడిని చేతిపై రుద్దితే కాస్త రంగు వస్తుంది. అలా రంగు రాకపోతే అది దాల్చిన చెక్క కాదని గుర్తుంచుకోవాలి.
- ఆవాల్లో కల్తీని కనుక్కోవాలంటే ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఆవాలు వేయాలి. బ్రహ్మ జెముడు విత్తనాలు నీటిలో తేలతాయి. ఆవాలు అడుగున చేరుకుంటాయి.
- మిరియాల్లో కల్తీని గుర్తించేందుకు కూడా గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో మిరియాలు వేయాలి. బొప్పాయి గింజలు నీటిపై తేలతాయి. మిరియాలు అడుగుకు చేరుకుంటాయి.
- ఇంగువ పొడిలో చాక్ పీస్ పొడి కలుపుతారు. దీన్ని గుర్తించేందుకు కాస్త యాసిడ్ని దానిలో కలిపాలి. పొగలు వస్తే కల్తీ జరిగినట్లు.. ఒకవేళ రాకపోతే స్వచ్ఛమైనది అన్నట్లు లెక్క.