Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. ఈ జున్నుతో రకరకాల వంటకాలు చేసి తీసుకుంటారు. దీనిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదేనని చెప్తున్నారు వైద్యులు. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కూడా ఇదో మంచి మార్గం. జున్ను తీసుకుంటే కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.
- కొంత మంది చూడటానికి చాలా బక్కగా, సన్నగా ఉంటారు. అలాంటివారు ప్రతిరోజూ జున్ను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచూ దీనిని తింటే.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
- జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.
- గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. తల్లిపాలు కూడా వద్ధి చెందుతాయి.
- జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపవుతుంది.
- జున్ను విరేచననాలు, మలబద్దక సమస్యలను తొలగిస్తుంది.
- మధుమేహ వ్యాధితో బాధపడేవారు రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
- శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
- శరీరంలో విటమిన్ డి కారణంగా ఆస్టియోపోరోసిస్ లోపానికి గురికావలసి వస్తుంది. ఈ లోపాన్ని తొలగించాలంటే జున్ను తీసుకోవాలి. జున్నులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఈ లోపాన్ని తొలగించుటలో ఎంతో దోహదం చేస్తుంది.