Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముల్తానీ మట్టిని జారుగా కలుపుకునేందుకు గులాబీ నీటిని ఉపయోగించాలి. ఈ మిశ్రమాన్ని ఎండలో నుంచి తిరిగొచ్చాక ఫేస్ ప్యాక్లా వేసుకుంటే ఎండ తాలూకు ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది.
- మొటిమలూ, వాటి తాలూకు మచ్చలతో ముఖం కాంతిని కోల్పోతే ముల్తానీ మట్టిని చెంచా తులసి పొడీ, చెంచా గంధం పొడీ వేసి వాటన్నింటినీ పచ్చిపాలతో మెత్తని పేస్ట్లా చేయాలి. దీన్ని రోజూ రాత్రిపూట ముఖానికి పూతలా వేసుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సమస్య దూరమవుతుంది. చర్మం తాజాగా మారుతుంది.
- కొందరి చర్మం సాగినట్లు కనిపిస్తుంది. ఇలాంటివారు అరకప్పు ముల్తానీ మట్టీ, కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఓట్స్, రెండు చెంచాల టమాటా గుజ్జుని మెత్తగా కలుపుకుని ప్యాక్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుని ముఖానికి బాదం నూనె పట్టిస్తే చర్మం నిగనిగలాడుతుంది.
- పొడి చర్మతత్వం కలవారు ముల్తానీ మట్టిలో చెంచా తేనె, చెంచా బాదం నూనె, అరచెంచా మీగడ, గులాబీ నీరూ కలిపి ముఖానికీ, మెడకీ, చేతులకీ రాసుకోవాలి. పూర్తిగా ఆర కుండానే కడిగే సుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని సహజ నూనె గ్రంథులు బయటికి పోవు. చర్మానికి తగిన తేమ అంది, కాంతివంతం గా కనిపిస్తుంది.