Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంత్రా, టమాటా రసాన్ని సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మాస్క్లా వేసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేయండి. ఇలా రోజూ చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతంది.
- పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్లా చేసుకొని ముఖానికి మాస్క్లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.
- ఎండబెట్టిన సంత్రా పండు తొక్కలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్లా ఉపయోగించండి.
- దోసకాయను తీసుకొని దానికి ఓట్మిట్, మూడు టీస్పూన్స్ తేనెను కలిపి పేస్ట్లా చేసుకోవాలి. దానికి ముఖానికి మాస్క్లా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.
- రోజ్వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి.