Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఉద్యోగినులూ, విద్యార్థినులూ చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తారు తప్ప ఆహారం, ఆరోగ్యం విషయంలో అంతగా దృష్టి పెట్టరు. దానికి తోడు వాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు అనారోగ్యాలకు దారితీస్తాయి. అసలు అలాంటి వారు చేయకూడనివేంటో.. చేయాల్సినవేంటో తెలుసుకుందామా!
అ చాలామంది లేవగానే టీలూ, కాఫీలూ తాగుతుంటారు. వీటి వల్ల పరగడుపున కెఫీన్ లోపలికి వెళ్లిపోతుంది. అలాకాకుండా పళ్లు తోముకున్న వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగాక ఏదయినా తింటే మంచిది. అలా చేయడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. అ అల్పాహారం కాస్త ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటారు నిపుణులు. అలాగని మసాలా, నూనె కలిసినవీ, వేపుళ్ల లాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఒక వేళ తీసుకున్నా వాటి మోతాదు చాలా పరిమితంగా ఉండాలి. కీరదోస, పుచ్చకాయ, క్యారెట్లు, మొక్కజొన్న గింజలు వంటివి చేర్చుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. వీటిలో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
అ భోజనం విషయానికొస్తే కొందరు సమయం ఉన్నా హడావుడిగా నాలుగు ముద్దలు తినేస్తారు. ఇలా చేయడం వల్ల గాలి లోపలికి వెళ్లిపోయి త్వరగా కడుపు నిండుతుంది. గబగబా తినడం వల్ల జీర్ణశక్తి మందగించి ఉదర సంబంధిత సమస్యలు బాధించే అవకాశం ఉంది. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్... ఇలా ఏం తినడానికైనా మధ్యలో సమయం రెండున్నర గంటల వ్యవధి తప్పనిసరిగా ఉండాలి.